సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయం
సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయమని, చెప్పింది చేయడానికి కట్టుబడి ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పరని, అందుకు ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు.
ముఖ్యమంత్రి అద్దాల మేడలో ఉన్నారు: నడ్డా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నడ్డా, పాల్గొన పాత్రికేయులు, విభిన్నరంగాల ప్రముఖులు
భువనేశ్వర్, న్యూస్టుడే: సంకల్ప సిద్ధి భాజపా ధ్యేయమని, చెప్పింది చేయడానికి కట్టుబడి ఉంటుందని, ప్రధాని నరేంద్రమోదీ మాట తప్పరని, అందుకు ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. ఆదివారం రాత్రి భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడిన ఆయన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అద్దాల మేడలో ఉంటున్నారని, జనానికి దూరంగా ఉన్న ఆయనకు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలియదన్నారు. అధికారుల పాలన ప్రజలకు శాపంగా పరిణమించిందని, ప్రజా ప్రతినిధులు ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు.
అవాస్తవాలు చెబుతున్న బిజద
ఓటమి భయంతో బిజద నాయకత్వం అవాస్తవాలు చెబుతోందని, విశ్వసనీయత కోల్పోయిందన్నారు. భాజపా ఈసారి విపక్ష స్థానంలో కూర్చోవడానికి పోటీ చేయడం లేదని, అధికారంలోకి వచ్చి ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలించాలని కృతనిశ్చయంతో ఉందన్నారు.
మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్
భాజపా మేనిఫెస్టోను ఆషామాషీగా తీసుకోవడం లేదని, దీన్ని విజన్ డాక్యుమెంట్గా భాజపా పరిగణిస్తోందన్నారు. చెప్పినవి అమలు జరిగాయా? అన్నదానిపై ఒక సంఘం ఉంటుందని అది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందన్నారు. రాజకీయాలు అభివృద్ధికి, ప్రజలు సంక్షేమానికి అద్దం పట్టాలన్నారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న పార్టీలు విశ్వసనీయత కోల్పోతున్నాయన్నారు.
శ్రీక్షేత్రం లోపాలు చక్కదిద్దుతాం
విశ్వప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రం కోట్లాది మంది భక్తుల మనోభావాలు భక్తి ప్రవృత్తులకు ప్రతీక కాగా పాలనా లోపాల వల్ల అవినీతి జరుగుతోందన్నారు. జగన్నాథుని సన్నిధికి వస్తున్న వారంతా ఇబ్బందులు పడుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం చేసి, భక్తులందరికీ దివ్యానుభూతి కల్పించడం భాజపా ధ్యేయమని నడ్డా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి పరిధిలో విద్యార్థుల మృతి ఘటనలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్