logo

9 మంది మావోయిస్టుల లొంగుబాటు

బౌద్ధ్‌  ఎస్పీ కార్యాలయంలో దక్షిణ మండల ఐజీ జయనారాయణ పంకజ్‌ సమక్షంలో బుధవారం 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

Published : 09 May 2024 04:15 IST

లొంగిపోయినవారితో ఐజీ తదితరులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బౌద్ధ్‌  ఎస్పీ కార్యాలయంలో దక్షిణ మండల ఐజీ జయనారాయణ పంకజ్‌ సమక్షంలో బుధవారం 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ కేకేబీఎస్‌ దళం సభ్యులని ఐజీ విలేకరులకు చెప్పారు. లొంగిపోయిన మహిళా మావోయిస్టులు విలేకరులతో మాట్లాడుతూ... తమను లైంగిక వేధింపులకు గురి చేశారని, ఇబ్బందులు పడ్డామన్నారు. జనజీవన స్రవంతిలో చేరి మంచి పనులు చేయాలన్న ఉద్దేశంతో లొంగిపోయినట్లు తెలిపారు. వారికి పునరావాసం కల్పించే దిశగా ఏర్పాట్లు చేస్తామని ఐజీ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని