అధికార పార్టీకి ఎన్నికల అధికారి కొమ్ముకాస్తున్నారు: కోడూరు
కలెక్టర్, ఎన్నికల అధికారి స్మృతి రంజన్ ప్రధాన్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కోడూరు నారాయణరావు ఆరోపించారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నారాయణరావు, పక్కన చిత్రీ సింహాద్రి
పర్లాఖెముండి, న్యూస్టుడే: కలెక్టర్, ఎన్నికల అధికారి స్మృతి రంజన్ ప్రధాన్ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి కోడూరు నారాయణరావు ఆరోపించారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బిజద తరఫున ప్రచారం చేస్తున్న అధికారులపై ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకుండా వారికి మద్దతిస్తున్నారని మండిపడ్డారు. కాశీనగర్ సమితి పరతాడా పంచాయతీ కార్యనిర్వహణ అధికారి జాకబ్ గమాంగ్ ఎమ్మెల్యే అభ్యర్థితో ప్రచారం చేస్తున్న ఫోటోలు ఉన్నప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకోకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. 3, 8 వార్డుల రేషన్ డీలర్లు బసంతి పరిచా, జమీధర్ పట్నాయక్, గుసాని సమితి పాటికోట సొసైటీ కోపరేటివ్ సెక్రటరీ అడప వెంకట్రావు, మరికొందరిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు.మంగళవారం మధ్యాహ్నం మంత్రి అతాను సవ్యసాచి నాయక్ పట్టణానికి చేరుకొని, కొద్ది సమయంలోనే వెళ్లిపోయారని, డబ్బులు చేతులు మారి ఉంటాయని, దర్యాప్తు చేపట్టాలని, దీనిపై జిల్లా ఎన్నికల అధికారి పూర్తి వివరాలు తెలియజేయాలని అన్నారు. వీటిపై జిల్లా, కేంద్ర ఎన్నికల పరిశీలకులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. బూత్ల వద్ద ఎన్నికల అధికారి వల్ల ప్రభుత్వ ఉద్యోగుల సహకారం తమకు తక్కువగా ఉందని, అందువల్ల తమ క్యాడర్ను అక్కడ ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాశీస్సులు భాజపాకే ఉన్నాయి: ధర్మేంద్ర
[ 20-05-2024]
ఎన్నికల ధర్మయుద్ధంలో విజయావకాశాలు భాజపాకే ఉన్నాయని, అన్ని చోట్లా ప్రజలు ఆశీర్వదిస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ రాక నేపథ్యంలో ముందుగా శనివారం రాత్రి భువనేశ్వర్లోని పార్టీ కార్యాలయంలో కార్యవర్గ ప్రతినిధుల సమావేశం జరిగింది. -
చారిత్రక నగరం.. ఎవరికి అందేనో విజయం?
[ 20-05-2024]
చారిత్రక నగరం కటక్ ఈసారి ఎవరి సొంతమవుతుంది? ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు?.. ఇద్దరు ఉద్ధండులు నువ్వా? నేనా? అన్న రీతిలో తల పడుతున్నారు. విజ్ఞతకు నిలువుటద్దమైన ప్రజల తీర్పు ఈసారి ఎలా ఉంటుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. -
మీ ముద్దు బిడ్డ దేశం గర్వించదగ్గ యువనేత
[ 20-05-2024]
ఈ రాష్ట్రానికి చెందిన మీ ముద్దుబిడ్డ దేశం గర్వించదగిన నేతగా ఎదిగారని, తన సామర్థ్యం నిరూపించుకున్నారని, ఆయన పనితీరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ప్రశంసించారు. -
సమీర్ రాజీనామా...
[ 20-05-2024]
పూరీ జిల్లాకు చెందిన బిజద అగ్రనేత, విద్యాశాఖ మాజీ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం బిజద ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి నవీన్కు లేఖ పంపించారు. -
నేడు పూరీలో మోదీ రోడ్షో
[ 20-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 7 గంటలకు భువనేశ్వర్ నుంచి పూరీకి వస్తారు. తాలబణియా తాత్కాలిక హెలిప్యాడ్లో దిగనున్న ఆయన నేరుగా శ్రీక్షేత్రానికి చేరుకుని జగన్నాథుని సన్నిధిలో పూజలు చేస్తారు. -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 20-05-2024]
నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బసంత కుమార్ నాయక్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..