Andhra News: అత్తపై కూర్చొని.. ముఖాన్ని నేలక్కొట్టి..!
అత్తాకోడళ్ల మధ్య జరిగిన తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి అత్త ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని రావివలసలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన గుంట్రెడ్డి రాములమ్మ(65)కు
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్టుడే: అత్తాకోడళ్ల మధ్య జరిగిన తగాదా ఘర్షణకు దారి తీయడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి అత్త ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయనగరంలో మండలంలోని రావివలసలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గ్రామానికి చెందిన గుంట్రెడ్డి రాములమ్మ(65)కు నలుగురు కుమారులు. ప్రస్తుతం ఈమె చిన్న కుమారుడు శివకుమార్, కోడలు గౌరీశ్వరి వద్ద ఉంటున్నారు. తరచూ అత్త, కోడలు మధ్య తగాదాలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. గురువారం ఉదయం ఆర్ఎంపీగా చేస్తున్న శివకుమార్ పనిమీద బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. ఇంటి లోపల గడియ వేసి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ సమయంలో అత్తను నెట్టి, ఆమెపై కూర్చొని ముఖాన్ని బలంగా పలుమార్లు నేలకు కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ముఖమంతా రక్తసిక్తమై రాములమ్మ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. కొంత సేపటికి వచ్చిన శివకుమార్ తల్లి రక్తపుమడుగులో ఉండటాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్వతీపురం డీఎస్పీ, పాలకొండ నుంచి పోలీసు బృందాలు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమి విజయంతో భవిష్యత్తు
[ 03-05-2024]
కూటమి అభ్యర్థుల విజయంతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మండలం వెంకంపేటలో జరిగిన ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. -
వంద పడకలేనా.. జగన్
[ 03-05-2024]
సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట, మక్కువ, సాలూరు మండలాలకు, గిరిశిఖర గ్రామాల వారికి ఈ ఆసుపత్రే పెద్దదిక్కు. గిరిజనులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. -
అవినీతి బొత్స.. అక్రమాల కోలగట్ల
[ 03-05-2024]
చీపురుపల్లి, విజయనగరం సభల్లో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ మరో అభినవ అంబేడ్కర్. ఆయన అమలు చేసిన పథకాలన్నీ ప్రజలకు ఆమోదయోగ్యమైనవి. -
అక్కసుతో.. ‘ఇంత’ కర్కశత్వమా?
[ 03-05-2024]
ఇదేం ప్రభుత్వం.. ఇదెక్కడి అరాచకం.. అభ్యాగులపై ఇంత పగ ఎందుకు.. అందరూ 60 ఏళ్లు దాటిన వృద్ధులే.. అనారోగ్యంతో కొందరు.. దీర్ఘకాలిక వ్యాధులతో మరికొందరు.. నడుము వంగక కూర్చుని పాకేవారు ఇంకొందరు.. వీరితోనా మీ ఓటు రాజకీయం.. చేతికిచ్చే అవకాశం ఉన్నా.. ఎక్కడెక్కడి నుంచో బ్యాంకులకు మండుటెండలో రప్పించి ఏడిపిస్తారా. -
బాలయ్య అన్స్టాపబుల్!
[ 03-05-2024]
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేపట్టిన ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ సభ గురువారం సాయంత్రం చీపురుపల్లిలో దిగ్విజయంగా జరిగింది. -
పాలకొండను బంగారు కొండగా మారుస్తా!
[ 03-05-2024]
‘పాలకొండను బంగారుకొండగా మారుస్తా. ఇక్కడ అపారమైన వనరులు ఉన్నందున పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. -
నీడ కరవు.. భోజనం బాగోలేదు
[ 03-05-2024]
రాజాం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా పీవోలు, ఏపీవోలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. -
మాజీ వాలంటీర్లతో ఐప్యాక్ బృందం సమావేశం?
[ 03-05-2024]
కొత్తవలస మండలంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లతో ఐప్యాక్ బృందం అర్ధానపాలెంలోని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు క్యాంపు కార్యాలయం ఆవరణలో గురువారం ప్రత్యేకంగా భేటీ అయిందని తెలిసింది. -
జగ‘మొండి’.. ‘న’డవని బండి..!
[ 03-05-2024]
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అనేది నినాదం.. డొక్కు బండిలో ప్రయాణం భయం.. భయం నేటి వాస్తవం.