సగటు వేతనం రూ.. 197
ఉమ్మడి జిల్లాలో వలసల నివారణకు ఉపాధి పనులే ఆధారం. ఇందుకు అనుగుణంగా ఏటా అక్టోబరు నుంచి గుర్తించిన పనులకు గ్రామసభలు నిర్వహించి బడ్జెట్ ఆమోదం పొందుతున్నారు.
ఇప్పటి వరకూ రూ.606.86 కోట్ల వ్యయం
వంద రోజుల పని కొందరికే
ఉపాధి హామీ పథకం తీరిది
రాజాం, న్యూస్టుడే
ఉమ్మడి జిల్లాలో వలసల నివారణకు ఉపాధి పనులే ఆధారం. ఇందుకు అనుగుణంగా ఏటా అక్టోబరు నుంచి గుర్తించిన పనులకు గ్రామసభలు నిర్వహించి బడ్జెట్ ఆమోదం పొందుతున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఆ పనులు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది తొలి విడతలో కేటాయించిన పనిదినాలు పూర్తి కావడంతో అదనంగా మంజూరు చేశారు. అవి కూడా పూర్తి కావొస్తున్నాయి. కొత్త వాటితో కలిపి 2.30 కోట్ల పనిదినాల్లో 92.56 శాతం ఇప్పటికే పూర్తయ్యాయి.
అడిగిన వారందరికీ...
జాబ్కార్డు పొందిన ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలి. అడిగిన వారందరికీ ఉపాధి చూపకపోతే వేతనం చెల్లించాలనేది నిబంధన. ఉమ్మడి జిల్లాల్లో 2020-21లో 1,47,704 కుటుంబాలకు వంద రోజులు కల్పించగా గతేడాది 39,660 కుటుంబాలకే పరిమితమైంది. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో 1,357, పార్వతీపురం మన్యం జిల్లాలో 2,903 కుటుంబాలు ఇంత వరకు వంద రోజులు చేసినట్లు గుర్తించారు. నాలుగు నెలల్లో మిగిలిన వారందరికీ చూపించడం అసాధ్యంగానే కనిపిస్తోంది.
* పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఉన్న 447 పంచాయతీల్లో 2.40 లక్షల కుటుంబాలు జాబ్కార్డులు పొందగా 4.98 లక్షల మంది కూలీలున్నారు. 1.95 లక్షల కుటుంబాల్లోని 3.65 లక్షల మంది పనులు చేసేందుకు ఆసక్తి చూపుతుండగా.. 1.64 లక్షల కుటుంబాల్లోని 2.83 లక్షల మందికి ఇప్పటి వరకూ ఉపాధి కల్పించారు.
కేంద్రం ఇచ్చేది
ఏటికేడు కుటుంబ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని సవరిస్తూ వస్తోంది. గతేడాది రూ.245గా నిర్ణయించగా ఈ ఏడాది మరో రూ.12 పెంచింది.
ఇక్కడ అందేది
ఒక్కో వేతనదారునికి ప్రభుత్వం నిర్దేశించింది రూ.257 కాగా విజయనగరం జిల్లాలో ఇది రూ.202 లోపే ఉంది. పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.197 దాటడం లేదు.
ఎంత తేడా
ఈ లెక్కన విజయనగరం జిల్లాలో రోజుకు రూ.55 తగ్గిపోయింది. ఇక్కడ ఇంత వరకూ 135.43 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో రోజుకు రూ.60 తగ్గింది. ఇక్కడ 77.46 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఈ లెక్కన చూస్తే.. రెండు జిల్లాల్లో కూలీలు రూ.కోట్లలో వేతనాలను కోల్పోయారు.
గతం కంటే పెరిగింది.. కనీస వేతనం అయిదు నెలల కిందటి వరకూ రూ.165 గిట్టుబాటు అయ్యేది. ఇప్పుడు రూ.197కు పెరిగింది. వచ్చే మూడు నెలల్లో రూ.220కు పెరిగేలా ప్రణాళిక సిద్ధం చేశాం. రాష్ట్రంలో 100 రోజుల పని ఎక్కువ కల్పించిన నాలుగు జిల్లాల్లో పార్వతీపురం మన్యం ఒకటి.
- రామచంద్రరావు, పీడీ, డ్వామా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక