జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కష్టాలు
జిల్లాల ఏర్పాటు తర్వాత పార్వతీపురం ప్రజలకు సౌకర్యాల కంటే సమస్యలే అధికమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలో రహదారులు, ఉద్యాన కేంద్రాలు, మూత్ర విసర్జన స్థలాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు లాంటి వసతులు పూర్తిస్థాయిలో సమకూరడం లేదు.
పార్వతీపురం ప్రధాన రహదారిలో ఇదీ పరిస్థితి..
పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: జిల్లాల ఏర్పాటు తర్వాత పార్వతీపురం ప్రజలకు సౌకర్యాల కంటే సమస్యలే అధికమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలో రహదారులు, ఉద్యాన కేంద్రాలు, మూత్ర విసర్జన స్థలాలు, పార్కింగ్ స్థలాలు, తాగునీరు లాంటి వసతులు పూర్తిస్థాయిలో సమకూరడం లేదు. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత పార్వతీపురానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరిగింది. స్పందన కార్యక్రమంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు రోజూ 15 మండలాల నుంచి ప్రజలు వస్తుండటంతో పట్టణ రహదారులు రద్దీగా మారుతున్నాయి. దీంతో పాటు వాటిని పార్కింగ్ చేసే స్థలాలు లేక రోడ్లపైనే నిలిపేస్తున్నారు. కనీసం పాదచారులు వెళ్లేందుకు కూడా దారి లేకుండా పోతుంది.
పెరిగిన రాకపోకలు..
పార్వతీపురంలోని 30 వార్డుల్లో 60 వేలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ సుమారు 12 వేల నుంచి 15 వేల వరకు వివిధ రకాల వాహనాలున్నాయి. వీటితో పాటు ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి రోజుకు సుమారు 10 నుంచి 15 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ రోడ్ల విస్తరణ జరగక పోవడంతో ఇరుకుగా మారుతున్నాయి. ఇక్కడ దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు మొదలైన ప్రాంతాల్లో పార్కింగ్ చేసే వీలు లేక చాలా మంది రోడ్లపైనే వదిలేస్తున్నారు.
ఈ ప్రాంతాల్లో సమస్య..
పార్వతీపురం పట్టణం 11 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. బెలగాం శివారు నుంచి రాయగడ రోడ్డు వరకు సుమారు రెండు కిలో మీటర్ల పొడుగునా దుకాణాలు, బ్యాంకులు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటితో పాటు రోడ్డు పక్కన చిల్లర వ్యాపారాలు, తోపుడు బళ్లు దర్శనమిస్తాయి. ముఖ్యంగా బెలగాం చర్చికూడలి, ఆర్టీసీ కాంప్లెక్సు, స్టేట్ బ్యాంకు కూడలి, సౌందర్య రోడ్డు, మేధర వీధి, నెయ్యిల వీధి కూడలి, పురపాలిక మార్కెట్, నాలుగు రోడ్ల కూడలి, పాతబస్టాండ్, ఆర్టీసీ కూడలి సమీపంలో వైఎస్సార్ బొమ్మ నుంచి బైపాస్ రోడ్డు మలుపు వరకు, రాయగడ రోడ్డులో సమస్య ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొన్నేళ్ల క్రితం పోలీసు, పుర, రెవెన్యూ అధికారులు ఆలోచన చేశారు. పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు అనువైన స్థలాల కోసం అన్వేషించారు. అనంతరం అధికారులు మారడంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
నిరంతర పర్యవేక్షణ..
- పాపారావు, ట్రాఫిక్ ఎస్ఐ, పార్వతీపురం
పట్టణంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. రోడ్లపై వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రధాన కూడళ్ల వద్ద ఇబ్బందులు ఎదురవ్వకుండా చూస్తున్నాం. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి శ్రద్ధ చూపుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..