మింగేస్తున్నారండి.. ‘భూములు, స్థలాలు’
పార్వతీపురం జిల్లా కేంద్రంగా అవతరించిన తర్వాత సమీపంలోని భూమి విలువ భారీగా పెరిగింది. దీంతో ఏ తోడు లేని వారి స్థలాలపై ఆక్రమణదారులు కన్నేస్తున్నారు.
పార్వతీపురం, న్యూస్టుడే: పార్వతీపురం జిల్లా కేంద్రంగా అవతరించిన తర్వాత సమీపంలోని భూమి విలువ భారీగా పెరిగింది. దీంతో ఏ తోడు లేని వారి స్థలాలపై ఆక్రమణదారులు కన్నేస్తున్నారు. చివరికి ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన జగనన్న కాలనీల్లోని స్థలాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. గతంలో ఇదే సమస్యపై అర్జీలు ఎక్కువగా రావడంతో కలెక్టర్ చొరవ చూపి ఆక్రమణలకు అడ్డుకట్ట వేశారు. కొన్నాళ్లు మౌనంగా ఉన్న కబ్జాదారులంతా మళ్లీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తోచక బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం కలెక్టరేట్లో జేసీ ఒ.ఆనంద్, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్ ఆధ్వర్యంలో జరిగిన స్పందనకు వచ్చిన 96 అర్జీల్లో ఇలాంటివే ఎక్కువ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మాజీ సైనికుల భూమినీ ఆక్రమించేశారు
పార్వతీపురానికి చెందిన బెహరా అమ్మాజీ భర్త సైన్యంలో పనిచేశారు. మాజీ సైనికుల కోటాలో పార్వతీపురం మండలం మరికిలో ఆమె భర్త పేరుమీద ఐదెకరాలు భూమి ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుతం ఆ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలని కోరారు.
ఫిర్యాదు చేసినా ఇల్లు కట్టేస్తున్నారు
ఈమె పేరు తులసి. పార్వతీపురంలో ఈమెకు జగనన్న కాలనీలో స్థలం కేటాయించారు. ప్రస్తుతం అక్కడ వేరే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టడంతో తనకిచ్చిన పట్టాతో కలెక్టరేట్కు వచ్చారు. ఇల్లు కట్టిన వారికి ఇప్పటి వరకు అయిన మొత్తం చెల్లిస్తామని చెప్పినా ఖాళీ చేయడం లేదని వాపోయారు. ఇదే సమస్యపై ఇప్పటికే పలుమార్లు అర్జీలు ఇచ్చినా స్పందన లేదని కన్నీరుమున్నీరయ్యారు.
దివ్యాంగులం కనికరించండి
పార్వతీపురానికి చెందిన ఈ దంపతులు దివ్యాంగులు. ఇద్దరికీ కాళ్లు పని చేయవు. వీరికి స్థానిక ఆశాజ్యోతి ఆశ్రమం సమీపంలో జగనన్న కాలనీలో స్థలం కేటాయించగా గృహనిర్మాణ సంస్థకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నాడని గత వారం ఫిర్యాదు చేశారు. అయినా పనులు ఆపకపోవడంతో కలెక్టరేట్కు రాగా గృహ నిర్మాణ సంస్థ ఏఈ వద్దకు వెళ్లాలని అధికారులు చెప్పారని బాధితుడు చినతల్లి వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..