క్యాంపస్ ఛాలెంజ్లో విదేశీయుల సందడి
పూసపాటిరేగ మండలంలోని కోనాడ కూడలిలో ఉన్న క్యాంపస్ ఛాలెంజ్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఒవెన్, యూకే యుద్ధనౌక క్రూ సభ్యులు శనివారం సందడి చేశారు.
విభిన్న ప్రతిభావంతులతో క్రికెట్ ఆడుతున్న బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఒవెన్
పూసపాటిరేగ, న్యూస్టుడే: పూసపాటిరేగ మండలంలోని కోనాడ కూడలిలో ఉన్న క్యాంపస్ ఛాలెంజ్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారేత్ విన్ ఒవెన్, యూకే యుద్ధనౌక క్రూ సభ్యులు శనివారం సందడి చేశారు. హెచ్ఎంఎస్ తమర్ పి-233 యునైటెడ్ కింగ్డమ్కు చెందిన యుద్ధనౌక విశాఖపట్నం పోర్టును సందర్శించింది. క్రూ సభ్యులతో పాటు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ క్యాంపస్ ఛాలెంజ్ను సందర్శించారు. ముందుగా విభిన్న విద్యార్థులు పుష్పగుచ్ఛాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. దివ్యాంగులకు అందిస్తున్న విద్య, వైద్య సదుపాయాలను పరిశీలించారు. దివ్యాంగ విద్యార్థులతో కాసేపు గడిపారు. ఆటలు ఆడారు. పాఠశాలలోని ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు జి.ఆర్.సి.బోస్, డి.ఎస్.రాజు, కమాండర్ లక్ష్మణరావు, క్యాంపస్ ఛాలెంజ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు.
క్యాంపస్ ఛాలెంజ్ ఆవరణలో మొక్కలు నాటుతున్న యూకే యుద్ధనౌక క్రూ సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..