logo

ఖాళీ బిందెలతో మహిళల నిరసన

మండలంలోని గంగాడ గ్రామం దళిత వీధిలో తాగు నీటి సమస్య ఎక్కువైంది.  తాగడానికి గత నెల రోజుల నుంచి మంచినీళ్లు అందుబాటులో లేవని ప్రజలు వాపోయారు.

Published : 28 May 2023 19:35 IST


బలిజిపేట: మండలంలోని గంగాడ గ్రామం దళిత వీధిలో తాగు నీటి సమస్య ఎక్కువైంది.  తాగడానికి గత నెల రోజుల నుంచి మంచినీళ్లు అందుబాటులో లేవని ప్రజలు వాపోయారు. ఈ మేరకు పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్‌కు విన్నవించినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు మన్మధరావు ఆధ్వర్యంలో ఆదివారం కాలనీవాసులు ఖాళీ బిందెలతో స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.  కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని