logo

తరలింపు వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

నామినేషన్‌ ఘట్టానికి వైకాపా కార్యకర్తలను తరలించిన ఆటో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రాజాన దిలీప్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 20 Apr 2024 03:54 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిలీప్‌

బొబ్బిలి, న్యూస్‌టుడే: నామినేషన్‌ ఘట్టానికి వైకాపా కార్యకర్తలను తరలించిన ఆటో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు రాజాన దిలీప్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ భాస్కరరావు వివరాల మేరకు.. రంగరాయపురం గ్రామానికి చెందిన రాజాన దిలీప్‌ పార్సిల్‌ ఏజెన్సీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఆయన కళాభారతి పక్కన సందులో నుంచి వస్తుండగా చర్చిసెంటర్‌ వైపు వెళ్తున్న ఆటో ఢీకొంది. ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వైకాపా కార్యకర్తలను దించి, వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోందని ఏఎస్‌ఐ అన్నారు. యువకుడికి స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి వైద్యులు విజయనగరం రిఫర్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఆటో డ్రైవర్‌ ఎం.సింహాచలంను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని