వైకాపాకు ముద్దాడ మధు రాజీనామా
విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు.
విజయనగరం పట్టణం, న్యూస్టుడే: విజయనగరం నియోజకవర్గంలో వైకాపాకు మరో దెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీ వీడి తెదేపాలో చేరారు. తాజాగా ఆ పార్టీ విజయనగరం పార్లమెంటరీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు యాదవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు సంబంధిత పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ద్వారా సీఎం జగన్మోహన్రెడ్డికి పంపించానని బుధవారం ప్రకటించారు. ‘ఉత్తరాంధ్రలో యాదవులకు సీట్లు కేటాయించలేదు. విజయనగరంలో ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రాధాన్యం ఇవ్వలేదు. అయిదేళ్లుగా పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా గుర్తించలేదు. జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా చేస్తానని మాటిచ్చి, పక్కన పెట్టేశారు’ అని వాపోయారు. త్వరలో తెదేపాలో చేరుతున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటికీ తగ్గని పింఛనుదారుల ఆందోళన
[ 04-05-2024]
బలిజిపేటలో అతి పెద్ద బ్యాంకు శాఖగా పేరొందిన యూనియన్ బ్యాంకునకు పింఛనుదారుల తాకిడి ఇంకా తగ్గలేదు. -
కార్యకర్తల భుజాలపై విజయచంద్ర ప్రచారం
[ 04-05-2024]
బలిజిపేట మండలంలోని తుమరాడ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రను అక్కడి కార్యకర్తలు, వీరాభిమానులు భుజాలపై కూర్చొనబెట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు చేశారు. -
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
[ 04-05-2024]
ఎందరో అభాగ్యులకు పింఛనే ఆధారం. ఆ డబ్బులు వస్తేనే పూట గడిచేది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరెందరో.. ఆ సొమ్ములతోనే మందులు కొనుక్కొని ప్రాణాలు నిలబెట్టుకునేది.. -
గద్దెనెక్కావ్.. చెరబట్టావ్
[ 04-05-2024]
ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు. -
జగన్మోసం ఇంటింత కాదయా!
[ 04-05-2024]
పదేళ్ల కిందట సంభవించిన హుద్హుద్ తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తీరంతో పాటు వందలాది గ్రామాల్లో బీభత్సం సృష్టించి తీవ్ర నష్టం మిగిల్చింది. -
తరుణీ.. ఛీకొట్టాల్సిన తరుణమిదే!
[ 04-05-2024]
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు ప్రచారాలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీ మహిళా ఓట్లపై దృష్టి పెట్టి తాయిలాల పంపిణీకి పథకాలు రూపొందిస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి మహిళలకు చీర, రూ.500 నోటు పంపిణీ చేస్తున్న వీడియో ఇటీవల చక్కర్లు కొట్టింది. -
ఆమె నేత్రాలు సజీవం
[ 04-05-2024]
మనిషి మరణించాక.. దేహంతో పాటు నేత్రాలను మట్టిలో కలిపేయడం కంటే వాటిని దానం చేస్తే మరో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించొచ్చు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన బండి సత్యవతి (73) వయోభారంతో గురువారం మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
[ 04-05-2024]
అప్పుల బాధ తాళలేక చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చందులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. చందులూరు గ్రామానికి చెందిన వాడబోయిన అప్పలరాజు (36) అప్పులు చేసి తీర్చలేక అవస్థలు పడుతున్నాడు. -
కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు
[ 04-05-2024]
కూటమి విజయంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని జిల్లాలోని సాలూరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ, బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి అన్నారు. -
దళితవాడలని వదిలేశారా?
[ 04-05-2024]
పురపాలక పరిధిలోని ఎక్కువ జనాభా ఉన్న దళితవాడ నందమూరి కాలనీ సమస్యలు నెలవుగా మారింది. ఇక్కడి నివాసితులు శిథిÅల గృహాల్లో భయంతో జీవనం సాగిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళితులకు 150 గృహాలతో నందమూరి కాలనీ నిర్మించారు. -
పాలకా.. ఇది మీ పాపమే
[ 04-05-2024]
భామిని మండలంలోని అంపోలు-బత్తిలి మార్గంలో కొరమ నుంచి బత్తిలి వరకు వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. ఆరు నెలల కిందట రోడ్డును పూర్తిగా తవ్వేశారు. తారురోడ్డు వేయకుండా అలాగే వదిలేయడంతో దుమ్ము రేగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!