జగన్ పాపం.. రైతులకు శాపం
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం,
నదుల అనుసంధానం పనులపై ముఖ్యమంత్రి శీతకన్ను
న్యూస్టుడే, సంతకవిటి
అయిదేళ్లుగా నిలిచిన కల్వర్టు పనులు
‘రైతుల శ్రేయస్సే మా ధ్యేయమని, మాది రైతు ప్రభుత్వమ’ని చెబుతున్న జగన్ సర్కారు కర్షకులకు మేలుచేసే ప్రాజెక్టు పనులపై విముఖత చూపుతూ వచ్చింది. వంశధార-నాగావళి నదులు అనుసంధానం పనులపై వైకాపా ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతులకు తీరని అన్యాయం జరిగింది. అనుసంధానం పనులు పూర్తయితే ఆయకట్ట రైతులు రెండు పంటల సాగుకు అవకాశం వస్తుంది. ఇటువంటి మహత్తరమైన పనులపై ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మోకాలడ్డడంతో అన్నదాతలకు తీరని నష్టం వాటిల్లింది.
అన్నదాత మేలుకు..
నాగావళి నదిపై తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టులు నిర్మించడంతో ఈ నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్టకు రావాల్సిన నీటి వాటా తగ్గిపోయింది. ఏటా ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. నాగావళి నదిలో తమనీటి వాటాను విడిచిపెట్టాలని ఈ ప్రాంత రైతులు జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చారు. 2017లో వారి ఇబ్బందులు తెలుసుకున్న ముఖË్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వంశధార - నాగావళి నదులను అనుసంధానించి సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆలోచించారు. 2017 నవంబరులో నదుల అనుసంధానానికి రూ.69.78 కోట్లు మంజూరు చేశారు. హిరమండలం జలాశయం నుంచి నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట ఎగువ ప్రాంతంలో రెండు నదులను అనుసంధానించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం 33.583 కి.మీ. పొడవున ప్రధాన కాలువ తవ్వకం పనులను పరుగులు పెట్టించారు. మూడేళ్లలో 60 శాతం పనులు పూర్తి కాగా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై శీతకన్నేసింది. అయిదేళ్లలో కంటి తుడుపులా 20 శాతం పనులు మాత్రమే జరిగాయి.
నారాయణపురం ఆనకట్ట సమీపంలో నాగావళి నదిలో కలిసే ప్రాంతంలో రెండేళ్లుగా నిలిచిపోయిన పనులు
చేపట్టాల్సిన పనులు ఇవే
వంశధార నదిపై ఉన్న హిరమండలం జలాశయం నుంచి హైలెవెల్ కెనాల్ ద్వారా నాగావళి నదికి అనుసంధానించే బృహత్తర ప్రణాళిక ఇది. ఇందుకోసం నిర్మించాల్సిన 33.583 కి.మీ. అనుసంధాన ప్రధాన కాలువకు 64 వంతెనలు, 50కి పైగా చిన్న నిర్మాణాలు చేపట్టాలి. తెదేపా ప్రభుత్వ హయాంలోనే 44 వంతెనల పనులు పూర్తయ్యాయి. 30.5 కి.మీ. మేరకు ప్రధాన కాలువ తవ్వకం పూర్తయింది. లంకాలం, నారాయణఫురం తదితర గ్రామాల వద్ద భూసేకరణ సమస్యతో మూడు కి.మీ. మేర కాలువ పనులు నిలిచిపోయాయి. తరవాత అధికారంలోకి వచ్చిన వైకాపా సర్కారు పట్టించుకోకపోవడంతో ఏడేళ్లు కావస్తున్నా పనులు పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశధార - నాగావళి అనుసంధానం పనులు చివరిదశలో ఉన్నాయని, ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామని వంశధార ప్రాజెక్టు ఎస్ఈ డోల తిరుమలరావు తెలిపారు.
పెరిగిన అంచనా విలువ..
వంశధార-నాగావళి నదుల అనుసంధానానికి 2017 నవంబరులో అప్పటి తెదేపా ప్రభుత్వం రూ.69.78 కోట్లు మంజూరు చేసింది. పనుల్లో జాప్యం వల్ల 2021లో అంచనా విలువ రూ.145 కోట్లకు చేరింది. ఇంతవరకు అనుసంధాన పనులకు రూ.115 కోట్లు వెచ్చించారు. చేపట్టిన పనులకు, భూసేకరణ తదితరాలకు మరో రూ.20 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది.
ఏటా పంటలు నష్టపోతున్నాం
- ఎం.లచ్చోడు, రైతు, భగీరథపురం
వర్షాలు పడితే తప్ప నారాయణపురం కుడి ప్రధాన కాలువ ద్వారా శివారు ఆయకట్టుకు సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ఏటా ఖరీఫ్లో పంటల సాగుకు రూ.వేలు పెట్టుబడులు పెట్టినా నీరందక ఎండిపోతున్నాయి. అప్పులు పాలవుతున్నాం. కాలువ ద్వారా సాగునీరు అందిస్తే కష్టాలు తీరే అవకాశం ఉంది.
వేగంగా పూర్తిచేయాలి
- వి.కామయ్య, రైతు, ముద్దాడ
నాగావళి-వంశధార నదుల అనుసంధానం పనులు పూర్తయితే మా కష్టాలు తీరుతాయని ఎంతో ఆశపడ్డాం. ఏడేళ్లుగా ఈ పనులు జరగడం లేదు. త్వరితగతిన అనుసంధానం పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటి కష్టాల నుంచి విముక్తి కలిగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటికీ తగ్గని పింఛనుదారుల ఆందోళన
[ 04-05-2024]
బలిజిపేటలో అతి పెద్ద బ్యాంకు శాఖగా పేరొందిన యూనియన్ బ్యాంకునకు పింఛనుదారుల తాకిడి ఇంకా తగ్గలేదు. -
కార్యకర్తల భుజాలపై విజయచంద్ర ప్రచారం
[ 04-05-2024]
బలిజిపేట మండలంలోని తుమరాడ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రను అక్కడి కార్యకర్తలు, వీరాభిమానులు భుజాలపై కూర్చొనబెట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు చేశారు. -
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
[ 04-05-2024]
ఎందరో అభాగ్యులకు పింఛనే ఆధారం. ఆ డబ్బులు వస్తేనే పూట గడిచేది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరెందరో.. ఆ సొమ్ములతోనే మందులు కొనుక్కొని ప్రాణాలు నిలబెట్టుకునేది.. -
గద్దెనెక్కావ్.. చెరబట్టావ్
[ 04-05-2024]
ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు. -
జగన్మోసం ఇంటింత కాదయా!
[ 04-05-2024]
పదేళ్ల కిందట సంభవించిన హుద్హుద్ తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తీరంతో పాటు వందలాది గ్రామాల్లో బీభత్సం సృష్టించి తీవ్ర నష్టం మిగిల్చింది. -
తరుణీ.. ఛీకొట్టాల్సిన తరుణమిదే!
[ 04-05-2024]
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు ప్రచారాలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీ మహిళా ఓట్లపై దృష్టి పెట్టి తాయిలాల పంపిణీకి పథకాలు రూపొందిస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి మహిళలకు చీర, రూ.500 నోటు పంపిణీ చేస్తున్న వీడియో ఇటీవల చక్కర్లు కొట్టింది. -
ఆమె నేత్రాలు సజీవం
[ 04-05-2024]
మనిషి మరణించాక.. దేహంతో పాటు నేత్రాలను మట్టిలో కలిపేయడం కంటే వాటిని దానం చేస్తే మరో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించొచ్చు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన బండి సత్యవతి (73) వయోభారంతో గురువారం మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
[ 04-05-2024]
అప్పుల బాధ తాళలేక చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చందులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. చందులూరు గ్రామానికి చెందిన వాడబోయిన అప్పలరాజు (36) అప్పులు చేసి తీర్చలేక అవస్థలు పడుతున్నాడు. -
కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు
[ 04-05-2024]
కూటమి విజయంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని జిల్లాలోని సాలూరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ, బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి అన్నారు. -
దళితవాడలని వదిలేశారా?
[ 04-05-2024]
పురపాలక పరిధిలోని ఎక్కువ జనాభా ఉన్న దళితవాడ నందమూరి కాలనీ సమస్యలు నెలవుగా మారింది. ఇక్కడి నివాసితులు శిథిÅల గృహాల్లో భయంతో జీవనం సాగిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళితులకు 150 గృహాలతో నందమూరి కాలనీ నిర్మించారు. -
పాలకా.. ఇది మీ పాపమే
[ 04-05-2024]
భామిని మండలంలోని అంపోలు-బత్తిలి మార్గంలో కొరమ నుంచి బత్తిలి వరకు వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. ఆరు నెలల కిందట రోడ్డును పూర్తిగా తవ్వేశారు. తారురోడ్డు వేయకుండా అలాగే వదిలేయడంతో దుమ్ము రేగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!