logo

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది.

Updated : 05 May 2024 05:51 IST

అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌
విజయనగరం ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈమేరకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లను శనివారం కలెక్టర్‌ నాగలక్ష్మి తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రాన్ని చూసి, ఆర్వో మురళీకృష్ణకు సూచనలు చేశారు. విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో రెండు ఫెసిలిటేషన్లను సందర్శించారు. హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి, ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆదేశించారు.జేసీ కార్తీక్‌, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డీఆర్వో అనిత, డీఆర్‌డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. బీ విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల, ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని ఈవీఎం కేంద్రాలను కలెక్టర్‌ పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని