logo

రాక్షస పాలన వారంలో ముగుస్తుంది

రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు.

Published : 06 May 2024 03:18 IST

మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు

పత్తికాయవలసలో మాట్లాడుతున్న కళా వెంకటరావు, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే గద్దె, త్రిమూర్తులరాజు

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, పూర్వపు నియోజకవర్గ బాధ్యుడు కుచ్చర్లపాటి త్రిమూర్తులరాజు తదితరులతో కలిసి బెవరపేట, పత్తికాయవలస, కర్లాం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా సభల్లో కళా మాట్లాడారు. పత్తికాయవలసలో పలువురు వైకాపాను వీడి ఆర్‌ఈసీఎస్‌ మాజీ అధ్యక్షుడు దన్నాన రామచంద్రుడు ఆధ్వర్యంలో కళా వెంకట్రావు సమక్షంలో తెదేపాలో చేరారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌ మల్లిక్‌ నాయుడు, నియోజకవర్గ జనసేన బాధ్యుడు విసినిగిరి శ్రీనివాసరావు, భాజపా సమన్వయకర్త ఎస్‌వీఎల్‌ఎన్‌ రాజు, పత్తికాయవలస సర్పంచి దన్నాన పద్మావతి, కర్లాం మాజీ సర్పంచి బాణాన రామకృష్ణంనాయుడు, పీకే పాలవలస మాజీ సర్పంచి గొర్లె లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని