ఐదేళ్లు కట్టలేక పోయారు
వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చలేదు.
వంశధార పొడవునా ముంపు ముప్పు
రక్షణ కల్పించలేకపోయిన ప్రభుత్వం
ముంపునకు గురైన కీసర గ్రామం(పాతచిత్రం)
న్యూస్టుడే, భామిని: వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార పరివాహక ప్రాంత రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని సీఎం జగన్మోహనరెడ్డి నెరవేర్చలేదు. దీంతో ఏటా నదీ తీరప్రాంత వాసులకు ముంపు ముప్పు తప్పని పరిస్థితి.
భారీ వర్షాలు కురిసినప్పుడు నదిలో ప్రవాహం పెరుగుతుంది. ఒడిశాలోని పద్మాపురం వద్ద కెందుగూడ డ్యామ్ నుంచి వరదనీరు విడుదల చేస్తే ఉద్ధృతి మరింత ఎక్కువవుతుంది. కరకట్టలు లేకపోవడంతో నది ఉప్పొంగి పలు తీర గ్రామాలతో పాటు పంట పొలాలను ముంచెత్తుతోంది. భామిని మండలంలోని కోసలి, కీసర గ్రామాల రైతులకు అపార నష్టం వాటిల్లుత్తోంది. 2018లో తిత్లీ తుపాను సమయంలో కీసర గ్రామం జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది.
వంశధార నది పొడవునా కుడి, ఎడమల వైపున 199 కిమీ మేర కరకట్టలు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం 2007లో నాలుగు ప్యాకేజీలుగా విభజించి.. రూ.310 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు వెళ్లాయి.. అనుమతులు రాగా నదీతీరం వెంబడి నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించి 1200 ఎకరాలు అవసరం అవుతాయని గుర్తించారు. అప్పట్లో రైతుల నుంచి 600 ఎకరాల మేరకు సేకరించినా ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ఆ తర్వాత 2017లో తెదేపా హయాంలో రూ.1057 కోట్లు మంజూరు చేయగా కట్టల ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఇందులో రూ.15 కోట్లు ఖర్చుచేసి 8 శాతం మేర నిర్మించారు. ఆ తర్వాత పనులు నిలిచిపోవడంతో తీరప్రాంత వాసులకు ముంపు కష్టాలు తీరకుండా పోయాయి.
పాలకుల నిర్లక్ష్యం.. ప్రజలకు శాపం
ఏటా భారీ వర్షాలు, తుపాన్లకు కోసలి, కీసర గ్రామాల్లో పంట భూములు నీటమునుగుతున్నాయి. వైకాపా ప్రభుత్వం కరకట్టల నిర్మాణానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నదికి వరదలు వచ్చినప్పుడల్లా దిక్కుతోచని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ అయిదేళ్లూ పాలకులు పట్టించుకోకపోవడంతో తీరప్రాంత వాసులకు కష్టాలు తప్పడం లేదు.
- పి.రాంబాబు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు, కీసర, భామిని మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు
[ 18-05-2024]
చిలకలపల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారికి అర్చలకు కె.రాంబాబు శనివారం పంచామృతాభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. -
‘ఈనాడు’ కథనానికి స్పందన
[ 18-05-2024]
మండలంలోని చిలకలపల్లి-జనార్ధనవలస గ్రామాల మధ్య రెండు చోట్ల విరిగిపోయిన తాగునీటి పైపులను నీటిసరఫరా విభాగం అధికారులు శనివారం మార్పిడి చేశారు. -
కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి
[ 18-05-2024]
మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు అధికారులు కనీస సదుపాయాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు డిమాండు చేశారు. -
నిబంధనలు తొక్కి‘పెట్టే’శారు
[ 18-05-2024]
విజయనగరం అర్బన్, గ్రామీణం: గురువారం మధ్యాహ్నం 3 గంటలు.. విజయనగరం తహసీల్దారు కార్యాలయం.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీసు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూమ్ ఉంది. -
ప్రజలకు అందుబాటులో ఉంటాం
[ 18-05-2024]
కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. -
19 నుంచి తోటపల్లిలో కల్యాణ వేడుకలు
[ 18-05-2024]
తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సీతారామస్వామి వార్షిక కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. -
ఏటా రూ.కోట్లు.. పనులకు తూట్లు
[ 18-05-2024]
సాలూరు పట్టణంలోని గాంధీనగర్ నుంచి కొంకివీధి, వేదసమాజం, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు ఉండే వన్వే దారి ఇది. అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. -
ఇదే.. సాలూరు స్మార్ట్ టౌన్షిప్
[ 18-05-2024]
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో మధ్య ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సాలూరులో పట్టణ జాతీయ రహదారి పక్కన కేటాయించింది -
ఆందోళనకు గురువులు సిద్ధం
[ 18-05-2024]
పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
రాష్ట్రంలో ఈవీఎంలకు భద్రత లేదు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యకాండను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు
[ 18-05-2024]
ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన సంఘటన శుక్రవారం గజపతినగరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది -
చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు
[ 18-05-2024]
సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. -
కన్నీటి సంద్రం
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం, జియ్యమ్మవలస, బొండపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. -
దిబ్బలపాలెంలో పులి సంచారం..?
[ 18-05-2024]
భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్చ్..ఇదేం నిర్వహణ?
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల్లో కాలువల తీరు ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!