ఏం తినేది.. ఎలా బతికేది జగన్!
ఆర్థిక దన్ను లేకపోతే జీవితం సాఫీగా సాగదు. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని మున్ముందు అవసరాలకు పొదుపు చేయడం అత్యవసరంగా భావిస్తారు. ఖర్చులు పోగా మిగిలితే పొదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
నిత్యావసరాలపై బాదుడే బాదుడు
భారీగా పెరిగిన ధరలతో జనం కుదేలు
న్యూస్టుడే-రాజాం: ఆర్థిక దన్ను లేకపోతే జీవితం సాఫీగా సాగదు. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని మున్ముందు అవసరాలకు పొదుపు చేయడం అత్యవసరంగా భావిస్తారు. ఖర్చులు పోగా మిగిలితే పొదుపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా కుటుంబాల వారీగా ప్రాధాన్యాలు మారిపోవచ్చు. ఆదాయాలు వేర్వేరుగా ఉండొచ్చు. ఏ స్థాయి ఆదాయమున్నా.. అందులో 20 శాతం పొదుపు ఉంటేనే ఆ కుటుంబ నావ ఆర్థిక ఒడుదొడుకులకు లోను కాకుండా సాఫీగా సాగుతున్నట్లు లెక్క. ఒక ఆర్థిక నిపుణురాలి సమీకరణాల ప్రకారం.. బడ్జెట్ను రెండు రకాలుగా విభజించుకోవచ్చు. 80 శాతం ఖర్చు, 20 శాతం పొదుపు. రెండో లెక్క ప్రకారం 50 శాతం తప్పనిసరి అవసరాలకు, 30 శాతం అవసరాలు, కోరికలకు, 20 శాతం పొదుపునకు వెచ్చించగలిగితే ఆ కుటుంబం సాఫీగా సాగుతున్నట్లు ఒక లెక్క. ఆదాయాలు కోసుకుపోయి.. ఖర్చులు పెరిగిపోవడంతో ఈ ఆర్థిక లెక్కలన్నీ తలకిందులవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నెలకు సగటున కేవలం నిత్యావసరాల సరకులకే రూ.860 కోట్ల వరకూ ఖర్చవుతోంది. అయిదేళ్ల క్రితంతో పోల్చితే రెట్టింపు అదనపు భారం జనంపై పడినట్లు అంచనా వేస్తున్నారు. ఇతర ఖర్చులు కలిపితే అంచనాలు అందని రీతిలో ఉంది.
ఆర్టీసీ ఛార్జీల బాదుడే..
ఆర్టీసీ బస్సు ఛార్జీలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. అయిదేళ్లలో ప్రయాణికులపై పెనుభారం పడింది. విజయనగరం రీజియన్ పరిధిలో బస్సులు రోజుకు 2.70 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నట్లు అంచనా. పల్లె వెలుగు బస్సులపై గతంలో ఒక్కో స్టేజికి రూ.2 వరకూ పెరగడం మోయలేని భారంగా పరిణమించింది. మొత్తంగా రూ.30 కోట్ల వరకూ అదనపు భారం పడినట్లు అంచనా వేస్తున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం: జనం ఎదుర్కొంటున్న విషమ పరిస్థితిని గుర్తించి తెదేపా కూటమి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మేనిఫెస్టోలో చేర్చింది.
జీవితాలు తారుమారు
ఉపాధి లేక పేద, మధ్య తరగతి వర్గాల ఆదాయం పడిపోతుంటే.. నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఓ చేతితో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100 లాక్కుంటున్నారు. అయిదేళ్లలో పెరిగిన ధరలు ఆయా వర్గాల ఆర్థిక మూలాలను దెబ్బతీశాయి. ‘నలుగురు సభ్యులున్న కుటుంబానికి నెలవారీ కిరాణా సామగ్రికి హీనపక్షాన రూ.10 వేల వరకూ ఖర్చవుతోంది. గ్యాస్, ఇంటి బాడుగ, కరెంటు ఛార్జీలు, వాహనం ఉంటే ఇంధనం, పిల్లల ఫీజులు, టీవీ, చరవాణి బిల్లులు, వైద్యం ఖర్చులు.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా వరకూ నెలవారీ ఖర్చులున్నాయి. ఈ స్థాయిలో ఆదాయాలు పెరగకపోవడంతో మధ్యతరగతి, పేదలు తల్లడిల్లిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు ఉద్యోగి సగటు వేతనం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఉంటుంది.
తెదేపా హామీ ఇదీ: ధరల పరిస్థితిని చక్కదిద్దేందుకు తెదేపా కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటామని, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని స్పష్టం చేసింది. కుటుంబంపై ఆర్థిక భారాన్ని తగ్గించే ఇంకొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించింది.
విద్యుదాఘాతమే..
విద్యుత్తు బిల్లులు పట్టుకుంటే జనాలకు షాక్ తగులుతోంది. గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు, ఇతర వర్గాలు ఇలా అన్నింటిపై భారం మోపారు. గడిచిన అయిదేళ్లలో వివిధ ఛార్జీల పేరుతో ఉమ్మడి జిల్లాలో రూ.500 కోట్లకు పైగా భారం మోపినట్లు ఒక అంచనా. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లను మినహాయిస్తే మిగిలిన 8.65 లక్షల కనెక్షన్లపై ఈ భారం పడింది. టారిఫ్లను మార్చడంతో బిల్లు గుభేలుమంటోంది. రెండు ఫ్యాన్లు, నాలుగు విద్యుత్తు దీపాలు, టీవీ, ఇతర వసతి ఉన్న ఒక పేద కుటుంబానికి రూ.800- రూ.1000 వరకూ బిల్లు వస్తోంది. ఇంట్లో ఏసీ ఉంటే నెలకు బిల్లు రూ.3 వేలపైనే దాటుతోంది. రోజుకు సగటున 11 మిలియన్ యూనిట్లు వినియోగం జరుగుతోంది.
విద్యుత్తు ఛార్జీల నియంత్రణ: తెదేపా మేనిఫెస్టోలో విద్యుత్తు ఛార్జీల నియంత్రణపై హామీ ఇచ్చింది. ఇంటి పైకప్పుపై కేంద్ర ప్రభుత్వ సోలార్ ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి పథకం ద్వారా బిల్లుల భారాన్ని తగ్గిస్తామని, మిగులు విద్యుత్తును ప్రజల నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించింది.
వాహనం తీస్తే భారమే..
ఉమ్మడి జిల్లాలో లక్షల వాహనాలు ఉన్నాయి. రోజూ లక్షల లీటర్ల డీజిల్, పెట్రోలు వినియోగం అవుతోంది. ఒక ద్విచక్ర వాహనం వినియోగిస్తున్న ఒక ఉపాధ్యాయుడుకు రూ.4 వేలు వరకూ ఇంధనానికి ఖర్చవుతోంది. అయిదేళ్ల క్రితం రూ.2 వేలు ఖర్చయ్యేది. జగన్ అధికారంలోకి వచ్చాక సుంకాలను పెôచడంతో మిగిలిన రాష్ట్రాల కంటే ఇంధనం ధరలు పెరిగాయి. వీటిని తగ్గించేందుకు వైకాపా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడంతో రూ.వందల కోట్ల భారాన్ని అయిదేళ్లలో జనం భరించాల్సి వచ్చింది.
పెట్రో ధరలకు కళ్లెం: పెట్రోలు, డీజిల్ ధరలు నియంత్రిస్తామని తెదేపా మేనిఫెస్టోలో పేర్కొంది. వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు, బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్, లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుకపై.. డేగకన్ను
[ 19-05-2024]
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
జీర్ణావస్థలో జీసీసీ
[ 19-05-2024]
గిరిజనులకు అండగా నిలిచి.. వారు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన జీసీసీ (గిరిజన సహకార సంస్థ)ని ప్రభుత్వం ఖూనీ చేసింది. -
భూసార పరీక్షల ఫలితాలేవీ..?
[ 19-05-2024]
ఏ పంట పండించినా దిగుబడి బాగుండాలంటే భూమి సారవంతంగా ఉండాలి. దీని కోసం భూమిలో లోపాలు తెలుసుకొని, అవసరమైన చర్యలు చేపట్టాలి. దీంతో దిగుబడి పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. -
కూటమికి 160 పైగా సీట్లు ఖాయం
[ 19-05-2024]
రాష్ట్రంలో కూటమికి 160కి పైగా సీట్లు రావడం ఖాయమని చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం చీపురుపల్లిలోని నటరాజ్ రెసిడెన్సీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
ఉన్నవి 24 రోజులే.. నాడు-నేడు మాటేమిటి?
[ 19-05-2024]
రెండో విడత నాడు నేడు పనులు నిధుల కొరతతో 2023 అక్టోబరు నుంచి నిలిచిపోయాయి. ఏప్రిల్లో డబ్బులు విడుదలైనా సిమెంట్, ఇసుక వంటివి అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగలేదు. -
వైకాపా కదలికలపై నిఘా అవసరం
[ 19-05-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ గది తెరిచిన ఘటనపై శనివారం బంగ్లాలో పొలిట్బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితి గజపతిరాజు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. -
ఈ ఖరీఫ్లో కన్నీరే!
[ 19-05-2024]
కళ్లెదుటే నీళ్లున్నాయి.. చేతుల్లో డబ్బులున్నాయి.. కానీ ఫలితం లేదు.. పొలం తడవదు.. పంట పండదు.. జలాశయాల ఆధునికీకరణకు జైకా నిధులిచ్చినా.. పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లిప్తత చూపించింది. ఫలితంగా మూడేళ్లు అవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేదు. -
అనంతపురం ఎస్పీగా గౌతమీశాలి
[ 19-05-2024]
విశాఖపట్నం 16 బెటాలియన్ కమాండెంట్గా పనిచేస్తున్న గౌతమీశాలిని ఎన్నికల సంఘం అనంతపురం ఎస్పీగా నియమించింది. -
ఈఏపీసెట్లో మెరుపులు
[ 19-05-2024]
తెలంగాణ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఉమ్మడి జిల్లాల విద్యార్థులు మెరిశారు. వ్యవసాయం, ఫార్మసీ విభాగంలో బలిజిపేట మండలం చిలకలపల్లికి చెందిన నాగుదాసరి రాధాకృష్ణ రెండో ర్యాంకు, ఇంజినీరింగ్ విభాగంలో విజయనగరానికి చెందిన దనుకొండ శ్రీనిధి పదో ర్యాంకు పొందారు. -
స్ట్రాంగ్ రూం తెరుస్తున్నట్లు సమాచారం ఇవ్వలేదు
[ 19-05-2024]
విజయనగరం తహసీల్దారు కార్యాలయంలో ఈ నెల 16న పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూం తెరిచినప్పుడు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని విజయనగరం అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పాండ్రంకి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!