వైభవంగా చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు
గొల్లపల్లిలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గ్రామంలో సందడి నెలకొంది. ఇందులో భాగంగా గురువారం కంపకళ్లి వేడుకలు నిర్వహించనున్నారు.
నేడు కంపకళ్లి వేడుకలు
గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామి
హనుమంతునిపాడు, న్యూస్టుడే : గొల్లపల్లిలో చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో గ్రామంలో సందడి నెలకొంది. ఇందులో భాగంగా గురువారం కంపకళ్లి వేడుకలు నిర్వహించనున్నారు. బుధవారం గరుడ వాహనంపై చెన్నకేశవ స్వామి దర్శనమిచ్చారు. భక్తులు స్వామి వారి ఆశీస్సులందుకున్నారు. గ్రామంలో అయిదు రోజులపాటు జరిగే తిరునాళ్లకు భక్తులు భారీగా తరలి రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కనిగిరి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై శివనాగరాజు, తెదేపా మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, గాయం తిరుపతిరెడ్డి, రఘునాథ కాశిరెడ్డి మొక్కులు తీర్చుకున్నారు. చెక్కా వంశీయులు చెన్నకేశవునికి నిత్య పొంగళ్లు సమర్పించారు. పాలేగాళ్లు, పోతురాజులు కత్తిసేవలతో స్వామి వారి మహిమను చాటారు. భక్తులు స్వామి వారికి పొంగళ్లు సమర్పించి, ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు జనార్దన్ రెడ్డి, ఈవో శ్రీనిబాబు, సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం నిర్వహించే కంపకళ్లి వేడుకల్లో గుట్టపై నుంచి పసిపిల్లల్ని దొర్లించవద్దని పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
వేంకన్నను దర్శించుకున్న మాగుంట
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే : ఒంగోలు సిట్టింగ్ ఎంపీˆ, కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం తిరుమలలో కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేకువజామున దేవ దేవుడికి నిర్వహించిన సుప్రభాత సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు తీర్థ, ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందించారు. ఆయనతో పాటు పలువురు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్యుల ‘కొండ’పి.. నేతలకు అడ్డాగా గడ్డ
[ 16-06-2024]
కొండపి.. పొగాకు, శనగ పంటల సాగుకే కాదు.. ఆది నుంచీ రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. 1955లో నియోజకవర్గం ఆవిర్భవించింది. ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అభ్యర్థులు ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
నేలకు దిగొచ్చిన నెత్తికెక్కిన కళ్లు
[ 16-06-2024]
నాయకులు ఆదేశించారని అది ఎంత అడ్డగోలు వ్యవహారమైనా, చట్ట విరుద్ధమైనా నిబంధనలకు పాతరేసి మరీ అధికారులు పాటించారు. ప్రత్యర్థులపై ఎడాపెడా కేసులు కట్టేశారు. కాలు కదిపినా, నోరు మెదిపినా స్టేషన్లలో నిర్భంధించి వేధించారు. -
నాన్న నడిపించి.. జీవితంలో గెలిపించి
[ 16-06-2024]
నాన్న.. మాట కటువు అయినా మనసు మాత్రం వెన్న. ప్రతిక్షణం తన పిల్లల భవిష్యత్తుకే పరితపిస్తుంటాడు. తాను ఏ స్థాయిలో ఉన్నా తనకంటే బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. -
మంత్రి చొరవ బడికి మళ్లీ కళ
[ 16-06-2024]
పాఠశాలల విలీనం పేరుతో వైకాపా ప్రభుత్వం పేద పిల్లల చదువులతో చెలగాటమాడింది. తక్కువ సంఖ్యలో విద్యార్థులున్నారంటూ కొన్నిచోట్ల ఏకంగా బడులను మూసేసింది. -
లంచావతారులు మాకవసరం లేదు
[ 16-06-2024]
‘పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు తీసుకునే అధికారులు మాకు అవసరం లేదు. అటువంటి వారు తక్షణమే సెలవు పెట్టి వెళ్లి పోవాలి. లేకుంటే నేనే పంపిస్తా’... -
తెదేపాకు ఓటేశారని కక్ష.. తాగునీరు నిలిపివేత!
[ 16-06-2024]
ఎన్నికలు ముగిశాయి. వైకాపా ఘోర పరాజయం పాలైంది. ప్రజలు తెదేపా కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ విషయాన్ని కొందరు వైకాపా సానుభూతి ఉద్యోగులు జీర్ణించుకోలేకున్నారు. -
మాలకొండలో ప్రజాప్రతినిధులు
[ 16-06-2024]
పుణ్యక్షేత్రమైన మాలకొండ లక్ష్మీనృసింహస్వామిని కందుకూరు, చీరాల, కనిగిరి ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం.కొండయ్య, ఉగ్రనరసింహారెడ్డి శనివారం దర్శించుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విచారణ పూర్తికాకముందే తీర్పు ఎలా ఇస్తారు?: జగదీశ్ రెడ్డి
-
‘నీట్’ వివాదం.. సుప్రీం ‘కమిటీ’తో దర్యాప్తు జరిపించాలి: సిబల్
-
రుషికొండపై రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా
-
జూన్ 30లోగా గనులను వేలం వేయాలి.. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సూచన
-
ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్ చరణ్ ప్రేమ
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు