అక్రమార్కులచెరలో నీటి కుంటలు !
మనిషి జీవనానికి ప్రాణాధారమైన నీరు నిలిచేందుకు భూమి మీద చోటు లేకుండా పోతోంది. చెరువులు, కుంటలు అక్రమార్కుల చేతుల్లో కుంచించుకుపోతున్నాయి. జిల్లాలో సుమారు పది వేల నీటి కుంటలు ఉంటాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని గిద్ద
అర్థవీడు, న్యూస్టుడే : మనిషి జీవనానికి ప్రాణాధారమైన నీరు నిలిచేందుకు భూమి మీద చోటు లేకుండా పోతోంది. చెరువులు, కుంటలు అక్రమార్కుల చేతుల్లో కుంచించుకుపోతున్నాయి. జిల్లాలో సుమారు పది వేల నీటి కుంటలు ఉంటాయని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మార్కాపురం డివిజన్ పరిధిలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాల పరిధితో సుమారు 500 కుంటలు ఆక్రమణల్లో ఉన్నట్లు గత ప్రభుత్వ హయాంలో అధికారులు గుర్తించారు. ఒక్క అర్థవీడు మండలంలోనే 30 కుంటలు ఆక్రమణల్లో ఉన్నాయి. వీటి పరిధిలో 200 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ హక్కులు పొందేందుకు కూడా ఆక్రమార్కులు వెనుకాడటం లేదు.
ఎమ్మెల్యే హెచ్చరించినా...
గత నెల 20న మండల సర్వ సభ్య సమావేశంలో కుంటల ఆక్రమణలపై పలు గ్రామాల ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేశారు. వీటిని పరిశీలించిన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ వర్షాలు కురవడంతో కుంటలన్నీ నీటితో నిండుకున్నాయని, ఈ సమయంలో నీరు ఎంత వరకు ఉంటే అంత వరకు కుంట విస్తీర్ణం ఉన్నట్టు అధికారులు గుర్తించి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. సభాముఖంగా ఆయన ఆదేశాలిచ్చి నెల రోజులు దాటినా చర్యలు లేకపోవడం శోచనీయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?