కన్నీరే మిగిల్చావ్.. జగన్
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు.
ఎండుతున్న బొప్పాయిపంట
ఆదుకోని ప్రభుత్వంపై ఆగ్రహం
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. జిల్లాలో 3,200 ఎకరాల్లో నేడు బొప్పాయి సాగవుతోంది. ఉద్యానశాఖ చేయూత నందించడంతో ఈ పంటలవైపు మళ్లిన రైతులు నేడు కన్నీరుమున్నీరవుతున్నారు. సరైన వర్షాలు లేక వేసిన పంటలకు నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండి పోతుంటే విలవిల లాడిపోతున్నారు. ఈ ప్రభుత్వం తమను మధ్యలోనే వదిలేసిందని వాపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.
యర్రగొండపాలెం పట్టణం, కొనకనమిట్ల
మురుగునీటితో పంటకు తడులు
వై.పాలెం పంచాయతీలోని కొత్తపల్లె బొప్పాయి తోటలకు ప్రసిద్ధి. 300 ఎకరాల్లో ఏటా సాగు చేస్తుంటారు. ఈ ఏడాది తీవ్రమైన నీటి ఎద్దడి రావడంతో బోర్లు అడుగంటాయి. ఎకరాకు రూ.60 వేల ఖర్చు పెట్టిన పంట ఎండిపోతుంటే రైతులు తట్టుకోలేకపోతున్నారు. పంటను కాపాడుకునేందుకు పక్కనే ఉన్న వై.పాలెం డ్రైనేజీ కాలువే దిక్కుగా మారింది. వై.పాలెం పట్టణంలోని నీరంతా డ్రైనేజీ కాలువ నుంచి వచ్చి వై.పాలెం మార్కాపురం రోడ్డులోని పెట్రోల్ బంకు చప్టా వద్దకు చేరుకుంటుంది.ఈ నీటిని కొత్తపల్లె రైతులు పైపుల ద్వారా పంటలకు మళ్లించి వాడుకుంటున్నారు. చప్టా కింద ఉన్న మురుగు నీటితో కొంత గుంతను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుంటలో మురుగునీటిని నిల్వ చేసుకున్నారు. చప్టా నుంచి పొలాలకు పైపులైన్లు వేసుకున్నారు. నిల్వ చేసుకున్న నీటికి మోటార్లు పెట్టి పొలాలకు సరఫరా చేసుకుంటూ పంటలను కాపాడుకుంటున్నారు.
గతంలో ప్రభుత్వం ట్యాంకర్లతో ఆదుకునేది
గతంలో ప్రభుత్వం నీరు లేని ఎండిపోతున్న పంటలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసి రైతులను ఆదుకుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. నేను 3 ఎకరాలు బొప్పాయి తోట వేశా. నేను వేసిన రెండు బోర్లలో నీరు ఎండిపోయింది. దీంతో చేసేది లేక ఈ డ్రైనేజీ మురుగు నీటికి మోటార్లు ఏర్పాటు చేసి పైపు ఉపయోగించి పంటకు వాడుకుంటున్నాం. ఈ నీరు సైతం అందరికి సరిపోవడం లేదు. వంతుల వారీగా వాడుకుంటూ పంటలను బతికించుకుంటున్నాం.
ఆముదం వెంకట నారాయణరెడ్డి
ఉద్యాన పంటలను కాపాడాలి
ఈ వేసవి కాలంలో ప్రభుత్వం ఉద్యాన పంటలు ఎండిపోకుండా ట్యాంకర్లు ద్వారా నీరు సరఫరా చేయాలి. నేను రెండెకరాలు బొప్పాయి పంట వేశాను. వేరే గతి లేక నీరు లేక వై.పాలెం డ్రైనేజీ మురికి నీరు పంటలకు వాడుకుంటున్నా. ఈ మురికి నీరు సైతం రైతులకు చాలడం లేదు. రాత్రి వేల పడిగాపులు కాచి పంటలకు పైపుల ద్వారా నీరు పెట్టుకుంటున్నాం. ప్రభుత్వం ఉద్యాన పంటల రైతులకు నీరు సరఫరా చేసి ఆదుకోవాలి.
డి.మీరావలి
రాయితీ లేదు
నాకు ఉన్న ఒక ఎకరాతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని బొప్పాయి సాగు చేశా. వర్షాలు లేక భూర్భజలాలు అడుగంటి పోవడంతో బోరు ఒట్టిపోయి పంట ఎండిపోతోంది. గత ప్రభుత్వం పండ్ల తోట రైతులు మొక్కలు రాయితీ, డ్రీప్ పైపులు అందించేవారు. వైకాపా ప్రభుత్వం ఎటువంటి రాయితీలు లేకపోవడంతో నష్టపోయా. తోట ఎండిపోవడంతో సుమారు రూ.1 లక్షల నష్టంవాట్లింది. ఈక్రాఫ్ సక్రమం ఆన్లైన్తో నమోదు చేయకపోవడంతో రాయితీ ఇవ్వలేం అని ప్రభుత్వం తప్పించుకుంది.
రమణారెడ్డి, రైతు, కొనకనమిట్ల.
తీవ్రంగా నష్టపోతున్నాం..
నాకు కున్న అయిదు ఎకరాలు బొప్పాయి పంట సాగు చేశా. వర్షాలు సక్రమంగా పడకపోడంతో తోటలు ఎండిపోయిన్నాయి. రూ.1.50లక్షలు నష్టం వాటిల్లింది.. గత ప్రభుత్వం మొక్కలకు రాయితీ అందించింది. వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి రాయితీ ఇవ్వకపోవడంతో నష్టపోతున్నాం.
బాదుల్లా, పుట్లువారిపల్లె, కొనకనమిట్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిరు జీవితాల్లో ఇసుక తుపాను
[ 08-05-2024]
గద్దెనెక్కగానే కొత్త ఇసుక పాలసీ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాకాలూదారు. ఆ వెనుకే జనాలకు గోతులు తవ్వే కుట్రలు పన్నారు. అక్రమాల జాతరకు తెర లేపారు. దేశానికే ఆదర్శమంటూ అనుయాయులకు రీచ్లు అప్పగించారు. -
మునుగుతున్నాం.. కొనేద్దాం!
[ 08-05-2024]
2019 ఎన్నికలకు ముందు నోటికొచ్చిన హామీలిచ్చారు. అమలు చేయమని అడిగితే పోలీసులను ఉసిగొల్పి అన్ని వర్గాలపై ఉక్కుపాదం మోపించారు. గత అయిదేళ్లుగా ఎక్కడా అభివృద్ధి లేదు. మరోసారి జనం నమ్మే పరిస్థితి ఎలాగూ లేదు. మరోపక్క విద్యుత్తు ఛార్జీలతో పాటు, అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు పెరిగాయి. -
పార్టీ మారారని అక్కసు.. వైకాపా బరితెగింపు
[ 08-05-2024]
ఎన్నికల వేళ ఓటమి భయం వైకాపా నాయకులను బరితెగించేలా చేస్తోంది. ప్రచారంలో తమకు ఎదురవుతున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేకపోతున్నారు. విధానాలు నచ్చక పార్టీ వీడిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. -
చెవి నొగ్గి వినండి అరాచక ముఠా దిగింది!
[ 08-05-2024]
కార్యకర్తలొద్దు.. ప్రైవేట్ సైన్యమే దన్ను...: ఎన్నికల్లో సదరు బదిలీ అభ్యర్థి పూర్తిగా తన ప్రైవేట్ సైన్యం పైనే ఆధారపడ్డారు. తాయిలాల పంపిణీ నుంచి, క్షేత్రస్థాయిలో అసంతృప్తులను బుజ్జగించడం, ఇతర పార్టీల్లోని వారికి ఎరవేయడంలో బిజీగా ఉన్నారు. -
పాలబుగ్గలపైనా పాలకుడి పగ
[ 08-05-2024]
ప్రజాక్షేమమే పాలకుల అంతిమ లక్ష్యం..అయితే అయిదేళ్ల క్రితం కొలువుదీరిన ఆంధ్రా పాలకుడు మాత్రం దీనికతీతం. అధికార పీఠమెక్కాక ఆయన కర్కశంగా ప్రాథమిక విద్య గొంతు నులిమేశారు. పాఠశాలల విలీనమంటూ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో ఇటు చిన్నారులు..అటు ఉపాధ్యాయులు విలవిల్లాడారు. -
వెలుగొండ పూర్తి.. పథకాలతో ప్రతిఇంటికీ అబ్ధి
[ 08-05-2024]
రాష్ట్రంలో కీలక పార్లమెంట్ నియోజకవర్గం ఒంగోలు. కోస్తా.. రాయలసీమ సంస్కృతుల సమ్మిళితమైన ఈ ప్రాంతం నుంచి తెదేపా తరఫున బలమైన అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలో నిలిచారు. ఇటు సేవా కార్యక్రమాలు..అటు పార్టీలకతీతంగా వివాద రహితుడిగా గుర్తింపు పొందడం ఆయనకు కలిసొచ్చే అంశం. -
ఓటుకు వందనం
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ ఎనభై అయిదు సంవత్సరాలు దాటిన వృద్ధులు, ఇంటికే పరిమితమైన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. -
పోలైన తపాలా ఓట్లు 16,400
[ 08-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. -
నగదు బదిలీతో ఓట్ల కొనుగోలు
[ 08-05-2024]
నగదు బదిలీతో ఓట్లు కొనుగోలు చేసిన ఉదంతంపై దర్శి పీఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓట్లు కొనుగోలు చేసిన వ్యక్తులతో పాటు, ఓట్లు అమ్ముకున్న ఎనిమిదిమంది ఉపాధ్యాయులు, ఇద్దరు పోలీసులు, ఒక ఏఎన్ఎం, ఓ వాలంటీరు, ఓ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.