TDP Mahanadu: ఒంగోలులో తెదేపా తోరణాలను తొలగించిన కార్పొరేషన్ అధికారులు
వైకాపా ప్రభుత్వం మహానాడుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. మహానాడు వేదికతో పాటు ప్రయాణ ఏర్పాట్లకు సర్కారు ఆటంకాలు కలిగిస్తోందన్నారు.
భవిష్యత్తులో అన్నింటికీ తగిన సమాధానం చెబుతామన్న ఆ పార్టీ నేతలు
ఒంగోలు: వైకాపా ప్రభుత్వం మహానాడుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. మహానాడు వేదికతో పాటు ప్రయాణ ఏర్పాట్లకు సర్కారు ఆటంకాలు కలిగిస్తోందన్నారు. ఒంగోలులో తెదేపా తోరణాలను కార్పొరేషన్ అధికారులు తొలగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను ఖండించిన నేతలు.. భవిష్యత్తులో అన్నింటికీ తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు. తెదేపా నేత దామచర్ల జనార్ధన్, ఇతర నేతలతో కలిసి ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి ఒంగోలులో మీడియాతో మాట్లాడారు.
‘‘మేము తోరణాలు కడితే మీరు విప్పుకుంటూ పోతారా? వేదిక కోసం డబ్బు కట్టిన తర్వాత స్టేడియానికి అనుమతి ఇవ్వరా? కలెక్టర్లు, ఎస్పీలు దేనికి? దేశ పౌరుడికి ఉండే హక్కులు ఏపీలో లేవా? రాష్ట్రంలో ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? పరిపాలన మీకు చేతకావడం లేదు. లా అండ్ ఆర్డర్ లేదు. తెలుగోడు అంటే తల ఎత్తుకునే పరిస్థితి ఎన్టీఆర్ తీసుకొస్తే.. ఏపీ అంటే తల దించుకోవాల్సిన పరిస్థితిని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చింది. మహానాడుకు ప్రైవేట్ వాహనాలు ఇస్తే బెదిరిస్తారా? ఇందుకోసమేనా అధికారులు జీతాలు తీసుకుంటోంది? మా ప్రభుత్వంలో సీఎం జగన్ నడిరోడ్డు మీద మీటింగ్లు పెట్టినా మేము మీ జోలికి రాలేదు’’ అని సోమిరెడ్డి అన్నారు.
దామచర్ల జనార్ధన్ మాట్లాడుతూ.. ‘‘తెదేపా తోరణాలను రాత్రంతా కడితే.. ఉదయం కార్పొరేషన్ వాళ్లు వచ్చి వాటిని తొలగించారు. కమిషనర్ను దీనిపై అడిగితే కలెక్టర్ చెప్పారన్నారు. వారం కిందట మేము అనుమతి కోసం దరఖాస్తు చేశాం. అయినా ఇటువంటి చర్యలు తీసుకోవడం దారుణం. జగన్ పాదయాత్రలో మేము ఇబ్బందులు కలిగించామా?’’ అని ప్రశ్నించారు.
ఒంగోలు శివారు మండువవారిపాలెం వద్ద ఈనెల 27, 28 తేదీల్లో తెదేపా మహానాడును నిర్వహించనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..