హామీల అమలుకు నినదించిన అన్నదాతలు
దిల్లీ రైతు ఉద్యమ నాయకులకు కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు.
ట్రాక్టర్లతో ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కర్షకులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: దిల్లీ రైతు ఉద్యమ నాయకులకు కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీని ఒంగోలులో గురువారం నిర్వహించారు. దక్షిణ బైపాస్లోని మినీ స్టేడియం నుంచి ప్రకాశం భవన్, ట్రంక్రోడ్డు, అద్దంకి బస్టాండ్ మీదుగా ఉత్తర బైపాస్ వరకు ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా రైతు సంఘాల జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ.. దిల్లీ ఉద్యమ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధర, రైతు విమోచన చట్టాలు అమలుతో పాటు, విద్యుత్తు చట్ట సవరణ బిల్లు-2022 ఉపసంహరించుకోవాలని కోరారు. పంటలకు ఎం.ఎస్.స్వామినాథన్ సిఫార్సు చేసిన పద్ధతిలో మద్దతు ధర కల్పించాలన్నారు. కార్యక్రమంలో పలు రైతు, రైతు కూలీ సంఘాల నాయకులు పమిడి వెంకటరావు, వి.హనుమారెడ్డి, చుంచు శేషయ్య, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పీవీఆర్ చౌదరి, లలితకుమారి, గాలం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూపర్ హిట్.. తెదేపా శ్రేణుల్లో జోష్
[ 04-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పొదిలి, గిద్దలూరులో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. -
జనం చూస్తే నాకేంటి!
[ 04-05-2024]
పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు. -
జగన్కు జిల్లా ‘రివర్స్’ షాక్
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ.. వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి జిల్లాలో జనం ‘రివర్స్’ షాక్లిస్తున్నారు. ఇటీవల టంగుటూరులో మంత్రి ఆదిమూలపు సురేష్ గెలుపు కోరుతూ జగన్ ప్రచారం చేశారు. -
ఏలికా.. మా ఉసురు తగలదా!
[ 04-05-2024]
ఎన్నికల వేళ లబ్ధికి జగన్ తెర లేపిన వికృత రాజకీయ క్రీడకు పండుటాకులు విలవిల్లాడుతున్నారు. ఒకటో తారీఖున సూర్యోదయానికి ముందే అవ్వాతాతలను బ్యాంక్లకు రప్పించారు. -
నిత్యం పరేషాన్
[ 04-05-2024]
ఇంటింటికీ ఎండీయూ(మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల ద్వారా నిత్యావసరాల సరకులు అందజేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఆర్భాటం చేయడం తప్ప ఆచరణలో ఎక్కడా కానరావడం లేదు. ఏ ప్రాంతంలో ఎప్పుడు సరకులిస్తారో తెలియదు.. సమయ పాలన ఉండదు. -
సేవకుడిని కాదని స్మగ్లర్కు వైకాపా సీటు
[ 04-05-2024]
సైకో జగన్ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదని తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెచ్చి సీటిచ్చారు. తాతల నాటి ఆస్తులను కొట్టేసేందుకు భూరక్షణ చట్టం తెచ్చారు. -
వైకాపాను ఓడించకపోతే.. యువతకు ఉపాధి కష్టమే
[ 04-05-2024]
వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. -
తపాలా ఓట్లకు ఫెసిలిటేషన్ కేంద్రాలు
[ 04-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఫ్లోరైడ్ ఊసెత్తక.. నిమ్జ్ మాటెత్తక..
[ 04-05-2024]
జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార సభ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపింది. కనిగిరి ప్రాంత సమస్యలపై గట్టి హామీలిస్తారని..తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరిస్తారని భావించిన వారికి నిరాశే ఎదురైంది. -
తెదేపాలోకి ఇద్దరు కార్పొరేటర్లు
[ 04-05-2024]
ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కార్పొరేటర్లు పార్టీలోకి చేరగా, శుక్రవారం మరో ఇద్దరు కార్పొరేటర్లు తెదేపా కండువా కప్పుకున్నారు. -
పశ్చిమ ప్రకాశానికి వరాల జల్లు
[ 04-05-2024]
మండు వేసవిలో చంద్రన్న కురిపించిన వరాల జల్లుతో పొదిలివాసులు పులకరించారు. వారి ఆకాంక్షలను నెరవేరుస్తానంటూ ఇచ్చిన ఒక్కో హామీకి చప్పట్లు చరిచి వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. -
నీళ్లో.. జగనన్నా!
[ 04-05-2024]
గిద్దలూరు నగరపంచాయతీవాసులు గత పదిహేను రోజులుగా తాగునీటికి అల్లాడుతున్నారు. నగరపంచాయతీ పరిధిలో ఉన్న డీప్బోర్లలో రోజుకో ప్రాంతంలో నీరు అడుగంటడంతో సమస్య తీవ్రతరమవుతోంది. -
కారు ఢీకొని వాహన చోదకుడి మృతి
[ 04-05-2024]
కారు ఢీకొని ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచర్లవారిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
-
నడివీధిలో ఆమెను స్తంభానికి కట్టేసి..
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
హైదరాబాద్లో దారుణం.. పార్కింగ్ గొడవతో కక్షగట్టి ఏడాది తర్వాత హత్య