జనం చూస్తే నాకేంటి!
పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు.
నిధులివ్వక రూ. కోట్లలో బకాయిలు
పేదలకు అందని ఆరోగ్యశ్రీ సేవలు
రోగులను గెంటేస్తున్నఆసుపత్రులు
న్యూస్టుడే, ఒంగోలు నగరం, పామూరు, కురిచేడు: పరదాల మధ్య ఇంతకాలం తిరిగిన జగన్కు.. సామాన్యుల బాధలు, వారి ఆవేదన ఇంతకాలం ఏమాత్రం పట్టలేదు. వాస్తవ పరిస్థితులను గుర్తించలేదు. 3,257 రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చికిత్సలు అందిస్తున్నట్లు ఎన్నికల వేళ సభల్లో డప్పులు కొడుతున్న ఆయన.. తానే నిధులాపేసి వారి ఆరోగ్యానికి ఉరేశారనే నిజాన్ని కప్పిపుచ్చుతున్నారు. తన పాలనలో విప్లవం తెచ్చామంటూ మాటల్లో ఊదరకొడుతూ.. చేతల్లో మాత్రం ఆసుపత్రులకు వెళ్లిన రోగులను గెంటేసే వికృత విధానాలను అమలు చేశారు. ఆసుపత్రులకు బకాయిల నిధులాపి పేదల బతుకులతో చెలగాటమాడారు. జనం అప్పులు చేసి వైద్యచికిత్సలు పొందుతుంటే తాను మాత్రం ‘మీ చావు మీరు చావండి’ అని వదిలేశారు. ఫలితంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అంటేనే నెట్వర్క్ ఆసుపత్రులు ఆసక్తి చూపడం లేదు. యాజమాన్యాలు చికిత్స అందించకుండా రోగులను గెంటేస్తున్నాయి. బిల్లులు ఇవ్వకపోతే సేవలు నిలిపివేస్తామని యాజమాన్యాలు డిసెంబర్లో ఒకసారి, ఫిబ్రవరిలో మరోసారి కోరాయి. దీంతో రూ.కోటి రావాల్సిన ఆసుపత్రికి రూ.లక్ష అందించి చేతులు దులుపుకొన్నారు. ఒంగోలు నగరంలోని ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి ప్రస్తుతం రూ.16 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. దీంతో నెట్వర్క్ ఆసుత్రులు సేవలందించేందుకు విముఖత చూపుతున్నాయి.
- సి.ఎస్.పురం మండలం వెంగనగుంట గ్రామానికి చెందిన కుడారి కొండయ్య ఈ ఏడాది జనవరిలో పురుగులమందు తాగాడు. చికిత్స నిమిత్తం ఒంగోలులో ఆరోగ్యశ్రీ సేవలందించే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నుంచి రూ.కోట్లలో బకాయిలు రావాల్సి ఉన్నందున తాము ఆరోగ్యశ్రీ కింద వైద్యచికిత్సలు అందించలేమని.. నగదు చెల్లిస్తే చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో రూ.3.60 లక్షలకు పైగా నగదు చెల్లించి కుమారుడికి వైద్యచికిత్సలు చేయించారు.
- పీసీపల్లి మండలంలోని చిరుకూరివారిపల్లికి చెందిన చిరుకూరి నరసమ్మ అనే వృద్ధురాలికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రమాదవశాత్తు కింద పడటంతో కాలు విరిగింది. చికిత్స కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ. 18 కోట్లకు పైగా బకాయిలున్నందున తాము ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలందించలేమని.. డబ్బు కట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే వేరే ఆసుపత్రికి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు.
- పామూరుకు చెందిన గుత్తి రమణయ్య పాడి గేదెలను మేపుకొంటూ జీవనం సాగిస్తుంటారు. గుండె సంబంధిత వ్యాధితో ఆరు నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో చికిత్స కోసం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం లేదని సిబ్బంది తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో ఆర్థిక భారమైనప్పటికీ రూ.50 వేలు సొంత నగదును వెచ్చించి చికిత్సలు చేయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దొరికినా నేరం కాదట.. విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు
[ 18-05-2024]
ఎన్నికల వేళ కొందరు పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేశారో అనేందుకు యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఘటనే ఓ నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్ బూత్లకు వెళ్తున్న ఓటర్లకు వైకాపా నాయకుడు శ్రీను డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. -
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
[ 18-05-2024]
పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటుచేసుకుంది. -
పండగలా సొంతూళ్లకొచ్చారు
[ 18-05-2024]
2024 సార్వత్రిక రణంలో ఓటర్లు ‘స్థానిక’ సమరం తరహా ఉత్సాహం చూపారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంటుంది. తక్కువ ఓట్లు ఉండటంతో ప్రతి ఒక్కటీ కీలకంగా భావిస్తారు. -
కొలువులకు చదువే సరిపోదు
[ 18-05-2024]
ఇది పోటీ ప్రపంచం.. నెగ్గుకు రావాలంటే అన్నింటా ఇతరులను మించి అదనపు అర్హతలు తప్పనిసరి. అందులోనూ కొలువులు సాధించాలంటే చదువొక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యమూ అవసరం. అది సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగ, ఉపాధి పొందవచ్చు. -
ఓటు వరకే నీళ్ల నాటకం
[ 18-05-2024]
ఎన్నికలు ముగియడంతో ఓటర్లతో ఇక పనేముందని వైకాపా అభ్యర్థులు, నేతలు అనుకుంటున్నారు కాబోలు. ఇన్ని రోజులు వారి చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీళ్లు సరఫరా చేయించారు. -
స్ట్రాంగ్రూమ్లను రోజూ సందర్శించండి
[ 18-05-2024]
ఈవీఎంలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఘాట్లో ప్రమాద ఘంటికలు
[ 18-05-2024]
ఎతైన కొండలు, లోతైన లోయలు, వంపులతో కూడిన మలుపులు ఉన్న నల్లమల లోని శ్రీశైలం రహదారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మూల మలుపుల వద్ద చోదకులు వాహనాల వేగాన్ని నియంత్రించ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. -
ఓట్లు వేయలేదనే వైకాపా దాడులు
[ 18-05-2024]
-
ఉపాధి చూపే బండే ఊపిరి తీసింది..
[ 18-05-2024]
ఐస్క్రీం బండిలో ఐస్క్రీంలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ యువకుడిని అదే బండి ప్రాణం తీసింది. ఐస్క్రీం బండికి విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి చెందిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని గణపవరంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. -
బాలికపై అత్యాచారం
[ 18-05-2024]
బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన చిన్నదోర్నాలలో శుక్రవారం వేకువజామున జరిగింది. ఎస్సై అంకమ్మరావు తెలియజేసిన వివరాల మేరకు.. ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది.
తాజా వార్తలు (Latest News)
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్