తపాలా ఓట్లకు ఫెసిలిటేషన్ కేంద్రాలు
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నేటి నుంచి ఉద్యోగ సిబ్బంది వినియోగం
ఇంటి వద్దే ఓటింగ్కు ఏర్పాట్లు పూర్తి
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీవో, ఏపీవో, ఓపీవోలు, సూక్ష్మ పరిశీలకులకు ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ విధులకు కేటాయించిన ఉద్యోగులు అందుకు సంబంధించిన ఉత్తర్వులతో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన ఉద్యోగులకు ఓటు ఏ నియోజకవర్గంలో ఉన్నా(ఇతర జిల్లాల్లో కూడా) ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. మే 4న పీవోలు, ఏపీవోలు; 5, 6న ఓపీవోలు; 7న పోలీసు సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వనున్నారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్న అధికారులు, ఉద్యోగులకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి ఒంగోలు భాగ్యనగర్లోని కేంద్రియ విద్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. 6 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరు బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలిసారిగా 85 సంవత్సరాల పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఇంటి వద్దనే ఓటింగ్ అవకాశం ఇవ్వనున్నారు. అర్హులైనవారు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటి వద్దనే ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దొరికినా నేరం కాదట.. విమర్శలకు తావిస్తున్న పోలీసుల తీరు
[ 18-05-2024]
ఎన్నికల వేళ కొందరు పోలీసులు అధికార పార్టీకి ఎంత తొత్తులుగా పనిచేశారో అనేందుకు యర్రగొండపాలెంలో చోటుచేసుకున్న ఘటనే ఓ నిదర్శనం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న పోలింగ్ బూత్లకు వెళ్తున్న ఓటర్లకు వైకాపా నాయకుడు శ్రీను డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులకు తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు. -
పెళ్లికి నిరాకరించిందని పగ.. కాళ్లు పట్టుకున్నా కనికరించని కక్ష
[ 18-05-2024]
పెళ్లికి నిరాకరించిందనే కక్షతో ఓ యువకుడు యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటుచేసుకుంది. -
పండగలా సొంతూళ్లకొచ్చారు
[ 18-05-2024]
2024 సార్వత్రిక రణంలో ఓటర్లు ‘స్థానిక’ సమరం తరహా ఉత్సాహం చూపారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంటుంది. తక్కువ ఓట్లు ఉండటంతో ప్రతి ఒక్కటీ కీలకంగా భావిస్తారు. -
కొలువులకు చదువే సరిపోదు
[ 18-05-2024]
ఇది పోటీ ప్రపంచం.. నెగ్గుకు రావాలంటే అన్నింటా ఇతరులను మించి అదనపు అర్హతలు తప్పనిసరి. అందులోనూ కొలువులు సాధించాలంటే చదువొక్కటే సరిపోదు. పనిలో నేర్పు, నైపుణ్యమూ అవసరం. అది సాధించిన విద్యార్థులు కళాశాల నుంచే నేరుగా ఉద్యోగ, ఉపాధి పొందవచ్చు. -
ఓటు వరకే నీళ్ల నాటకం
[ 18-05-2024]
ఎన్నికలు ముగియడంతో ఓటర్లతో ఇక పనేముందని వైకాపా అభ్యర్థులు, నేతలు అనుకుంటున్నారు కాబోలు. ఇన్ని రోజులు వారి చుట్టూ తిరిగిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్యాంకర్ల సంఖ్య పెంచి నీళ్లు సరఫరా చేయించారు. -
స్ట్రాంగ్రూమ్లను రోజూ సందర్శించండి
[ 18-05-2024]
ఈవీఎంలకు పటిష్ఠమైన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లపై సచివాలయం నుంచి జిల్లా అధికారులతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. -
ఘాట్లో ప్రమాద ఘంటికలు
[ 18-05-2024]
ఎతైన కొండలు, లోతైన లోయలు, వంపులతో కూడిన మలుపులు ఉన్న నల్లమల లోని శ్రీశైలం రహదారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మూల మలుపుల వద్ద చోదకులు వాహనాల వేగాన్ని నియంత్రించ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. -
ఓట్లు వేయలేదనే వైకాపా దాడులు
[ 18-05-2024]
-
ఉపాధి చూపే బండే ఊపిరి తీసింది..
[ 18-05-2024]
ఐస్క్రీం బండిలో ఐస్క్రీంలు అమ్ముకుంటూ జీవనం సాగించే ఆ యువకుడిని అదే బండి ప్రాణం తీసింది. ఐస్క్రీం బండికి విద్యుత్తు సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురైన యువకుడు మృతి చెందిన సంఘటన త్రిపురాంతకం మండలంలోని గణపవరంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. -
బాలికపై అత్యాచారం
[ 18-05-2024]
బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన చిన్నదోర్నాలలో శుక్రవారం వేకువజామున జరిగింది. ఎస్సై అంకమ్మరావు తెలియజేసిన వివరాల మేరకు.. ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన బాలిక శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లింది.
తాజా వార్తలు (Latest News)
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM