logo

సూపర్‌ హిట్‌.. తెదేపా శ్రేణుల్లో జోష్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పొదిలి, గిద్దలూరులో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు.

Published : 04 May 2024 06:34 IST

పొదిలి: ప్రసంగిస్తున్న చంద్రబాబు.. చిత్రంలో మార్కాపురం తెదేపా అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి

ఈనాడు, ఒంగోలు: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. పొదిలి, గిద్దలూరులో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. అధికార వైకాపా అయిదేళ్ల పాటు సాగించిన అరాచకాలు, అభివృద్ధి నిరోధక విధానాలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలు, అమలు చేయనున్న సూపర్‌ సిక్స్‌ పథకాలు, మ్యానిఫెస్టోను వివరిస్తూ ప్రజల్లో భరోసా నింపారు. చంద్రబాబు, పవన్‌ల సభలకు జనం అధిక సంఖ్యలో తరలిరావడం ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో జోష్‌ నింపింది.

బాబు ప్రసంగానికి జేజేలు పలుకుతూ యువత కేరింతలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని