logo

కారు ఢీకొని వాహన చోదకుడి మృతి

కారు ఢీకొని ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచర్లవారిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.

Published : 04 May 2024 06:15 IST

కనిగిరి, న్యూస్‌టుడే : కారు ఢీకొని ద్విచక్ర వాహన చోదకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని కంచర్లవారిపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. వెలిగండ్ల మండలం పద్మాపురానికి చెందిన బత్తుల రవి (22) కంచర్లవారిపల్లి నుంచి కనిగిరి వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఎదురుగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుని బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని