రైతులూ.. తక్కువ ధరకు అమ్ముకోవద్దు
‘ధాన్యం పండించిన రైతులు తొందరపడి ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. జిల్లాలో ఎంపిక చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం.
‘న్యూస్టుడే’తో పౌరసరఫరాల సంస్థ డీఎం
గ్లోరియా
‘ధాన్యం పండించిన రైతులు తొందరపడి ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. జిల్లాలో ఎంపిక చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. నూర్పిళ్లు పూర్తి కాగానే ఆర్బీకేల్లో సమాచారమిస్తే వెంటనే రైతులకు కొనుగోలు సమయం తెలిపి సేకరిస్తాం. ఆ తర్వాత 21 రోజుల్లోపే అన్నదాతల బ్యాంక్ ఖాతాలకు నగదు జమ అవుతాయి..’ అని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.గ్లోరియా తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియకు సంబంధించి ‘న్యూస్టుడే’తో ఆమె మాట్లాడారు. ఇవీ వివరాలు...
న్యూస్టుడే, ఒంగోలు గ్రామీణం
* 19 వేల టన్నుల సేకరణ లక్ష్యం...: యర్రగొండపాలెం, పెద్దారవీడు మినహా మిగతా 36 మండలాల్లో క్లస్టర్లుగా గుర్తించిన 51 రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రస్తుత సీజన్లో 19 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించాం. అందులో ఇప్పటివరకు త్రిపురాంతకం, దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల పరిధిలోని 10 ఆర్బీకేల ద్వారా 73 మంది రైతుల నుంచి 513 టన్నులు సేకరించాం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం గ్రేడ్ ఏ-రకం క్వింటా ధర రూ.2,060; సాధారణ రకం క్వింటా ధర రూ.2,040 చొప్పున కొనుగోలు చేస్తున్నాం.
పొలం నుంచి ట్రాక్టర్ ద్వారా ధాన్యం బస్తాలు తరలిస్తున్న రైతులు
* సంచుల కొరత లేదు...: సేకరణకు ముందే 3 లక్షల గన్నీ సంచులు సిద్ధం చేసి అందించాం. ధాన్యం రవాణాకు సంబంధించి వాహనాలను సమకూర్చేందుకు ఒంగోలు, కనిగిరి, మార్కాపురం డివిజన్లకు ముగ్గురు గుత్తేదారులను నియమించాం. నేరుగా పొలం నుంచే రవాణాకు వాహనం ఏర్పాటుచేస్తున్నాం. రైతులే సొంతంగా వాహనాలను సమకూర్చుకుంటే రవాణా ఛార్జీలను నిర్ణయించిన మేరకు బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తాం.
తడిచిన ధాన్యం కొనుగోలుకూ చర్యలు...
నిబంధనల మేరకు తేమ 17 శాతం మించకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే ఆరబెట్టుకురమ్మని ముందుగానే రైతులకు సూచిస్తున్నాం. మాండౌస్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఏడు మండలాల పరిధిలో ప్రాథమికంగా 662 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిచినట్టు గుర్తించాం. ఆ పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి నిమిత్తం సంయుక్త కలెక్టర్ ద్వారా లేఖ రాశాం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. గత వారంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో తడిచిన ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు త్వరలోనే మిల్లర్లతో సమావేశం నిర్వహించనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు