logo

30న నేతల ఆగమనం‌.. ఒకేరోజు జగన్‌, లోకేష్‌, బాలకృష్ణ

సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది.

Updated : 27 Apr 2024 06:13 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. ఈ క్రమంలో ఇరుపార్టీలకు చెందిన అగ్ర నేతలు జిల్లాపై దృష్టి పెట్టారు.

  •  ఈ నెల 30న ఉదయం పది గంటలకు వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి టంగుటూరులో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఆ తర్వాత కడప జిల్లా మైదుకూరు వెళ్తారు. అందుకు సంబంధించి జాతీయ రహదారి పక్కన హెలీప్యాడ్‌ స్థలాన్ని ఇప్పటికే పరిశీలించారు.
  •  అదే రోజు తెదేపాకు చెందిన కీలక నేతలు కూడా జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఒంగోలు వస్తారు. ఇక్కడ నిర్వహించనున్న యువజన సమావేశంలో పాల్గొంటారు. అందుకు సంబంధించిన వేదికను ఖరారు చేసే పనిలో పార్టీ నాయకులు నిమగ్నమయ్యారు.
  •  హిందూపురం ఎమ్మెల్యే, తెదేపా నేత నందమూరి బాలకృష్ణ మర్రిపూడిలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో అదే రోజు పాల్గొంటారు. వచ్చే నెల 9న తెదేపా, జనసేన అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ ఒంగోలులో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నట్లు సమాచారం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని