పైసా విదిల్చింది లేదు
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది.
వైకాపా పాలనలో క్రీడాభివృద్ధి కుదేలు
నిలిచిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. నిర్మాణం పూర్తయితే మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుందని ఎందరో ఆశగా ఎదురు చూశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక..నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు గోడలతోనే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ అయిదేళ్లలో అధికార పార్టీ స్టేడియం నిర్మాణాకి పైసా విదల్చలేదు. దీంతో క్రీడా పోటీల నిర్వాహణకు ఇక్కడ అస్కారం లేకుండా పోయింది.
చాటు చేసి..మమ అనిపించారు..: అర్థవీడు బాలుర గురుకుల మైదానం వేదికగా 2022 అక్టోబర్ 21 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయి అండర్-14 రగ్బీ పోటీలను జిల్లా రగ్బీ సంఘం, గురుకుల పాఠశాల యాజమాన్యం సంయుక్తంగా నిర్వహించారు. క్రీడల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం ఏదో చేస్తుందని..రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల ముందు వైకాపా నాయకులు డప్పు కొట్టారు. అయితే రగ్బీ పోటీలు జరుగుతున్న మైదానంలోనే నిధులు లేమితో నిలిచిన మినీ ఇండోర్ స్టేడియం కనపడుతున్నా దాని గురించి నోరెత్తేందుకు వీళ్లకు మనసు లేకుండా పోయింది. అంతేకాక స్టేడియం పూర్తిగా కనపడకుండా దాని చుట్టూ పరదాలు కట్టించి మరీ రగ్బీ పోటీల నిర్వాహణ చేయడం స్థానిక వైకాపా నాయకుల వంతైంది.
అర్థవీడు, న్యూస్టుడే
మినీ స్టేడియం పూర్తయింటే..
అర్థవీడు గురుకుల మైదానంలో అర్ధాంతరంగా నిలిచిన ఇండోర్ మినీ స్టేడియం నిర్మాణం పూర్తయి ఉంటే క్రీడాకారులకు ఎంతో మేలు జరిగేది. అటవీ సమీప పల్లెల్లోని క్రీడాకారుల్లో మంచి నైపుణ్యం ఉన్నా..ఇక్కడ సరైన క్రీడా వసతులు లేకపోయాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇండోర్ స్టేడియం పనులకు వైకాపా ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిలిపి వేయడంతో ఉపయోగంలోకి రాకుండా పోయింది. నిర్మాణం పూర్తయి వాడులోకి వస్తే క్రీడాకారులకు మేలు జరిగేది..
గోన రాజ్కుమార్, పాపినేనిపల్లి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులకు ‘జగనన్న ద్రోహం’
[ 07-05-2024]
ఏటా జాబ్ క్యాలెండర్..మెగా డీఎస్సీ..ఆపై ఏపీపీఎస్సీ..ఇంకా పోలీసు పోస్టులు..మీకిక ఉద్యోగాలే ఉద్యోగాలు. అయిదేళ్ల క్రితం జగన్ ఇలా తన వంచనాపూరిత హామీలతో జిల్లాను హోరెత్తించేశారు. -
‘భూ’చోళ్లు.. జగనన్నే వెన్నుదన్ను
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో భూ మాఫియా రెచ్చిపోయింది. కొండలు, గుట్టలు, కాలువ గట్లు, జల వనరులు, అసైన్డ్, పశువుల పోరంబోకు, దేవుని మాన్యం, శ్మశాన భూములు ఆక్రమించారు. -
ఓటేయకుంటే... గొంతులూ తడపం
[ 07-05-2024]
గొంతులెండుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వండని జనం వేడుకుంటుంటే.. ‘మీరు మా పార్టీ కాదు కదా’ అని ప్రశ్నిస్తూ అమానుషంగా ప్రవర్తిన్నారు వైకాపా నాయకులు. -
అంతర్జాతీయ రాగం.. బతుకులు ఆగమాగం..
[ 07-05-2024]
‘రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. అందుకు విద్య, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నాం’ ఇవీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకొంటున్న మాటలు. -
కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు
[ 07-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
అరాచక పాలనను అంతమొందిద్దాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించడానికి కాపులంతా జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని టీబీకే రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము కోరారు. -
అధికారం ఉన్నోడిదే భూమి!
[ 07-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్ మోహన్రెడ్డి పుస్తకాలను జారీచేశారు. -
తెదేపా హయాంలోనే సంక్షేమానికి పెద్దపీట
[ 07-05-2024]
వైకాపా పాలనలో కంటే తెదేపా హయాంలోనే సంక్షేమానికి బడ్జెట్లో ఎక్కువ ఖర్చుచేసినట్లు ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
[ 07-05-2024]
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య