శ్మశానంలోనూ ఇసుకాసురులు
ఇసుక ఎక్కడ దొరికినా అక్రమార్కులు వదలటం లేదు. ఇటీవల గుండ్లకమ్మ నదీ గర్భంలో తవ్వకాలకు యంత్రాలను ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
పోలవరం సమీపంలోని ఎస్సీ శ్మశానవాటిక వద్ద పొక్లెయిన్తో ఇసుక తవ్వుతున్న దృశ్యం
ముండ్లమూరు, న్యూస్టుడే: ఇసుక ఎక్కడ దొరికినా అక్రమార్కులు వదలటం లేదు. ఇటీవల గుండ్లకమ్మ నదీ గర్భంలో తవ్వకాలకు యంత్రాలను ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ముండ్లమూరు మండలం పోలవరంలోని ఎస్సీ శ్మశాన వాటిక స్థలంలో రెండు రోజులుగా జోరుగా తవ్వకాలు చేపడుతున్నారు. పోలవరం సమీపంలోని కొంత భూమిని ఎస్సీలు పూర్వం నుంచి శ్మశానవాటికగా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ చిలకలేరు ఉండటంతో ఇసుక లభిస్తుంది. ఇదే అదునుగా పొక్లెయిన్తో కొందరు తవ్వకాలు సాగిస్తూ టిప్పర్లు, లారీలకు ఎత్తి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినప్పటికీ ఏ అధికారీ పట్టించుకున్న దాఖలాలు లేవు. విషయం తెలుసుకున్న ఎస్సీ కాలనీ వాసులు ఆ ప్రాంతాన్ని ఆదివారం పరిశీలించారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న పొక్లెయిన్, తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. రాజకీయ నాయకులు, కొందరు అధికారుల కనుసన్నల్లోనే తవ్వకాలు సాగుతున్నాయని ఆరోపించారు. తవ్వకాలతో గోతులు ఏర్పడితే మృతదేహాలను ఖననం చేసేందుకూ స్థలం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తవ్వకాలు సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై తహసీల్దార్ ఉషారాణి మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదని, తామెక్కడా అనుమలులు ఇవ్వలేదన్నారు. ఆ ప్రాంతాన్ని సోమవారం పరిశీలించి తగు చర్యలు చేపడతామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?