logo

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సుల ఢీ

పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్ రహదారిలోని చింతల సమీపంలో రెండు ఆర్టీసీˆ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

Published : 06 May 2024 02:12 IST

ప్రయాణికుడి మృతి
నాలుగు గంటలు నిలిచిన ట్రాఫిక్‌

మృతుడు రాజారావు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్ రహదారిలోని చింతల సమీపంలో రెండు ఆర్టీసీˆ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుంటూరులోని కాకుమానుతోట నాలుగో లైనుకు చెందిన ఊట్ల రాజారావు(69) మృతి చెందారు. ఎస్సై అంకమ్మరావు తెలిపిన వివరాల ప్రకారం నరసరావుపేట ఆర్టీసీˆ డిపోకు చెందిన బస్సు ఆదివారం శ్రీశైలం వెళుతోంది. అదే సమయంలో శ్రీశైలం నుంచి పెద్దదోర్నాల వైపు మంగళగిరి ఆర్టీసీ డిపో బస్సు వస్తోంది. ఈ రెండు వాహనాలు చింతల సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నరసరావుపేట బస్సులో ఉన్న గుంటూరుకు చెందిన ఊట్ల రాజారావు తీవ్రంగా గాయపడగా, ఆయన్ను పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించేలోపు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. నరసరావుపేట బస్సులో నలుగురు, మంగళగిరి బస్సులో ఏడుగురు ప్రయాణికులున్నారు. వాహనాలు రెండూ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఇరువైపులా ట్రాఫిక్‌ దాదాపు నాలుగు గంటల పాటు ఆగిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై అంకమ్మరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, క్రేన్‌ సాయంతో బస్సులను పక్కకు తొలగింపజేసి రాకపోకలు పునరుద్ధరించారు.

ప్రమాద స్థలంలో నిలిచిపోయిన వాహనాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని