logo

కొనసాగుతున్న తపాలా.. ఇంటి వద్దే ఓటు

జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published : 07 May 2024 02:52 IST

గిద్దలూరులో ఓటరు ఇంటి వద్దకు వెళ్లి బ్యాలెట్‌ పత్రం అందజేస్తున్న సిబ్బంది

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహిస్తూ మే 13న పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం లేని అధికారులు, ఇతర శాఖల ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోనూ ఈ నెల 4 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ కొనసాగుతుండగా.. మంగళవారంతో ముగియనుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలిసారిగా జిల్లా వ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు కూడా ఇంటి వద్దనే ఓటింగ్‌ కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని