జీతం నెల్లూరు నగరపాలక సంస్థ నుంచి.. సేవలు నరసరావుపేటలో వైకాపాకు!
నెల్లూరు నగరపాలకసంస్థలో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులు వారికి కేటాయించిన విధులను విస్మరించి వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.
నెల్లూరు (నగరపాలకసంస్థ), న్యూస్టుడే: నెల్లూరు నగరపాలకసంస్థలో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులు వారికి కేటాయించిన విధులను విస్మరించి వైకాపా అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. కొందరు సిబ్బంది ఏకంగా నరసరావుపేటకు వెళ్లి అక్కడ వైకాపా ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ (ప్రస్తుతం నెల్లూరు నగర ఎమ్మెల్యే) తరఫున ప్రచారం చేస్తుండటం గమనార్హం. పొరుగుసేవల సిబ్బంది ద్వారక, మంజుల, సబిహలు అనిల్కుమార్, మంత్రి అంబటి రాంబాబుతో దిగిన ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వీరితో పాటు మరో పది మంది వరకు ఉద్యోగులు నరసరావుపేటలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్కు నెల రోజుల ముందు అధికార పార్టీ నేతల సిఫార్సులతో 113 మంది నగరపాలకసంస్థలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా చేరారు. వీరికి నెలకు రూ.21వేల వరకు జీతం చెల్లిస్తున్నారు. వీరంతా ఎక్కడ పనిచేస్తున్నారో అధికారులకు తెలియకపోవడం గమనార్హం. వీరితో పాటు అయిదేళ్ల నుంచి పని చేస్తున్న సిబ్బందిలో కొందరు విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. వచ్చి హాజరు వేసుకోవడం.. తిరిగి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్నా.. పాలన గాడిలో పడకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది రోజుల్లో నష్ట పరిహారం జాబితా..!
[ 20-05-2024]
రబీలో గిద్దలూరు వ్యవసాయశాఖ సబ్ డివిజన్లో రైతులు సాగుచేసిన పంటలు వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయి. -
కనీసం గుంతలైనా పూడ్చరా...!
[ 20-05-2024]
గత అయిదు సంవత్సరాలుగా ప్రభుత్వం కొత్త రోడ్ల సంగతి అటుంచితే కనీసం ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో పట్టణం నుంచి తర్లుపాడు వెళ్లే రోడ్డు గుంతలతో దర్శనమిస్తుంది. -
వర్షాలతో.. సాగుకు సమాయత్తం
[ 20-05-2024]
జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సమాయత్తమయ్యారు. తుపాను ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో వేసవి దుక్కులు దున్ని పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 20-05-2024]
ఆదివారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో స్థానిక శ్రీప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ర్యాంకులు సాధించారు. -
రెండేళ్లలో 45 మంది దుర్మరణం
[ 20-05-2024]
జిల్లాలో రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. ఒంగోలు- కర్నూలు రహదారిపై ప్రయాణమంటేనే జనం భీతిల్లుతున్నారు. -
చితికిన పేద బతుకులు
[ 20-05-2024]
ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా... -
పోలీసులు X అల్లరిమూకలు
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న జిల్లాలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. -
కొత్తపట్నంలో కిరాతకం
[ 20-05-2024]
కొత్తపట్నంలో శనివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని గొంతు నులిమి, ముక్కు మూసి ఊపిరాడకుండా చేసి గుర్తుతెలియని ఆగంతుకులు హత్య చేశారు. -
37 వేల బేళ్లు.. రూ. 94 కోట్లు
[ 20-05-2024]
పొగాకు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. బ్రైట్ రకం కోసం వ్యాపారులు పోటీ పడుతుండటంతో కర్షకులకు కలిసొస్తోంది. -
పురంలో అక్రమాల రిజిస్ట్రేషన్
[ 20-05-2024]
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు మార్కాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు అధికారులకు కాసులు కురిపిస్తోంది. -
ఆటల్లోనూ జగన్నాటకం
[ 20-05-2024]
అయిదేళ్లపాటు క్రీడారంగాన్ని పట్టించుకోని వైకాపా ప్రభుత్వం.. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు జగన్నాటకం ఆడించింది.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..