logo

కూటమి విజయం.. జనసేన ఆశయం

అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు.

Updated : 29 Mar 2024 05:20 IST

నాగబాబుతో మాట్లాడుతున్న దాసరి రాజు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి జన సైనికుడు శ్రమించాలని పార్టీ నాయకుడు నాగబాబు అన్నట్లు ఇచ్ఛాపురం జనసేన పార్టీ బాధ్యులు దాసరి రాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తప్పనిసరిగా తగిన గుర్తింపు ఇస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు నాగబాబు వివరించారన్నారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయానికి ఆహ్వానించి, ఇచ్ఛాపురంలో పరిస్థితి అడిగి తెలుసుకున్నారన్నారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విజయానికి కృషి చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని