logo

ప్రచారం జోరు..!

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యాదవులలో అత్యధికులు ఈ పార్టీ వెంటే ఉన్నారని, రాబోయే కాలంలో సముచిత స్థానం లభిస్తుందని పట్టణ తెదేపా అధ్యక్షులు కాళ్ల ధర్మారావు యాదవ్‌ అన్నారు.

Published : 07 May 2024 04:42 IST

చంద్రబాబు వెంటే యాదవులు

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యాదవులలో అత్యధికులు ఈ పార్టీ వెంటే ఉన్నారని, రాబోయే కాలంలో సముచిత స్థానం లభిస్తుందని పట్టణ తెదేపా అధ్యక్షులు కాళ్ల ధర్మారావు యాదవ్‌ అన్నారు. తెదేపానే నమ్ముకుని, ఏళ్ల తరబడి పార్టీ విజయానికి కృషిచేయడం జరుగుతోందని, ఈ ఎన్నికలలో కూడా అందరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.


ఇచ్ఛాపురం, పలాస, న్యూస్‌టుడే: కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారని, అభివృద్ధి పరుగులు తీసుందని తెదేపా నాయకులు అన్నారు. ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాల్లోని జోరుగా ప్రచారం చేశారు. చంద్రబాబును గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సూపర్‌-6పై అవగాహన కల్పించారు.

వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ డెప్పూరు, సొండిపూడికి చెందిన పది మంది తెదేపాతో చేరారు. కూటమి అభ్యర్థి గౌతు శిరీష పార్టీలోకి ఆహ్వానించారు.


తెదేపాలో పలువురి చేరిక

కంచిలి, న్యూస్‌టుడే : శాసన సభ్యుడు బెందాళం అశోక్‌ సమక్షంలో సోమవారం తలతంపర పంచాయతీలో 60 కుటుంబాలు తెదేపాలో చేరాయి. కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు ఎం.రామారావు, బి.కురయ్య, ఎం.పూర్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు