logo

నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదాం

రాష్ట్రంలో అయిదేళ్ల పాటు కొనసాగిన వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గొండు శంకర్‌ పిలుపునిచ్చారు.

Published : 07 May 2024 05:06 IST

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్ల పాటు కొనసాగిన వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గొండు శంకర్‌ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం నైర పంచాయతీలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జగన్‌ హయాంలో అందరూ ఇబ్బందులు పడ్డారని, చంద్రబాబుతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి సూపర్‌-6 పథకాలు, ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచి అరవల రామ్‌ప్రతాప్‌, అరవల రవీంద్ర, శ్రీలత, కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని