తెదేపాలో చేరితే ఇంట్లో సామగ్రి కాల్చేశారు
హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట కాలనీలో నివాసముంటున్న బేతాల ఈశ్వరరావు, కవిత దంపతుల ఇంటి సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దహనం చేశారు.
ఈశ్వరరావు ఇంట్లో కాలిపోయిన సామగ్రి
సంతబొమ్మాళి, న్యూస్టుడే: హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట కాలనీలో నివాసముంటున్న బేతాల ఈశ్వరరావు, కవిత దంపతుల ఇంటి సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దహనం చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమంతునాయుడుపేట సర్పంచి ప్రతినిధి పాల మహేష్, జడ్పీటీసీ సభ్యుడు పాల వసంతరెడ్డిల ప్రోత్సాహంతో అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు సామగ్రి కాల్చేశారు. గతంలో ఈశ్వరరావు ఇంటిలో కుటుంబ సభ్యులతో ఉండగా సర్పంచి ప్రతినిధి మహేష్ అనుచరులు దౌర్జన్యంగా దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో గ్రామంలో సర్పంచి ప్రతినిధి ఆగడాలు తట్టుకోలేక ఇటీవల తెదేపాలో చేరారు. ఈ ఇంట్లో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ ప్రకారం శ్లాబ్ ఇల్లు కట్టుకోవాలని ఇనుప రేకులు తొలగించారు. ఇంట్లో పరదాలతో పాటు ఇతర సామగ్రి ఉన్న సమయంలో మంగళవారం రాత్రి వైకాపా నాయకులు ఆయన ఇంటిలో సామగ్రిని దహనం చేశారు. అనుమానితులుగా భావిస్తున్న అయిదుగురు వ్యక్తులపై బాధితుడు నౌపడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి నౌపడ ఎస్సై కిశోర్వర్మ, సిబ్బంది చేరుకొని ఆరా తీశారు. ఈ ఇంటిపై ఏడాదిగా తగాదా నడుస్తోందని, ఎటువంటి రాజకీయ కారణాలు లేవని ఎస్సై తెలిపారు.
ఇలాంటి ఘటనలకు పాల్పడం సరికాదు.. ఘటనను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని తెదేపా మండల నాయకులు అట్టాడ రాంప్రసాద్, విష్ణుమూర్తి, భాస్కరరావు తదితరులకు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రీడా రంగంపై నీలినీడలు
[ 20-05-2024]
క్రీడాకారులను ప్రోత్సహించాలన్న మంచి ఉద్దేశంతో తెదేపా హయాంలో అన్ని వసతులు కల్పించి క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
మండేకాలం.. వీడాలి నిర్లక్ష్యం..!
[ 20-05-2024]
శ్రీకాకుళం గ్రామీణ మండలం కిల్లిపాలెంలో ఈ నెల 8న స్థానిక తోటల్లో ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచార మివ్వగా.. -
నిశీధి వేళ.. చిట్టి తాబేళ్లకు రక్ష..!
[ 20-05-2024]
జిల్లాలో సువిశాల సముద్ర తీరం పొడవునా పెద్ద ఇసుక తిన్నెలు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం ఆలీవ్ రిడ్లే తాబేళ్లకు ఎంతో అనువైన ప్రదేశం. -
సచివాలయ ఉద్యోగిని అవయవదానం
[ 20-05-2024]
పుట్టెడు దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన సచివాలయ ఉద్యోగిని అవయవ దానం చేసి మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మందుకు వచ్చారు. -
నైపుణ్యం పెంచుకో.. ఉపాధి అవకాశాలు పట్టుకో..!
[ 20-05-2024]
పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకొంటూ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఐటీఐ కోర్సులు దోహదపడుతున్నాయి. -
4,35,049 మంది ఓటుకు దూరం..!
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్నింటా తామే ముందు అని నిరూపించారు. -
పోలీసులమని చెప్పి గుత్తేదారుకు బురిడీ
[ 20-05-2024]
పోలీసులమని చెప్పి గుత్తేదారును బురిడీ కొట్టించిన ఉదంతమిది. ఎస్సై జి.అప్పారావు ఆదివారం తెలిపిన వివరాల మేరకు అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన ఎన్.మణికంఠ గుత్తేదారుగా విశాఖపట్నంలో పని చేస్తున్నారు. -
హామీలకే పరిమితం..!
[ 20-05-2024]
ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందించే గ్రోయిన్ల రూపురేఖలు మారడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. -
కమనీయం..కూర్మనాథుని కల్యాణం
[ 20-05-2024]
మండల పరిధి శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో ఆదివారం రాత్రి స్వామి వార్షిక కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. -
ఆదిత్యా.. ఎన్నాళ్లీ అవస్థలు?
[ 20-05-2024]
అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసంలో చివరి ఆదివారం, ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.