ఏడాదికి సరిపడా తాగునీరు
చెన్నైవాసులు మరో ఏడాదిపాటు తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. సరిపడా అందుబాటులో ఉన్నట్లు చెన్నై మహానగర తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మండలి (సీఎండబ్ల్యూఎస్ఎస్బీ - జలమండలి) ప్రకటించింది.
చెన్నైవాసులు మరో ఏడాదిపాటు తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. సరిపడా అందుబాటులో ఉన్నట్లు చెన్నై మహానగర తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ మండలి (సీఎండబ్ల్యూఎస్ఎస్బీ - జలమండలి) ప్రకటించింది. కొన్నేళ్ల క్రితం తాగడానికి నీరు కరవై అలమటించిన నగరవాసులకు ఇది ఎంతో ఊరటనిచ్చే విషయమే.
జలమండలి అధికారులు ఈ మధ్యే సమీక్ష నిర్వహించారు. గతేడాది, అంతకుముందు జలాశయాలలో నీటి నిల్వ, తాజా పరిస్థితిని అంచనా వేశారు. ఈ ఏడాది వేసవి గట్టెక్కినట్లేనని తేల్చారు. ఏడాదిపాటు ఇబ్బంది లేనంతగా నిల్వలు ఉన్నట్లుగా అంచనాకు వచ్చారు. పరీవాహక ప్రాంతాల్లో మరింత మంచి వర్షాలు కురిస్తే అందుబాటులో ఉండే నీటిని వేసవి మరింత చక్కగా వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.
8 టీఎంసీలకు మించి..
చేతిపంపుల ద్వారా మెట్రో నీటి సరఫరా
నగరానికి 6 ప్రధాన రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. పూండి, చోళవరం, రెడ్హిల్స్, కన్నణ్కొట్టై తెర్వోయకండిగై, చెంబరంబాక్కం రిజర్వాయర్లలో మొత్తం ఈ నెల 28 నాటికి 6.89 టీఎంసీల నీరు నిల్వఉంది. వీటి పూర్తి సామర్థ్యం 11.75 టీఎంసీలు. కడలూరు జిల్లాలోని వీరాణం చెరువులోని నిల్వలతో కలిపి మొత్తం 8-9 టీఎంసీలు ఉంటుందని అధికారుల అంచనా. ప్రస్తుతం నగరానికి వీటితోపాటు మరో రెండు నిర్లవణీకరణ కేంద్రాల ద్వారా రోజుకు 1,030 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు.
ముమ్మరంగా ‘పూండి’ పనులు
నగరానికి తాగునీటిని అందించడంలో అత్యంత కీలకంగా ఉన్న పూండి రిజర్వాయరులో ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి నీటిని సరఫరా చేయడం బాగా తగ్గింది. సుమారు రూ.10కోట్లతో ఈ పనులు చేపట్టారు. ప్రస్తుతం సగానికిపైగా పూర్తయినట్లు అధికారులు చెప్పారు. ఇవి పూర్తయితే నగరానికి నీరు యథావిధిగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
భూగర్భజలాలు జాగ్రత్త సుమా..
అన్నా విశ్వవిద్యాలయంలో జియాలజీ విభాగ భవనం
అన్నా యూనివర్సిటీలోని జియాలజీ విభాగం జరిపిన పరిశోధనల్లో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నై పరిధిలోని 38 శాతం నదీ పరివాహక ప్రాంతాలలో భూగర్భజలాలు అడుగంటుతున్నట్లుగా నివేదికలు ఇచ్చారు. ప్రస్తుతం నగర పరిధిలో తక్కువగా ఉన్నాయని.. నీరు భూమిలోకి సరైన రీతిలో ఇంకకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఒకరకంగా ఈ దుస్థితికి నగరీకరణం, అస్తవ్యస్తంగా భూవినియోగం కూడా కారణమని పేర్కొన్నారు. నగరంలోని తీరాన ఉన్న పల్లవాక్కం, తిరువాన్మియుర్, బెసెంట్ నగర్లో ఇసుక ప్రాంతాలున్నా.. అక్కడ నీరు ఇంకడం లేదని చెప్పారు. మంచి వర్షాలు పడుతున్నా ఈ పరిస్థితి ఉండటం ఆలోచించాల్సిన విషయమని తెలిపారు. నీటిని కృత్రిమంగా భూమిలోకి పంపే ప్రయత్నాలు చేయాల్సి ఉందని సూచించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంచి వర్షాలు నమోదయ్యాయని, దీనివల్ల ప్రస్తుతం ఇబ్బంది లేదని వివరించారు. ఈశాన్య రుతుపవనాలు కూడా బాగుంటే భూగర్భజలాలు కనీసం 5-10 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి నీటి వృథాను అరికట్టాలని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?