అటవీశాఖ స్థల ఆక్రమణపై జవాబివ్వాలి
అటవీశాఖకు చెందిన స్థలాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారుల బినామీలు అక్రమించారని దాఖలైన పిటిషన్పై జవాబు ఇవ్వాలని సర్కారును మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ప్యారిస్, న్యూస్టుడే: అటవీశాఖకు చెందిన స్థలాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారుల బినామీలు అక్రమించారని దాఖలైన పిటిషన్పై జవాబు ఇవ్వాలని సర్కారును మద్రాసు హైకోర్టు ఆదేశించింది. దిండుక్కల్ జిల్లా కొడైక్కానల్ పూలత్తూర్ గ్రామానికి చెందిన గోకులకృష్ణన్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. 2010-13 వరకు పూలత్తూర్ గ్రామంలో ఉన్న అటవీశాఖకు సొంతమైన 1.85 ఎకరాల స్థలాన్ని తమిళనాడు చీఫ్ ఆడిట్ అధికారిగా ఉన్న అంబలవాణన్ అనే వ్యక్తికి బినామీల ద్వారా ఇచ్చినట్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో 35 మంది అధికారులు తనపై 11 అబద్ధపు కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తన కుటుంబసభ్యులను వేధించినట్లు చెప్పారు. అవకతవకలను బయటపెట్టిన సీబీసీఐడీ దర్యాప్తును తర్వాత నిలిపేశారన్నారు. ఈ అక్రమాల గురించి అదనపు కార్యదర్శి హోదా అధికారిని నియమించి విచారించాలని, సంబంధిత అధికారిపై శాఖాపరంగా చర్యలు చేపట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. జస్టిస్ అబ్దుల్ ఖుత్తూస్ దీన్ని విచారించారు. విజిలెన్స్ కమిషనరు, హోంశాఖ కార్యదర్శి తదితరులు దీనిపై జవాబు ఇవ్వాలని ఆదేశించారు. విచారణను 23వ తేదీకి వాయిదా వేశారు.
బెయిల్ పిటిషన్ కొట్టివేత
ప్యారిస్, న్యూస్టుడే: రూ. 4 వేల కోట్ల బ్యాంకు రుణం మోసం కేసులో నకిలీ సంస్థ వాటాదారుడి బెయిల్ పిటిషన్ని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. చెన్నైకి చెందిన సురానా ఇండస్ట్రియల్ లిమిటెడ్, సురానా పవర్ లిమిటెడ్లు ఐడీబీఐ, ఎస్బీఐల నుంచి, సురానా కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్బీఐ నుంచి తీసుకున్న రూ.4 వేల కోట్లను తిరిగి చెల్లించలేదు. అనంతరం సురానా సంస్థ డైరెక్టర్లపై సీబీఐ, ఈడీ కేసు నమోదు చేసి, అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో వీరిలోని ఆనంద్ బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇది శనివారం విచారణకు వచ్చింది. ఈ కేసులో తప్పుగా అరెస్టు చేశారని, పెద్దగా చదువుకోకపోవడంతో సంస్థ రాబడి, ఖర్చుల గురించి ఆయనకు తెలియలేదని నిందితుడి తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వకూడదని తెలిపారు. అనంతరం బెయిల్ పిటిషన్ని కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.
జీవో రద్దు చేయాలనే వ్యాజ్యం కూడా...
ప్యారిస్, న్యూస్టుడే: రాష్ట్ర హోంగార్డుల పని దినాలను తగ్గిస్తూ జారీ అయిన జీవోకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది. పని దినాలను నెలలో ఐదురోజులుగా తగ్గించి 2017లో ప్రభుత్వం జారీచేసిన జీవోని వ్యతిరేకించి పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది శనివారం విచారణకు వచ్చింది. పని దినాలను 5 నుంచి 10 రోజులుగా పెంచి, వేతనాన్ని 8 గంటలకు రూ. 560గా నిర్ణయించి 2019లో కొత్త జీవో జారీచేసినట్లు తెలిపారు. దీని రద్దు కోరిన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టి వేసింది.
‘కురవర్’ పదాన్ని తొలగించాలని వినతి
ప్యారిస్, న్యూస్టుడే: ఎంబీసీ జాబితాలో ఉన్న నరిక్కురవర్ సామాజిక వర్గంలో ఉన్న ‘కురవర్ ’ అనే పదాన్ని తొలగించాలని దాఖలైన పిటిషన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు ఇవ్వాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. మదురైకి చెందిన వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్లో .... తమిళ మూలాలతో కొండ ప్రాంతాల్లో ఉండే వారు కురవర్ సామాజిక వర్గం వారని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉన్నారన్నారు. వారికి మలైకురవన్, కురవన్ మొదలైన పేర్లు ఉన్నాయన్నారు. ఎంబీసీ జాబితాలో 1951లో నరిక్కురవర్లను చేర్చారన్నారు. కురవర్ల మాతృభాష తమిళం అన్నారు. కానీ నరిక్కురవర్లు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నుంచి వచ్చినవారని తెలిపారు. వారి అలవాట్లు, వివాహ పద్ధతులు వేరేగా ఉంటాయన్నారు. నరిక్కురవర్లకి రిజర్వేషన్ కల్పించడంలో తమకి ఆక్షేపణ లేదని, కానీ వారిని నరిక్కురవర్ అని పిలవకూడదని, అందుకు బదులుగా వారిని నరిక్కారర్, కురువిక్కారర్ తదితర పేర్లతో పిలవాలన్నారు. ఇది శనివారం విచారణకు వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం, విచారణను వాయిదా వేశారు.
పీసీబీపై ధిక్కరణ చర్యలకు హెచ్చరిక
ప్యారిస్, న్యూస్టుడే: ఏనుగుల మార్గాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఇటుకల బట్టీల గురించి పూర్తి నివేదిక దాఖలు చేయని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిపై ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి వస్తుందని మద్రాసు హైకోర్టు హెచ్చరించింది. కోయంబత్తూరు జిల్లాలో ఏనుగుల మార్గమైన తడాగం పళ్లత్తాక్కు ప్రాంతంలో ఉన్న 134 ఇటుకల బట్టీలను కోర్టు ఉత్తర్వుల మేరకు మూసేశారు. ఆనైకట్టి, పెరియనాయక్కన్ పాళెయం మొదలైన ఏనుగుల మార్గాలకు మార్చారని, ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వాటిని మూసేయాలని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. విచారించిన హైకోర్టు .... బట్టీలకు అనుమతి వివరాలు పరిశీలించి నివేదిక దాఖలు చేయాలని కాలుష్య నియంత్రణ మండలికి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిటిషన్ శనివారం మళ్లీ విచారణకు వచ్చింది. బోర్డు నివేదిక దాఖలు చేసింది. అందులో 23 ఇటుకల బట్టీలను పరిశీలించినట్లు నివేదిక దాఖలు చేసిన కాలుష్య నియంత్రణ బోర్డు, మిగిలిన వాటి గురించి తెలపలేదు. వాటిని మూసేందుకు చర్యలు చేపట్టలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదిక దాఖలు చేసినవారికి వ్యతిరేకంగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించారు. తర్వాతి వాయిదాలో దాఖలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో 22వ తేదీకి విచారణ వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?