అధ్యాపకుల డిమాండ్లు నెరవేరుస్తాం
పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా దశలవారీగా నెరవేరుస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ తెలిపారు.
మంత్రి అన్బిల్ మహేశ్
ర్యాలీలో పాల్గొన్న అన్బిల్ మహేశ్
ఆర్కేనగర్, న్యూస్టుడే: పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల డిమాండ్లను ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా దశలవారీగా నెరవేరుస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ తెలిపారు. అన్నాదురై వర్ధంతి సందర్భంగా తిరుచ్చి దక్షిణ జిల్లా డీఎంకే తరఫున మంత్రి అన్బిల్ మహేశ్ నేతృత్వంలో మౌన ర్యాలీ శుక్రవారం తిరుచ్చి సత్రం బస్టాండ్ వద్ద ప్రారంభమై చింతామణిలోని అన్నా విగ్రహం వద్ద ముగిసింది. అనంతరం విగ్రహానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... పార్ట్టైం ఉపాధ్యాయుల పోరాటం ప్రారంభించిన నాడే చర్చలు జరిపామని చెప్పారు. 30 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారని తెలిపారు. దీని గురించి ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఓ మంచి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి డిమాండ్లు ఏవైనా దశలవారీగా నెరవేరుస్తామని చెప్పారు. ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో విజయవకాశాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. ఇళంగోవన్ వెళ్లే ప్రతిచోట ప్రజల ఆదరణ బాగా ఉందన్నారు. 50 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం?
[ 26-04-2024]
రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు బలమైన డీఎంకేకు, చీలిన ఎన్డీయే కూటములకు మధ్య అన్నట్లుగా సాగాయి. -
వృథా నీటితో ఆదాయం
[ 26-04-2024]
కార్బన్ జీరో ఛాలెంజ్(సీజడ్సీ) పాన్ ఇండియన్ కార్యక్రమం గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీఎం)లో ‘ఎంబార్క్మెంట్’ పేరిట జరిగింది. -
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధనే లక్ష్యం
[ 26-04-2024]
క్యాండిడేట్ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. -
కాంగ్రెస్ గూటికి మన్సూర్ అలిఖాన్
[ 26-04-2024]
సినీ నటుడు మన్సూర్ అలిఖాన్ కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. -
కత్తిపార కూడలిలో మెట్రో రెండో దశ పనులు
[ 26-04-2024]
మెట్రో రెండో దశలో వివిధ మార్గాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
అబ్బురపరుస్తున్న గిండి స్నేక్ పార్క్
[ 26-04-2024]
చెంగల్పట్టు జిల్లా గిండి స్నేక్ పార్క్లో కొత్తగా ఏర్పాటు చేసిన థియేటర్లో త్రీడీ దృశ్యాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. -
విజయ్కు ఎగ్జిబిటర్ శక్తివేల్ శుభాకాంక్షలు
[ 26-04-2024]
విజయ్ ప్రధానపాత్రలో 2004లో విడుదలైన ‘గిల్లి’ చిత్రాన్ని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నాడు ఉన్న ప్రేక్షకాదరణే ప్రస్తుతం కూడా ఈ చిత్రానికి ఉండటంతో పలువురు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్