రాష్ట్రంలో అగ్రనేతల సుడిగాలి ప్రచారం
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు.
ఈనాడు-చెన్నై
నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఎన్నికల కమిషన్ నుంచి అభ్యర్థుల అధికారిక ప్రకటనే మిగిలింది. వాటిని పట్టించుకోకుండా ముందే ప్రచారాన్ని మొదలుపెట్టాయి కూటమి పార్టీలు. తమ అభ్యర్థుల విజయం కోసం అగ్రనేతలు ప్రచారంలో దూసుకెళుతున్నారు. విపక్షాలపై పదునైన వ్యాఖ్యలతో దాడులు చేస్తూనే తమ కూటమికి ఓటేయడం ఎంత ముఖ్యమో ఓటర్లకు వివరిస్తున్నారు.
నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) ఎప్పటిలా ఒంటరిగా బరిలో ఉండగా.. అన్నాడీఎంకే వేరైన తర్వాత ఎన్డీయే రెండు కూటములుగా చీలింది. ఇండియా కూటమితో కలిపి చతుర్ముఖ పోటీ రాష్ట్రంలో నడుస్తోంది. ఎన్టీకే ఎంతవరకు ఓటర్లను ప్రభావం చూపుతుందనేది అటుంచితే.. ప్రధాన కూటములు అన్నిచోట్లా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు వాడివేడి ఆరోపణలు చేస్తున్నాయి.
స్టాలిన్.. వాడి వేడి
ప్రధానంగా భాజపాకు ఏ ఒక్కస్థానం రాకుండా చేయాలనే లక్ష్యంతో డీఎంకే ప్రచారం మొదలుపెట్టింది. విలువైన ఓటును మోదీని గద్దె దించేలా, ఆయనకు వ్యతిరేకంగా ‘మానవత్వమున్న పీఎం’ను ఎన్నుకునేందుకు వినియోగించాలని పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు. తమిళనాడును ద్వేషించేవారిని కాక రాష్ట్రాన్ని ప్రేమించే వ్యక్తిని ప్రధానిని చేయాలని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఓటర్లను కోరుతున్నారు. భాజపాను ప్రజల మధ్య చిచ్చుపెట్టే పార్టీగా ఆయన పేర్కొంటున్నారు. మళ్లీ ఆ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని ఓటర్లను కోరుతున్నారు. మళ్లీ వస్తే జమ్ము కశ్మీరులాగా తమిళనాడును తయారు చేస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. కేంద్రం తమిళనాడుకు చేసిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తాను పాల్గొంటున్న సభల్లో వివరిస్తున్నారు. వరదలొచ్చి తమిళనాడు విలవిల్లాడుతున్నప్పుడు కూడా నిధులిచ్చి జాలి చూపలేదని ఆరోపిస్తున్నారు. డీఎంకే, రాష్ట్రంపై భాజపా కక్ష కట్టినట్లు చెబుతున్నారు. గవర్నర్ రవి ద్వారా చాలా బిల్లులు ఆపించారని, వాటి కోసం కోర్టులకెళ్లాల్సి వస్తోందని ఉదహరిస్తున్నారు. భాజపాకు అన్నాడీఎంకే మద్దతు కొనసాగుతోందని, అందరూ గుర్తించాలని చెబుతున్నారు. డీఎంకే పథకాల్ని వివరిస్తూ రాబోయే ఐదేళ్ల ప్రణాళికల్ని వివరిస్తున్నారు. సుమారు 20రోజుల ప్రచారాన్ని పెట్టుకుని సభలతో పాటు నేరుగా ఓటర్లను కలిసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎడప్పాడి.. తగ్గడంలేదు
భాజపా, డీఎంకే మధ్య అక్రమ పొత్తు ఉందంటూ అన్నాడీఎంకే ప్రచారం చేస్తోంది. పలుమార్లు మోదీని స్టాలిన్, ఉదయనిధి కలుసుకున్నారని చూపుతున్నారు. కేంద్రం అండతోనే పాలన కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు నిజమైన ప్రత్యర్థి డీఎంకేనేనని, ప్రజలు తమ పక్షాన నిలవాలని అభ్యర్థిస్తున్నారు. రాష్ట్రంలో మత్తుపదార్థాల సరఫరా పెరిగిందని, ఇందుకు బాధ్యత డీఎంకేనే వహించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తాను వెళ్లిచోటల్లా చెబుతున్నారు. మరోవైపు స్టాలిన్ ప్రభుత్వ హయాంలో వైఫల్యాల్ని ఎండగడుతున్నారు. 38 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి న్యాయం చేసే ప్రాజెక్టులు తేలేకపోయారని విమర్శిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రానికి మేలు జరిగిందని చెబుతున్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచడంలో భాగంగా అభివృద్ధిపై ముఖ్యమంత్రి స్టాలిన్తో నేరుగా ప్రజల మధ్య చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. మేకెదాటు డ్యామ్ నిర్మాణానికి కర్ణాటక సాహసిస్తున్నప్పుడు రైతుల పక్షాన డీఎంకేలేదని ఆరోపిస్తూ ఓటర్లకు గుర్తుచేస్తున్నారు. ఇక భాజపాతో కలవడమంటూ ఉండదని చెబుతూనే.. 2026 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడంతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే పూర్వవైభవం వచ్చేలా ప్రజలు సహకరించాలని అభ్యర్థిస్తున్నారు. స్టాలిన్కు పోటీగా సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు.
అన్నామలై.. రంకెలు
భాజపా అధ్యక్షుడు అన్నామలై ముందుగా కోయంబత్తూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడే నామినేషన్ వేయడంతో.. తన నియోజకవర్గం నుంచి మార్పు చూపిస్తామని అంటున్నారు. మోదీకి, కోయంబత్తూరు ప్రజలకు మధ్య తాను హాట్లైన్గా ఉండి అభివృద్ధి చేస్తానని అంటున్నారు. చైనాలాంటి అభివృద్ధి కనిపించాలన్నా, యూరప్లాంటి ప్రజాప్రతినిధులు తయారవ్వాలన్నా మోదీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటూ వివరిస్తున్నారు. డబ్బులు పంచకుండా ఎన్నికల్లో గెలవడమేంటో చూపిస్తానని సవాలు విసురుతున్నారు. మరోవైపు పార్టీపరంగా తన వాదాన్ని సభల్లో నేరుగా, మరోవైపు సామాజిక మాధ్యమాల ద్వారా వినిపిస్తున్నారు. ప్రజల్ని తమవైపు తిప్పుకోవడంలో భాగంగా ఎంజీఆర్, జయలలితను ఆదర్శంగా తీసుకున్నామనే రీతిలో ప్రచారం చేస్తున్నారు. గతంలో ఎన్డీయే వైపు ఉన్న ఓట్లు అన్నాడీఎంకే వేరుకుంపటి ద్వారా చీలకుండా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకేను మాత్రం విశ్వసించలేమని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లోపు ఎప్పుడైనా వారు డీఎంకేతో ఏకమయ్యేవారేనంటూ ప్రచారం చేస్తున్నారు. ఈసారి భాజపాను విశ్వసించాలని పిలుపునిస్తూనే.. డీఎంకే అవినీతి పాలనను అంతమొందించాలని కోరుతున్నారు.
సీమాన్.. తనదైన శైలిలో
మాటలతో ఆకట్టుకోవడంలో ఎన్టీకే అధినేత సీమాన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొంటున్నారు. తమ అభ్యర్థుల్ని అన్ని స్థానాల్లో పోటీకి పెడుతున్నానని చెబుతూనే.. వారంతా విప్లవకారులేనని అంటున్నారు. ప్రజల్ని తమవైపు తిప్పుకొనే ఏకైక బలమైన పార్టీ తమదేనంటూ, ఒంటరిగా ఇటు లోక్సభ, అటు అసెంబ్లీలో పోటీచేసే సత్తా తమకుందని నిరూపిస్తామని చెబుతున్నారు. ప్రజలు తమను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీ తమ ఆస్తి అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీ ఎవరికీ తలొగ్గదని చెబుతూనే.. ఎన్నికల బాండ్లకు సైతం తాము దూరంగా ఉన్నామంటూ వివరిస్తున్నారు. వజ్రాయుధంగా ఉన్న ఓటు వినియోగించి ప్రజలు మార్పును చూపించాలని, చరిత్ర తిరగరాసేలా చేయాలని అభ్యర్థిస్తున్నారు. అందరికన్నా ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం ప్రారంభించిన పార్టీ తమదేనంటూ జనాల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ తెస్తున్న జాతీయ విద్యా విధానాన్ని స్టాలిన్ వ్యతిరేకించారని, ఇప్పుడు మోడల్ స్కూళ్ల ద్వారా దాన్నే మెల్లగా అమలుచేస్తూ విద్యార్థుల్ని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల బాండ్ల విషయంలో భాజపానూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ రవాణాకు అడ్డుకట్ట
[ 27-04-2024]
అత్యంత విలువైన వస్తువుల్ని విదేశాల నుంచి అక్రమంగా తెచ్చేందుకు, తీసుకెళ్లేందుకు స్మగ్లర్లు పన్నుతున్న పన్నాగాలు అన్నీఇన్నీ కావు. కరుడుగట్టిన విదేశీ మాఫియాలతో చేతులు కలిపి.. రాష్ట్రాన్ని స్మగ్లర్ల అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
అట్టహాసంగా ఏఐ హ్యాకథాన్
[ 27-04-2024]
తమిళ భాషలో ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్)తో ‘నాన్ ముదల్వన్-అన్నా యూనివర్సిటీ-గువి తమిళనాడు కోడర్స్ ప్రీˆమియర్ లీగ్’ (ఎన్ఎం-ఏయూ- టీఎన్సీపీఎల్) ఆధ్వర్యంలో జరిగిన హ్యాకథాన్లో రాష్ట్రంలోని 400 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 82,688 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
హోసూర్లో నీటి ఎద్దడి
[ 27-04-2024]
హోసూర్లో నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 5 వేల లీటర్ల ట్రాక్టర్ ట్యాంకర్ నీరు రూ.1200 పలుకుతోంది. కొద్దిరోజుల కిందట రూ.600గా ఉండేది. -
తాగునీటి ట్యాంకులో ఆవు పేడ
[ 27-04-2024]
తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో తాగునీటి ట్యాంకులో ఆవు పేడ కలిపిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. -
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
[ 27-04-2024]
ఓట్ల లెక్కింపు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు సమీక్ష నిర్వహించారు. -
చెన్నై - తడ జాతీయ రహదారి పనులు వేగవంతం
[ 27-04-2024]
చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిలా తడ వరకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మితమవుతోంది. పనులు 95.75 శాతం మేరకు పూర్తయ్యాయి. ఇంకా 1.4 కిలోమీటర్ల దూరానికి జరగాల్సిన పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. -
స్మోక్ బిస్కెట్ల తయారీపై నిషేధం
[ 27-04-2024]
చెన్నైలో లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి తయారు చేసే స్మోక్ బిస్కెట్లపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ఆహార భద్రతాశాఖ పేర్కొంది. -
చెన్నైలో ట్రాఫిక్ ఆంక్షలు
[ 27-04-2024]
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్వే వద్ద మూడు నెలల పాటు ట్రాఫిక్లో మార్పులు చేసినట్టు ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. -
శివకార్తికేయన్ విడుదల చేసిన ఫొటో
[ 27-04-2024]
రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించిన చిత్రం ‘అమరన్’. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాష్ట్రానికి చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ కథా నేపథ్యంతో రూపొందింది. -
నిర్మాత జ్ఞానవేల్రాజా దంపతులపై ఫిర్యాదు
[ 27-04-2024]
సినీ నిర్మాత జ్ఞానవేల్రాజా, అతని భార్య నేహాపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటి పని మనిషి లక్ష్మిని ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఎన్నికల అధికారులు
[ 27-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కోసం నియమితులైన ఎన్నికల అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని తిరుప్పూర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి మురుగానందం ఆరోపించారు. -
బెదిరింపు రాజకీయాలకు భయపడం
[ 27-04-2024]
బెదిరింపు రాకీయాలకు భయపడబోమని మాజీ గవర్నర్ తమిళిసై తెలిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆళ్వార్పేటలోని పోలింగ్బూత్లో ఏజెంట్గా ఉన్న భాజపా నిర్వాహకుడు గౌతమన్పై డీఎంకే వారు దాడి చేశారని తమిళిసై ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే