ఆసరా అందలేదు.. భరోసా దక్కలేదు!
సంక్షేమ పథకాల అమలులో సర్కారు తడబడుతోంది. ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. నిధుల కొరతని పైకి చెబుతున్నా.. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాల అమలు కాస్తా వెనక్కి జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
గాడితప్పిన సర్కారు సంక్షేమ క్యాలెండర్
పథకాల సాయం కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
ఆసరా లబ్ధిదారులనుంచి వేలిముద్రలు తీసుకుంటున్న వెలుగు సిబ్బంది
సంక్షేమ పథకాల అమలులో సర్కారు తడబడుతోంది. ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సాయాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. నిధుల కొరతని పైకి చెబుతున్నా.. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాల అమలు కాస్తా వెనక్కి జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అమ్మ ఒడి సొమ్ములు మొదట్లో జనవరి నెలలో అందజేసేవారు.. తర్వాత జూన్ నెలకు మార్చారు..తాజాగా పొదుపు మహిళల రుణమాఫీకి సంబంధించి ఆసరా పథకాన్ని అక్టోబర్ నుంచి జనవరికి మార్చారు.. అయినా ఇప్పటికీ వారికి ఆసరా అందలేదు.. జనవరిలో ఇవ్వాల్సిన రైతు భరోసా పథకం కూడా గాడితప్పింది. ఫిబ్రవరి వచ్చినా ఇంకా అన్నదాతలకు భరోసా దక్కనే లేదు.. ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది లబ్ధిదారులు ఈ పథకాల సాయం కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు..
పొదుపు మహిళలు తీసుకున్న రుణాలు వైఎస్సార్ ఆసరా పేరుతో నాలుగు వాయిదాల్లో మాఫీ చేస్తామన్నారు. మొదటి విడతగా 2020 నవంబర్లో ఉమ్మడి జిల్లాలో 62,999 సంఘాలకు రూ. 456 కోట్లు ఖాతాల్లో వేశారు. రెండో విడత సొమ్ములు 2021 అక్టోబర్ 7న 63,991 సంఘాలకు రూ. 470 కోట్ల సాయం అందజేశారు. మూడోవిడత మొత్తం 2022 అక్టోబర్లోనే మహిళల ఖాతాల్లో పడాలి. కాని ప్రభుత్వం 2023 జనవరిలో అందజేస్తామని ముఖ్యమంత్రే ప్రకటించారు. ఆ మేరకు సర్కారు సంక్షేమ క్యాలెండర్లో పెట్టి సచివాలయాల వద్ద ప్రదర్శించారు. ఇందుకోసం రెండు నెలలు ముందుగానే ఈ పథకంలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళల నుంచి బయోమెట్రిక్ వివరాలు తీసుకున్నారు. జనవరి నెలలో ఆసరా అందితే పండగ ఖర్చులు ఒడ్డెక్కుతాయని పొదుపు మహిళలు ఎంతో ఆశపడ్డారు.. కానీ అందలేదు.. పండగ తర్వాతైనా అందుతాయేమోనని ఎదురుచూశారు. జనవరి దాటి ఫిబ్రవరి మొదటి వారంలోకి వచ్చినా ఈ పథకం లబ్ధి ఎప్పుడిచ్చేదీ అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మొదటి రెండు విడతలతో పోల్చితే మూడో విడత సాయం అందించడంలో ఇప్పటికే నాలుగు నెలలు ఆలస్యం కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ-కేవైసీ చేయించుకోడానికి ఆర్బీకేకు వచ్చిన రైతులు
రైతుకేదీ అండ?
అన్నదాతలకు పెట్టుబడి సాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పీఎం కిసాన్, వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఏడాదికి రూ. 13,500 అందజేస్తున్న సంగతి తెలిసిందే. 2022-23 ఖరీఫ్నకు సంబంధించి ఇప్పటికే పీఎం కిసాన్ ద్వారా రూ. 4 వేలు.. రైతు భరోసా ద్వారా రూ.7500 చొప్పున భూ యజమానులకు అందింది. మూడో విడతగా జనవరి నెలలో పీఎం కిసాన్ లబ్ధిదారులకు రూ. 2 వేలు, కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్, ఈనాం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి ఉంది. పీఎం కిసాన్ పథకం అందాలంటే ఈ-కేవైసీ పూర్తయి ఉండాలి. ఈ ప్రక్రియలో కాస్త జాప్యం జరగడంతోపాటు సాంకేతిక సమస్యలున్నాయని కేంద్ర ప్రభుత్వ మూడో విడత సాయాన్ని వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వ మూడో విడతలో ఇవ్వాల్సిన మొత్తం తక్కువగా ఉండడంతో పీఎం కిసాన్తో కలిసి ఇస్తే ఎక్కువ మొత్తం ఇచ్చినట్లవుతుందని రాష్ట్ర సర్కారు ఈ సాయం అందించకుండా చూస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం వచ్చినా ఈ పథకంపై ప్రభుత్వం ప్రకటన జారీ చేయకపోవడంపై రైతుల్లో అయోమయం నెలకొంది.
ఈ నెలలో అందే అవకాశం..
* ‘ఆసరా పథకానికి సంబందించి అర్హులను గుర్తించడం పూర్తయింది. మూడో విడత సాయం అందించే తేదీని ప్రభుత్వమే ప్రకటిస్తుంది. జనవరిలో అందించాల్సి ఉన్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెలలో అందే అవకాశం ఉంది’ అని అనకాపల్లి డీఆర్డీఏ లక్ష్మీపతి చెబుతున్నారు.
* ‘రైతు భరోసా సాయం బహుశా ఈనెల రెండో వారంలో అందించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. అర్హులైన రైతులందరికీ సాయం అందుతుంది..ఇందులో ఆందోళన అవసరం లేదు’ అని అనకాపల్లి జిల్లా వ్యవసాయాధికారి మోహనరావు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
అరకులోయ వైకాపాలో వర్గపోరు
[ 27-04-2024]
అరకులోయ నియోజకవర్గ వైకాపాను వర్గపోరు వెంటాడుతోంది. క్యాడర్ను అభ్యర్థి సమన్వయం చేసుకోవడం లేదు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
కలిసికట్టుగా కూటమిని గెలిపించండి
[ 27-04-2024]
వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పి రాష్ట్రం నుంచి పారదోలుదామని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
కళ్ల ముందే దుంగలు..ఎవరు దొంగలు?
[ 27-04-2024]
ఏజెన్సీ ప్రాంతంలో అటవీ సిబ్బంది అండదండలతో విలువైన టేకు, మారుజాతి దుంగలను అక్రమార్కులు తరలించుకుపోతున్నారు. -
జిల్లాలో 63 నామినేషన్లకు ఆమోదం
[ 27-04-2024]
అల్లూరి జిల్లాలో 68 మంది అభ్యర్థులు 103 నామినేషన్లు దాఖలు చేశారు. -
జనావాసాల్లో ఆసుపత్రి వ్యర్థాలు
[ 27-04-2024]
ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల అభివృద్ధికి నిధుల కేటాయింపులో పుర పాలకవర్గం వివక్ష చూపుతోంది. -
రెండు కిలోమీటర్ల రోడ్డు.. వంద గుంతలు
[ 27-04-2024]
పర్యటక పాంతం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రంప గ్రామానికి రోడ్డు వేయాలని అయిదేళ్లగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు గిరిజనులు మొరపెట్టుకొన్నారు. -
వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలి
[ 27-04-2024]
ప్రజలు తమ విలువైన ఓటుతో వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని సినీనటుడు హైపర్ ఆది పిలుపునిచ్చారు. -
ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
నేడు వైఎస్ షర్మిల పర్యటన
[ 27-04-2024]
పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
‘విశాఖ- మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?