ఇసుక బాధలు ఇంతింతకాదయా!
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు.
జగన్ పాలనలో నిర్మాణ రంగం కుదేలు
ఇసుక విధానంతో ముందుకు సాగని పనులు
పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం, న్యూస్టుడే: ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. తొలినాళ్లలో ఇసుక పాలసీని తీసుకొస్తామని కొన్ని నెలల పాటు ఇసుక దొరకని పరిస్థితిని తీసుకొచ్చారు. దీంతో భవన నిర్మాణాలు నిలిచిపోయి కూలీలంతా రోడ్డునపడ్డారు. ఇప్పటికీ ఇసుక విధానంలో ఒక నిర్ధిష్టమైన పద్ధతి లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఇసుకను తెప్పించుకునే దుస్థితి నెలకొంది. విశాఖ ఎంపీ, ప్రముఖ నిర్మాణ సంస్థ యజమాని ఎం.వి.వి.సత్యనారాయణ స్వయంగా ఇక్కడ వ్యాపారం చేయలేను.. హైదరాబాద్ వెళ్లిపోతానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చూస్తే ఇసుక కొరత ప్రభావం ఎంత ఉందో అర్థమవుతోంది.
ఒడిశా నుంచి కొనుగోలు.. నేను చిన్న చిన్న భవన నిర్మాణ పనులు చేస్తుంటాను. ఇక్కడ సక్రమంగా ఇసుక దొరక్కపోవడంతో ఒడిశా నుంచి ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తోంది. స్థానికంగా ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కావాల్సినంత దొరకడం లేదు. పనులు సక్రమంగా సాగక కూలీలు సైతం ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణదారులు కూడా పెరుగుతున్న ధరల కారణంగా ముందుకు రావడం లేదు.
టి.మహేశ్, నిర్మాణ రంగ వ్యాపారి
వ్యాపారులు అప్పుల పాలయ్యారు.. వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే సుమారు రెండేళ్ల పాటు ఇసుక అందుబాటులో లేకుండా చేయడంతో చిన్నచిన్న నిర్మాణదారులు పూర్తిగా అప్పుల పాలవగా, పెద్దపెద్ద స్థిరాస్తి వ్యాపారులు కట్టిన భవనాలు అమ్మకాలు జరగక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ ఇసుక పూర్తిస్థాయిలో అందుబాటు ధరలో లేకపోవడంతో వ్యాపారాలు సాగడం లేదు. మళ్లీ ఇదే ప్రభుత్వం వచ్చి ఇలానే కొనసాగితే మరింత ఇబ్బందులు తప్పవు.
దండు శ్రీనివాసరాజు, నాయుడతోట
గతంలో ఎంత కావాలంటే అంత... తెదేపా హయాంలో ఇసుక ఉచితంగా ఎంత కావాలంటే అంత లభించడంతో పేద, మధ్య, ఉన్నత వర్గాలకు చెందిన వారంతా ఇళ్లను నిర్మించుకున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారి వ్యాపారాలకు మాత్రం అందుబాటులో ఉండేలా చేసుకున్నారు. ఇసుక లేకపోవడంతో తాపీ మేస్త్రీలు, రోజు కూలీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇలా ఎంతోమంది రోడ్డున పడ్డారు.
నామాల అరుణ, బీసీకాలనీ వేపగుంట
ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు.. ఇసుక ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు, పేదలు ఇల్లు కట్టుకోవాలంటే భయపడుతున్నారు. ఇసుకకే సుమారు రెండు మూడు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో చాలామంది ఇళ్ల పనులను నిలిపివేశారు. జగన్ ప్రభుత్వంలో ఇసుక, సిమెంట్, ఇనుము తదితర భవన నిర్మాణ వస్తువుల ధరలు పెరిగిపోవడంతో కూలీలకు మూడు రోజులు మించి పని దొరకకపోవడంతో అవస్థలు తప్పడం లేదు.
పాల అచ్చిలనాయుడు, పాలవలస
వైకాపా నాయకులకు ఢోకా లేదు.. వైకాపా ప్రభుత్వం ఇసుకపై పెట్టిన ఆంక్షలను గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడూ చూడలేదు. దీని వల్ల సామాన్యులు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. వైకాపా నాయకుల నిర్మాణాలకు మాత్రం ఎటువంటి ఇసుక దొరుకుతోంది. ప్రభుత్వ భవనాలకు సైతం ఇసుక లేకపోవడంతో నాడు-నేడు పనులు నిలిచిపోయాయి.
కె.శ్రీనివాసవర్మ, అమ్ములపాలెం
ఆంక్షలు దారుణం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఇసుకపై జగన్ ఆంక్షలు విధించడం దారుణం. గతంలో యూనిట్లలో ఉండే ఇసుక నేడు టన్నుల్లో అమ్ముతున్నారు. గతంలో లారీ ఇసుక రూ.3 వేలకు దొరికేది. ఇప్పుడు రూ.9 వేలు అయినా దొరకడం లేదు. పని చేద్దామంటే ఇసుక దొరకకపోవడంతో నిర్మాణాలు పూర్తికావడం లేదు. తక్షణం ఇసుకపై ఆంక్షలు ఎత్తివేయాలి.
శరగడం ఝాన్సీలక్ష్మీరాణి, ఆరిపాక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి కార్యాలయంలో భారీగా తాయిలాలు.. సీజ్ చేసిన అధికారులు
[ 04-05-2024]
నగరంలో భారీగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
వైకాపా పాదాలు.. విశాఖ నిండా దందాలు!!
[ 04-05-2024]
అధికారంలోకి రాగానే విశాఖలో జగన్ రుషికొండపై విధ్వంసం చేస్తే.. వైకాపా కార్పొరేటర్లు ఊరికే ఉంటారా? విలువైన ప్రాజెక్టులు..భూములు ముఖ్య నేతలు కొల్లగొడుతుంటే కార్పొరేటర్లు కళ్లు మూసుకుంటారా? అన్నకు మించిన దందాలకు తెగబడ్డారు. -
జననేతనన్నావు.. జలమేదీ జగన్?
[ 04-05-2024]
బటన్లు నొక్కే జగన్కు జనాల బాధలు పట్టడం లేదు. ఈ అయిదేళ్లలో తాగునీటి పథకాలకు పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాలని చూశారు తప్ప ప్రజల గొంతు తడిపే ప్రయత్నమే చేయలేదు. వైకాపా పాలనలో గ్రామాల్లో కొత్తగా నీళ్ల కుండీలను నిర్మించిందీ లేదు. -
పేదల పొట్టకొట్టిన జగమొండి
[ 04-05-2024]
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్నవారి కడుపునింపడంలోనూ రాజకీయాలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. ఓపక్క పేదల పక్షపాతినని ఊదరగొడుతూనే మరోవైపు అదే పేదల పొట్టకొట్టారు. -
అభివృద్ధా.. విధ్వంసమా!!
[ 04-05-2024]
స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా శుక్రవారం నగరంలో బాలకృష్ణ రోడ్షో నిర్వహించారు. జాలారిపేట నుంచి మొదలైన రోడ్డు షో వెంకోజిపాలెం, డెయిరీ ఫాం కూడలి, రవీంద్రనగర్, చినగదిలి మీదుగా సాగింది. -
జగన్ సమర్పించు క్లాప్ దోపిడీ..!
[ 04-05-2024]
జగన్ ప్రభుత్వంలో దోపిడీ విధానాలు కోకొల్లలు. ఇంటింటి నుంచి చెత్తను సేకరించే క్లాప్ వాహనాల్లో కూడా వైకాపా కీలక నేతలు దండుకుంటున్నారు. -
సామాన్య భక్తులే లక్ష్యంగా..
[ 04-05-2024]
గత చందనోత్సవ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. -
ఎంవీవీ కార్యాలయంలో తనిఖీల కలకలం
[ 04-05-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ కార్యాలయంలో ఎన్నికల కమిషన్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. -
‘సీబీసీఎన్సీ’ ధూళి ప్రమాదకరం..!
[ 04-05-2024]
నగరం నడిబొడ్డున ఉన్న సీబీసీఎన్సీ (ది కన్వెన్షన్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ ది నార్తన్ సర్కార్స్)లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చేపడుతున్న భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో గృహాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని సీబీసీఎన్సీ ప్రతినిధి దాసరి యాకోబ్ తాడేపల్లి పత్రికా ప్రకటన ఇచ్చారు. -
చందనోత్సవ టికెట్ల విక్రయాలకు శ్రీకారం
[ 04-05-2024]
ఈనెల 10వ తేదీన చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శన టికెట్ల విక్రయం శుక్రవారం నుంచి ప్రారంభించారు. సింహగిరిపై జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి, ఆర్జేసీ సుబ్బారావు సంబంధిత వెబ్సైట్ను ప్రారంభించారు. -
ప్రజా సహకారంతో కూటమి గెలుపు : శ్రీభరత్
[ 04-05-2024]
తెదేపా కూటమి గెలుపునకు అన్ని వర్గాలు సహకరించాలని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ , గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కోరారు. -
కూటమితో మెరుగైన పాలన : గణబాబు
[ 04-05-2024]
తెదేపా కూటమితో మెరుగైన పాలన అందుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అన్నారు. శుక్రవారం ఆయన 92వ వార్డు ఇందిరానగర్, గణేశ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
పేదలను వేధిస్తున్న సైకో జగన్
[ 04-05-2024]
పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాసే వారి చిత్రాలను టీవీల్లో చూసి జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఆరోపించారు. -
కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
[ 04-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. జల్లూరు, సుంకపూరు, బాపిరాజు కొత్తపల్లి, రామచంద్రపాలెం, సన్యాసిరాజుపాలెం, పాములవాక, బోడపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగనన్న జాగాలు.. జోరుగా బేరాలు
[ 04-05-2024]
వైకాపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు, జగనన్న కాలనీల్లో పక్కా ఇళ్ల క్రయవిక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. -
పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటాం
[ 04-05-2024]
మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తూ వారిని చదివించే బాధ్యత తీసుకుంటామని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు పేర్కొన్నారు. -
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 04-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అదనంగా వినియోగించనున్న ఈవీఎంల (సప్లిమెంటరీ) ర్యాండమైజేషన్ను శుక్రవారం పూర్తి చేశారు. -
సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్
[ 04-05-2024]
విశాఖ జిల్లాకు చెందిన సర్వీసు ఓటర్లకు ఆన్లైన్లో పోస్టల్ బ్యాలెట్లను పంపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తేలింది. -
పోస్టల్ బ్యాలెట్ కోసం ఆరు కేంద్రాలు
[ 04-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాలో ఆరు ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారిణి రోజారాణి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహీభాయ్ ఇంకా ఆడాలి... క్రికెట్లో నాకు తండ్రిలాంటివారు: పతిరన
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!