గుర్తుందా.. జగన్ ఏలేరు పైపులైను..!
విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది.
డీపీఆర్ను అటకెక్కించిన వైకాపా ప్రభుత్వం
‘జలజీవన్’ను వినియోగించుకోలేని దుస్థితి
విశాఖ నీటి కష్టాలను పట్టించుకోని వైనం
విశాఖపట్నం, న్యూస్టుడే : విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేస్తాం.. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు జగన్.. వైకాపా పాలన ఐదేళ్లు పూర్తయింది. ఇప్పుడు చూస్తే నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. ఎన్నింటికో శంకుస్థాపనలు చేశారు.. వాటిల్లో ఒక్క ప్రాజెక్టు కూడా పట్టాలకెక్కలేదు. 2050 వరకు నగర నీటి అవసరాలను తీర్చే ఏలేరు పైపులైను ప్రాజెక్టునూ అటకెక్కించారు. ఇక జగన్ చెప్పే మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో లేమని నగరవాసులు మండిపడుతున్నారు.
రూ.4వేల కోట్ల డీపీఆర్ ఏమైందో..
విశాఖ నగర ప్రజలు, పరిశ్రమలకు అవసరమైన నీటి కోసం ఇతర జిల్లాలోని తాటిపూడి, రైవాడ, ఏలేరు వంటి వనరులపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడ్నుంచి నీటిని తరలించడానికి జీవీఎంసీ రూ.కోట్లలో వ్యయం చేయాల్సి వస్తోంది. అయినా వేసవివస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు. వైకాపా అధికారంలోకి రాగానే ఏలేరు రిజర్వాయర్ నుంచి విశాఖ నగరానికి రూ.4వేల కోట్లతో పైపులైను నిర్మిస్తామని ప్రకటించింది. జీవీఎంసీ అధికారులు జగన్ను కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ సమర్పించారు. ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఏలేరు నుంచి విశాఖ నగరానికి నీటిని తరలిస్తే 2050 వరకు ఇబ్బందులుండవు. కొత్త పరిశ్రమలొచ్చినా, వలసలు పెరిగినా నీటి కష్టాలు తలెత్తవని అధికారులు విన్నవించారు. అయినా వైకాపా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. కొంచెం దృష్టిపెట్టి ఉంటే జల్జీవన్ మిషన్ నుంచి నిధులు వచ్చేవి. జగన్ ఆ దిశగా ఆలోచించకపోవడం నగర ప్రజలకు శాపంగా మారింది.
సగం నీరు మధ్యలోనే ఆవిరి
ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ నుంచి కాలువ ద్వారా 350 ఎంఎల్డీ నీటిని విడుదల చేస్తే నగరానికి 190 ఎంఎల్డీలు మాత్రమే చేరుతోంది. ఆవిరి కావడం, రైతులు వ్యవసాయానికి తరలించడం వంటి చర్యలతో కేవలం సగం నీరు మాత్రమే నగరానికి వస్తోంది. పైపులైను నిర్మాణం జరిగితే 350 ఎంఎల్డీల నీరు నేరుగా నగరానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పురుషోత్తపట్నం ప్రాజెక్టే దిక్కు..
తెదేపా ప్రభుత్వ హయాంలో పురుషోత్తపట్నం వద్ద ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. వేసవిలో ఏలేరు రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గగానే గోదావరి నుంచి పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రాక ముందు జీవీఎంసీ ఏటా వేసవిలో రూ.2కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ఖర్చు చేసి నీటిని పంపింగ్ చేసేది. ప్రస్తుతం పురుషోత్తపట్నం ప్రాజెక్టు ద్వారా ఏలేరు రిజర్వాయరులోకి పంపిన నీరు కాలువ ద్వారా విశాఖకు వచ్చే సరికి సగం ఆవిరవుతోంది. పైపులైను నిర్మిస్తే ఈ సమస్య పరిష్కారమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారితోషికం మరిచిపోయారా సారూ..!
[ 21-05-2024]
ఎన్నికల విధుల్లో చాకిరి చేయించుకుని, పారితోషికంగా చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆశా కార్యకర్తలు వాపోతున్నారు. -
అప్రకటిత కోతలు.. అదనపు వాతలు
[ 21-05-2024]
ఎండలు మండిపోతే లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.. వర్షం కురిసినా.. గాలి వీచినా అంతకంటే వేగంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారు. -
పేదల ప్రాణాలతో చెలగాటం
[ 21-05-2024]
ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వైకాపా ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేదు. -
గౌరవ భృతికి ఎదరుచూపులు
[ 21-05-2024]
ఎన్నికల ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తున్న బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) గౌరవ భృతి కోసం ఎదురుచూస్తున్నారు. -
119 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యికిపైగా ఓట్లు
[ 21-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అత్యల్ప పోలింగ్ శాతం విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో నమోదైతే, అత్యధిక పోలింగ్ శాతం భీమిలి నియోజకవర్గం పరిధిలో నమోదైంది. -
బాధితులకు అండగా నిలిస్తే కేసులా.. : పల్లా
[ 21-05-2024]
ఓటమి భయంతోనే తెదేపా సానుభూతిపరులపై వైకాపా నాయకులు దాడులకు పాల్పడుతున్నారని తెదేపా గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విమర్శించారు -
డిసెంబరు 15న నేవీమారథాన్
[ 21-05-2024]
భారత నౌకాదళానికి చెందిన తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖపట్నం సాగరతీరంలో ఈఏడాది డిసెంబరు 15న నేవీ మారథాన్ నిర్వహించనున్నట్టు సోమవారం నేవీ వర్గాలు ప్రకటించాయి. -
కూండ్రంలో 24వ అగ్ని ప్రమాదం
[ 21-05-2024]
కూండ్రం గ్రామంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. -
అప్పన్న సేవకు తరలివచ్చిన దాసుడు
[ 21-05-2024]
ఒడిశా రాష్ట్రం బ్రహ్మపుర ప్రాంతానికి చెందిన అప్పన్న భక్తుడు లక్ష్మీకాంత నాయకో దాసుడు సోమవారం సాయంత్రం భక్త బృందంతో కలిసి సింహగిరికి తరలివచ్చారు. -
విజేతల ఊరేగింపులపై ఆంక్షలు
[ 21-05-2024]
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పరంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ విశాల్గున్నీ వివరించారు. -
గుర్తింపు కార్డు లేకున్నా అనుమతి
[ 21-05-2024]
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే గుర్తింపుకార్డులు లేకున్నా కొత్త రైతులను బజార్లకు అనుమతిచ్చేలా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపటం విమర్శలకు దారితీస్తోంది. -
‘తెలంగాణ ఈసెట్’లో విద్యార్థి సత్తా
[ 21-05-2024]
పరవాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి దళాయిపాలెం గ్రామానికి చెందిన ఆలవెల్లి ఖ్యాతీశ్వర్ సోమవారం విడుదలైన తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్) మెటలర్జికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. -
కళ్లెదుటే కుమారుడి మృత్యువాత
[ 21-05-2024]
ఇంటికి పెద్ద దిక్కు అయిన కుమారుడు కళ్లెదుటే రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లింది. -
ఎన్నికలనాటి ప్రేమ ఇప్పుడేమైంది..!
[ 21-05-2024]
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల జోలికే పోని నేతలు ఎన్నికల ముందు హడావిడి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని, రహదారులను బాగుచేస్తామని, పట్టణాలను సుందరీకరిస్తామని, సెంట్రల్ లైటింగ్తో వెలుగులు నింపుతామని ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి ఓటర్లకు గాలం వేశారు. -
కరకలో తవ్వకాలపై కన్నెర్ర
[ 21-05-2024]
అత్యంత విలువైన వైఢూర్యాలు (అలెక్స్ రకం రంగురాళ్లు) లభించే గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ చుట్టూరా గస్తీ పటిష్ఠం చేశారు. -
మూడు రోజులు.. 112 కిలోల చందనం
[ 21-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో సోమవారం మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ మరచిపోయిన బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’
-
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
-
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
-
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
-
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
-
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్