ఒక్కో విద్యార్థికి రూ.15వేలు ఇస్తాం.. : పల్లా
తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన 68వ వార్డు మింది గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
మిందిలో ప్రచారం చేస్తున్న కూటమి తెదేపా అభ్యర్థి పల్లా, తదితరులు
అక్కిరెడ్డిపాలెం, న్యూస్టుడే : తెదేపా కూటమి ప్రభుత్వంలో బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన 68వ వార్డు మింది గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటేసి... ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీభరత్ను గెలిపించాలని కోరారు. కూటమి నాయకులు ఈటి శ్రీను, అనంతలక్ష్మీ, రాజేశ్, నర్సింహమూర్తి, జయలక్ష్మి, షాలిని, జీవన్బాబు పాల్గొన్నారు.
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం : గణబాబు
కరాస, న్యూస్టుడే : తెదేపా కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. శనివారం ఉదయం ఆయన 57వ వార్డు పరిధి మర్రిపాలెం మెయిన్రోడ్డు, రామునాయుడుకాలనీ, శ్యామ్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా అరాచక పాలనలో అన్యాయానికి గురైన అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వంలో న్యాయం చేస్తామని, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. పశ్చిమ ఎమ్మెల్యేగా తనను, విశాఖ ఎంపీగా శ్రీభరత్ను గెలిపించేలా సైకిల్ గుర్తుపై ఓటేయాలని కోరారు. కూటమి నాయకులు పి.అజయ్బాబు, పి.శ్రీను, కె. శ్రీరామ్మూర్తి, శ్రీను, చిన్న, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
‘పాడిరైతుల కష్టం.. వైకాపా దుర్వినియోగం’
సింధియా, న్యూస్టుడే : పాడి రైతుల కష్టార్జితాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తుందని విశాఖ జిల్లా తెదేపా ఉపాధ్యక్షులు పొలిమేర సీతారామ్ ఆరోపించారు. రైతులకు ఏర్పాటు చేసిన ఆసుపత్రిని, డెయిరీని విశాఖ పశ్చిమ వైకాపా అభ్యర్థి ఆడారి ఆనంద్కుమార్ ఛైర్మన్ హోదాలో తన స్వప్రయోజనాలకు వినియోగించుకోవడం తగదని విమర్శించారు. శనివారం సాయంత్రం హిమాచల్నగర్ తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించి, డెయిరీ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన పనులు చేయించడంపై ఎన్నికల సంఘం ఆరా తీసి, చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్నా మాట్లాడుతూ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చొరవతో పూర్తయిన ఎన్ఏడీ పైవంతెన, టిడ్కో ఇళ్లు, ఇతర అభివృద్ధి పనులను వైకాపా తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎమ్మెల్యే గణబాబుపై డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు. తెదేపా ప్రతినిధులు నక్క లక్ష్మణరావు, సీహెచ్.రామోహ్మన్, ఎం.సోమేష్, వి.దినకర్, జోజిబాబు, ఉమామహేశ్వరి, ఎస్.శ్రీలక్ష్మి, డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.
జులైలో పింఛన్ రూ.7 వేలు ఇస్తాం: గంటా
పద్మనాభం, న్యూస్టుడే: కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు నెలకు రూ.4 వేలు పింఛను అందిస్తామని.. దీన్ని ఏప్రిల్ నెల నుంచే అమలు చేస్తామని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని కలిపి జులైలో రూ.7 వేలు అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం పద్మనాభం మండలంలోని శేరీఖండం, రెడ్డిపల్లి, మద్ది, పొట్నూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. దార్శనికతకు నిలువెత్తు రూపం చంద్రబాబునాయుడు అయితే.. విధ్వంసానికి జగన్ అని తెలిపారు. పర్యటనలో భాగంగా గంటాకు ప్రతి చోటా తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గజమాలలతో, బాణసంచా వెలుగులుతో అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నుంచి తెదేపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమోదును మించి.. పోలింగుకు పోటెత్తి
[ 18-05-2024]
సార్వత్రిక సమరంలో గతానికి భిన్నంగా ఈసారి ఓటర్లు పోటెత్తారు. ఎప్పుడూ పోలింగ్ బూత్ మొహం ఎరగని వారు కూడా ఈసారి ఓటెత్తారు. ఫలితంగానే రికార్డు స్థాయిలో 83.94 శాతం పోలింగ్ జరిగింది. -
ఓట్ల వేళ.. ఓటి పనులు!!
[ 18-05-2024]
ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైకాపా ప్రభుత్వం అభివృద్ధి పనుల పేరిట గాలం వేసింది. నాలుగేళ్లుగా పట్టించుకోకుండా ఎన్నికల వేళ హడావుడి అధికార పాలకవర్గం జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. -
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయి
[ 18-05-2024]
వైకాపా గూండాలకు రోజులు ముగిశాయని ఉత్తర నియోజకవర్గం భాజపా (కూటమి) ఎమ్మెల్యే అభ్యర్థి పి.విష్ణుకుమార్ రాజు హెచ్చరించారు. బర్మాక్యాంపు ప్రాంతంలో ఓ కుటుంబంపై దాడి ఘటనపై శుక్రవారం సీతమ్మధారలోని పార్టీ కార్యాలయంలో బాధితులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
5,56,819 మంది పోలింగ్కు దూరం
[ 18-05-2024]
విశాఖ పార్లమెంట్ పరిధిలో 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. కానీ అయిదేళ్లకోసారి వచ్చే అవకాశాన్ని 5 లక్షలకు పైగా ఓటర్లు జారవిడుచుకున్నారు. సమర్థులైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటు అనే వజ్రాయుధాన్ని వినియోగించుకోలేదు. -
కోడికత్తి కేసు వాయిదా
[ 18-05-2024]
కోడికత్తి కేసు విశాఖలోని ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం విచారణకు వచ్చింది. నిందితుడు శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. -
వేసవి క్రీడా శిబిరాలు ఉన్నట్టా.. లేనట్టా..!
[ 18-05-2024]
పాఠశాల స్థాయి విద్యార్థులకు వేసవి క్రీడా శిబిరాల నిర్వహణపై ఈ ఏడాది మహా విశాఖ నగరపాలక సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు శిబిరాలు ఉంటాయా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. -
నేడు నిర్మాల్య చందనం విక్రయాలకు విరామం
[ 18-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి నిర్మాల్య చందనం విక్రయానికి శనివారం విరామం ఇస్తున్నట్లు దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. -
దాడి పూర్వాపరాలపై డీసీపీ ఆరా
[ 18-05-2024]
తెదేపాకు ఓటు వేయలేదన్న కక్షతో కంచరపాలెం బర్మాక్యాంప్లో నూకాంబిక ఆలయం వద్ద గురువారం ఒక కుటుంబంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం డీసీపీ-2 ఎం.సత్తిబాబు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. -
వేడి నీటిలోకి జారిపడ్డ ఉక్కు కార్మికుడు
[ 18-05-2024]
విశాఖ ఉక్కు కర్మాగారంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో ఒప్పంద కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... కర్మాగారంలోని కోకోవెన్ బ్యాటరీ-3లో సెమీ స్కిల్డ్ వర్కర్గా పని చేస్తున్న జె.సాంబయ్య (55) ఉదయం జనరల్ షిఫ్ట్కు వెళ్లాడు. -
వైజాగ్ కన్వెన్షన్లో మెగా కన్జ్యూమర్ ఎక్స్పో
[ 18-05-2024]
పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్లో ఇండియా ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ ఫెయిర్(ఐఐసీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మెగా కన్జ్యూమర్ ఎక్స్పో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈనెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ ప్రదర్శనలో ఇంటీరియర్, ఫర్నీచర్, దుస్తులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తదితర వందకు పైగా స్టాళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. -
ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా తన్వి రిషిక
[ 18-05-2024]
ఇటీవల కేరళలో జరిగిన జూనియర్ మోడల్స్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో ప్రిన్సెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విన్నర్గా నిలిచిన నగరానికి చెందిన తన్వి రిషికను విశాఖ పౌరగ్రంథాలయంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. -
అమ్మవారి పండగపై పోలీసుల ఆంక్షలు
[ 18-05-2024]
కొమరవోలు గ్రామదేవత అయిన కొమరవోలు తల్లి పండగ ఈసారి పోలీసు ఆంక్షలతో సాదాసీదాగా సాగింది. ఈ పండగ మూడేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంటారు. -
పాడేరు మోదకొండమ్మ జాతర 9 నుంచి
[ 18-05-2024]
ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన మోదకొండమ్మ అమ్మవారి మహోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. -
నాలుగు రోజులు చిరుజల్లులు
[ 18-05-2024]
జిల్లాలో మరో నాలుగు రోజులు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం వాతావరణ అధారిత సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. -
వాహన లైటింగ్తో వేగాన్ని తేల్చేలా..
[ 18-05-2024]
టెలి కమ్యూనికేషన్ డే సందర్భంగా అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు నూతన టెక్నాలజీ లైఫై ప్రాజెక్టును రూపొందించారు. కాంతి మార్గం ద్వారా మనం అందించే సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేలా దీన్ని తయారుచేశారు. -
అక్రమార్కులకు అధికార పార్టీ అండ
[ 18-05-2024]
చీడికాడ మండలంలో గ్రావెల్ అక్రమ తరలింపు పెద్దఎత్తున జరుగుతోంది. అక్రమార్కులకు అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన
-
10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM