జులై @ 100శాతం!
నవరత్నాల్లో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్లను జులై ఆఖరు నాటికి వంద శాతం పూర్తి చేయాలని ఏఈ, డీఈలకు లక్ష్యాలను విధించారు. తొలుత పునాది స్థాయి దాటిన 27,000 ఇళ్లను మార్చి 31 నాటికి పూర్తి చేస్తారు. పునాదులు తవ్విన 69,000 ఇళ్లలో దశలవారీగా ని
గృహ నిర్మాణాల పూర్తికి అధికారులకు లక్ష్యాలు
లే అవుట్లలోనే ఇసుక డిపో, సిమెంట్ గోదాములు
పిల్లరు స్థాయిలో ఇంటి నిర్మాణం
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: నవరత్నాల్లో భాగంగా పేదలకు మంజూరు చేసిన ఇళ్లను జులై ఆఖరు నాటికి వంద శాతం పూర్తి చేయాలని ఏఈ, డీఈలకు లక్ష్యాలను విధించారు. తొలుత పునాది స్థాయి దాటిన 27,000 ఇళ్లను మార్చి 31 నాటికి పూర్తి చేస్తారు. పునాదులు తవ్విన 69,000 ఇళ్లలో దశలవారీగా నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటారు. ఈ నెలాఖరు నాటికి 20 శాతం, మార్చికి 30, జూన్కు 50, జులైకి వంద శాతం చేసేలా కార్యాచరణ రూపొందించారు.
అన్నీ లేఅవుట్లలోనే: జిల్లాలో 907 లేఅవుట్లు వేశారు. ఇక్కడే ఇసుక డిపోలు, సిమెంట్ గోదాములు ఏర్పాటు చేస్తారు. ప్రసుత్తం మూడు డిపోలు ఇసుకకు ఉండగా...చీపురుపల్లిలో కొత్తగా మరొకటి ఏర్పాటు చేస్తున్నారు. వంద దాటి ఇళ్లున్న 70 లేఅవుట్లలో ఇలా ఇసుక డిపోలు వెలుస్తాయి. జిల్లాలో బొబ్బిలి, గుంకలాం, నెల్లిమర్ల, పార్వతీపురం, చీపురుపల్లి లేఅవుట్లలో సిమెంట్ గోదాముల్ని నిర్మిస్తున్నారు. ఒక్కో గోదాముకి రూ.7 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం గుంకలాంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
* ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పనుల ప్రగతి తెలుసుకొనేందుకు వివరాలు నమోదు చేస్తారు. ప్రతి లేఅవుట్కు ఎంపీడీవో స్థాయి అధికారిని నియమించారు. క్లస్టర్, గ్రామ స్థాయిల్లో కూడా అధికారులు పర్యవేక్షిస్తారు. బీ లబ్ధిదారుడికి రూ.35వేలు డ్వాక్రా లేదా బ్యాంకు రుణ సదుపాయం మూడు శాతం వడ్డీకీ ఇళ్ల నిర్మాణానికి ఇస్తారు. మూడువేల మందికి ఇలా అందజేశారు.
* బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో రూ.120 కోట్ల బిల్లులకు గానూ ఇప్పటికే రూ.100 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి.
సమస్యల పరిష్కారానికి చర్యలు
ఇసుక, ఇనుము, సిమెంట్కు కొరత లేదు. సోమవారమే మక్కువ, సాలూరుకు ఇనుము పంపించాం. ఇండెంట్ మేరకు సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు సమస్యలు లేకుండా టోల్ఫ్రీ నంబరు 7093930298ను అందుబాటులోకి తెచ్చాం. ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం.
- పి.కూర్మినాయుడు, పీడీ, గృహనిర్మాణశాఖ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ఫిర్యాదుల కోసం సంప్రదించండి
[ 26-04-2024]
ఎన్నికల ఫిర్యాదుల కోసం 08922-797120, 08922- 797124 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి తెలిపారు. -
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం