వీరి ఆలోచన అద్భుతం
జిల్లాకు చెందిన విద్యార్థినులు రూపొందించిన ఓ ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో ఉత్తమ గుర్తింపు లభించింది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని గతేడాది అక్టోబరు 4 నుంచి 10 వరకు అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇస్రో, సీబీఎస్ఈ
జాతీయ స్థాయిలోజిల్లా విద్యార్థినుల ప్రతిభ
తయారు చేసిన త్రీడీ ప్రజ్ఞారోవర్ ప్రాజెక్టు
మయూరికూడలి, న్యూస్టుడే: జిల్లాకు చెందిన విద్యార్థినులు రూపొందించిన ఓ ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో ఉత్తమ గుర్తింపు లభించింది. ఈ నెల 14న ఫలితాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాలను పురస్కరించుకుని గతేడాది అక్టోబరు 4 నుంచి 10 వరకు అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇస్రో, సీబీఎస్ఈ సంయుక్తంగా ఏటీఎల్ స్పేస్ ఛాలెంజ్ పేరిట జాతీయస్థాయి పోటీలు నిర్వహించాయి. ఇందులో దేశంలోని 6,500 మంది విద్యార్థులు తయారు చేసిన 2,500 ప్రాజెక్టులను ప్రదర్శించారు. వాటిలో 75 అత్యుత్తమంగా నిలవగా రాష్ట్రం నుంచి విశాఖ, కడప, విజయనగరం జిల్లాలకు చెందిన ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. నెల్లిమర్ల బాలయోగి గురుకులం పాఠశాలకు చెందిన సైన్సు ఉపాధ్యాయురాలు ఐ.సీతమ్మ ఆధ్వర్యంలో 9వ తరగతి చదువుతున్న జి.లావణ్య, ఆర్.పూజిత, కె.చిన్నమ్మి తయారు చేసిన త్రీడీ ప్రజ్ఞా రోవర్ ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైంది.
ఉపయోగం ఇలా.. అంతరిక్షంలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలను ఇది తెలియజేస్తుందని గైడ్ ఉపాధ్యాయురాలు సీతమ్మ తెలిపారు. చంద్రయాన్-2కు సంబంధించిన సాంకేతిక భాగంగా 3-డి ప్రజ్ఞా రోవర్ పాజెక్టును తయారు చేసినట్లు వివరించారు. దీని తయారీ విషయంలో తన కంటే విద్యార్థులే ఎక్కువ శ్రద్ధపెట్టి, అంతరిక్షానికి సంబంధించి అనేక విషయాలను ఆవళింపు చేసుకుని రూపొందించారని పేర్కొన్నారు. జిల్లా ప్రాజెక్టుకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని, మున్ముందు మరిన్నింటిని తయారు చేయించేందుకు కృషి చేస్తున్నామని గురుకులాల జిల్లా సమన్వయాధికారిణి బలగ చంద్రావతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది.