మమ.. పరిశ్రమ
పరిశ్రమల ఏర్పాటుతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా.. ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదు. జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలోని పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక్కడ యూనిట్ల ఏర్పాటు కోసం స్థలాల కేటాయింపు అంతంతమాత్రంగా ఉండడంతో
స్థల కేటాయింపులు లేక ఏర్పాటు కాని యూనిట్లు
బొబ్బిలి పారిశ్రామికవాడ పరిస్థితి ఇదీ
ఇలా మూతపడిన యూనిట్లు ఎన్నో..
న్యూస్టుడే, బొబ్బిలి పరిశ్రమల ఏర్పాటుతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా.. ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదు. జిల్లాలోని బొబ్బిలి పారిశ్రామికవాడలోని పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక్కడ యూనిట్ల ఏర్పాటు కోసం స్థలాల కేటాయింపు అంతంతమాత్రంగా ఉండడంతో ఔత్సాహికులు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు కేటాయించిన స్థలాల్లో ఏళ్లుగా కొందరు పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదు. వారి జాబితా సేకరించినా చర్యలు లేకపోవడంతో ప్రగతి నిలిచిపోయింది. ఫలితంగా వాడలో ఖాళీ భూములే దర్శనమిస్తున్నాయి.
సింగిల్విండో విధానం అమలేదీ..
పరిశ్రమలకు స్థలాలు తీసుకుని యూనిట్లు ఏర్పాటు చేయని వారు పలు కారణాలు సాకుగా చెబుతున్నారు. సింగిల్విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఒకేసారి మంజూరు చేస్తామని అధికారులు ప్రకటించినా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. గతంలో ఉన్న విద్యుత్తు రాయితీని ఇప్పుడు ఎత్తేశారు. బ్యాంకర్ల నుంచి రుణాలు సక్రమంగా అందకపోవడం, ముడిసరకు కొరత, కూలీల సమస్య, విశాఖ పోర్టు దూరంగా ఉండడం వంటి సమస్యలను వారు చెబుతున్నారు. వాస్తవానికి స్థలం కోసం దరఖాస్తు చేసే ముందు ఔత్సాహికులు ఇవన్నీ తెలిసే యూనిట్ల ఏర్పాటుకు ఏపీఐఐసీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. తీసుకున్న ఆరు నెలల్లో యూనిట్లు ఏర్పాటు చేయాలి. అలా జరగడం లేదు. అధికారులు మాత్రం కొందరికే నోటీసులిచ్చి సరిపెడుతున్నారు.
ఓటీఎస్ వచ్చినా..
యూనిట్ల ఏర్పాటుకు గతంలో దరఖాస్తు చేసుకుని రుసుములు చెల్లించలేక స్థలాన్ని పొందలేని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల కోసం ఏపీఐఐసీ ఓటీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఒకేసారి మొత్తాలను చెల్లించి పాత ధరకు తీసుకునే వెసులుబాటు కల్పించింది. దీని వల్ల 28 మంది ఔత్సాహికులకు లబ్ధి కలిగే అవకాశం ఉంది. దీనిపై దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు అమలు చేయలేదు.
పదేళ్లుగా కానరాని కదలిక...
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్కు పదేళ్ల కిందట ఇక్కడ 220 ఎకరాలు కేటాయించారు. ప్లాంటు ఏర్పాటైతే సుమారు 1500 మందికి ఉపాధి లభిస్తుందని భావించారు. సాంకేతిక కారణాలతో నేటికీ పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దీనిని రద్దు చేయలేదు. బీకే స్టీల్కు సుమారు 300 ఎకరాలు కేటాయించగా, ఏర్పాటు చేయకపోవడంతో ఏపీఐఐసీ గతేడాది స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇందులో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా.. ఔత్సాహికులకు కేటాయించడం లేదు. ఇటీవల పలు రకాల యూనిట్ల కోసం ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
స్థలాలు స్వాధీనం చేసుకుంటాం
యూనిట్ల ఏర్పాటుకు స్థలాల కోసం చాలామంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ప్లాట్లు చూసి వెళ్తున్నారు. జాతీయ రహదారి అభివృద్ధి పనులు జరగడంతో కదలిక వచ్చింది. గతంలో స్థలాలు పొంది యూనిట్లు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇస్తున్నాం. వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. అవసరమైతే స్వాధీనం చేసుకుని కావాల్సిన వారికి కేటాయిస్తాం.-కృష్ణప్రసాద్, ఏపీఐఐసీ జోనల్ ఉప ప్రబంధకులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది.