భలే బండి.. తొక్కేయండి
గుర్ల మండలం గోషాడ గ్రామానికి చెందిన భావి ఇంజినీరు బోగురోతు బెనర్జీ తన ఆలోచనలకు పదును పెట్టి కొత్త బ్యాటరీ బైక్ను రూపొందించాడు. దీనికి ఒక్కసారి ఛార్జి చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతున్నాడు.
బెనర్జీ తయారు చేసిన వాహనం…
గుర్ల మండలం గోషాడ గ్రామానికి చెందిన భావి ఇంజినీరు బోగురోతు బెనర్జీ తన ఆలోచనలకు పదును పెట్టి కొత్త బ్యాటరీ బైక్ను రూపొందించాడు. దీనికి ఒక్కసారి ఛార్జి చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతున్నాడు. విజయనగరంలోని సీతం కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి ఇంధనంతో నడిచే పాత ద్విచక్రవాహనం నుంచి కొన్ని విడిభాగాలను తీసుకొని వాటికి రెండు బ్యాటరీలను అమర్చాడు. ఇందుకు రూ.20 వేలు ఖర్చు చేసినట్లు బెనర్జీ తెలిపాడు. ఇందులో రెండు మోటార్లు ఉంటాయని, ఒకటి పనిచేయకపోతే రెండోది వెంటనే పనిచేస్తుందని చెబుతున్నాడు. ఇందులో వెనుక చక్రం చైనుతో, ముందు చక్రం హబ్తో నడుస్తుందన్నాడు. ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రికల్ బైకుల కన్నా ఇది ఎంతో మెరుగైనందని పేర్కొన్నాడు.
- న్యూస్టుడే, గుర్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
[ 04-05-2024]
ఎందరో అభాగ్యులకు పింఛనే ఆధారం. ఆ డబ్బులు వస్తేనే పూట గడిచేది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరెందరో.. ఆ సొమ్ములతోనే మందులు కొనుక్కొని ప్రాణాలు నిలబెట్టుకునేది.. -
గద్దెనెక్కావ్.. చెరబట్టావ్
[ 04-05-2024]
ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు. -
జగన్మోసం ఇంటింత కాదయా!
[ 04-05-2024]
పదేళ్ల కిందట సంభవించిన హుద్హుద్ తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తీరంతో పాటు వందలాది గ్రామాల్లో బీభత్సం సృష్టించి తీవ్ర నష్టం మిగిల్చింది. -
తరుణీ.. ఛీకొట్టాల్సిన తరుణమిదే!
[ 04-05-2024]
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు ప్రచారాలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీ మహిళా ఓట్లపై దృష్టి పెట్టి తాయిలాల పంపిణీకి పథకాలు రూపొందిస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి మహిళలకు చీర, రూ.500 నోటు పంపిణీ చేస్తున్న వీడియో ఇటీవల చక్కర్లు కొట్టింది. -
ఆమె నేత్రాలు సజీవం
[ 04-05-2024]
మనిషి మరణించాక.. దేహంతో పాటు నేత్రాలను మట్టిలో కలిపేయడం కంటే వాటిని దానం చేస్తే మరో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించొచ్చు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన బండి సత్యవతి (73) వయోభారంతో గురువారం మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. -
వైకాపా నుంచి తెదేపాలోకి 440 కుటుంబాలు
[ 04-05-2024]
తెదేపాలో చేరికలు కొనసాగుతున్నాయి. నగరంలో శుక్రవారం 37, 48 డివిజన్ల నుంచి 440 కుటుంబాలు తెదేపాలో చేరాయి. -
రౌడీయిజం వైకాపా నైజం
[ 04-05-2024]
‘వైకాపాది రౌడీయిజం.. వారి నైజమే అది.. అభివృద్ధిని కాంక్షించేది తెదేపానే.. ఈ ఐదేళ్లలో అధికార పార్టీ నేతలు ఉత్తరాంధ్రను దోచుకున్నారు.. వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించాలి’ అని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. -
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి కావాలి
[ 04-05-2024]
పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 11 నాటికే ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారిణి నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
[ 04-05-2024]
అప్పుల బాధ తాళలేక చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చందులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. చందులూరు గ్రామానికి చెందిన వాడబోయిన అప్పలరాజు (36) అప్పులు చేసి తీర్చలేక అవస్థలు పడుతున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’