logo

సెట్విన్‌ సీఈవోగా రామ్‌గోపాల్

యువజన సర్వీసుల శాఖ(సెట్విన్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బి.రామ్‌గోపాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Updated : 19 Jan 2023 16:50 IST

విజయనగరం రింగురోడ్డు: యువజన సర్వీసుల శాఖ(సెట్విన్‌) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బి.రామ్‌గోపాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక సీఈవో దుర్గాప్రసాద్‌ ఆయనకు స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు. 2018 తర్వాత తాత్కాలిక అధికారులతోనే ఈ విభాగాన్ని నడిపించుకు వస్తున్నారు. చాలా రోజుల తర్వాత శాశ్వత పోస్టులో సీఈవోను  నియమించడం ఆనందంగా ఉందని కార్యాలయ వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి. రామ్‌గోపాల్‌ అమరావతి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ముఖ్య శిక్షకులు పి.అప్పలనాయుడు, తదితరులు స్వాగతం పలికారు. ఆయనకు పుష్ఫగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని