కోట్లే.. కోట్లు
ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టి సారించింది. భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లే ప్రధాన ఆదాయ వనరు కావడంతో వాటి మార్కెట్ విలువ పెంచింది.
మూడు జిల్లాల్లో భారీగా పెరిగిన భూముల విలువ
ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయలక్ష్యం రెట్టింపు
ఈనాడు, పార్వతీపురం మన్యం: ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టి సారించింది. భూముల క్రయ, విక్రయాలు, రిజిస్ట్రేషన్లే ప్రధాన ఆదాయ వనరు కావడంతో వాటి మార్కెట్ విలువ పెంచింది. ఈ నెల ఒకటి నుంచి అమలు చేస్తోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.825.39 కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. విజయనగరం జోన్ పరిధిలో 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్న శ్రీకాకుళం జిల్లా లక్ష్యం రూ.281.47 కోట్లు.. 11 కార్యాలయాలు ఉన్న విజయనగరం జిల్లా లక్ష్యం రూ.460.64 కోట్లు.. నాలుగు కార్యాలయాలు ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా లక్ష్యం రూ.83.27 కోట్లుగా పేర్కొంది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.490.38 కోట్లు కాగా.. ఈ సారి దాదాపు రెట్టింపుతో ఆ శాఖ యంత్రాంగానికి భారీ లక్ష్యం విధించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పది రోజుల క్రితం నుంచే ఆయా జిల్లాల్లో పెద్దఎత్తున కసరత్తు జరిగింది. సంబంధిత అధికారులు రూపొందించిన జాబితాను ఆయా జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆమోదంతో సిద్ధం చేసిన తుది జాబితాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాల విభజన తర్వాత ఆ జిల్లా కేంద్రాల్లోనే భూముల విలువ పెంచింది. ఇప్పుడు తాజాగా స్పెషల్ రివిజన్ పేరిట మరికొన్ని ప్రాంతాల్లో పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రాతిపదిక ఏదైనా.. పెంపు ప్రధానం
* ఈసారి స్పెషల్ రివిజన్ పేరిట నాలుగు అంశాల ప్రాతపదికన భూముల విలువ పెంచింది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి భోగాపురం మండలం అనువైనదని గుర్తించిన తర్వాత తొమ్మిదేళ్లుగా ఆ భూముల జోలికిపోలేదు. ఎందుకంటే భవిష్యత్తులో అక్కడ రైతుల నుంచి భూసేకరణ జరిపితే మార్కెట్ ధర కంటే మూడు రెట్లు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ పూర్తవ్వడం.. శంకుస్థాపన సైతం జరగడంతో ఆ పరిసర ప్రాంతాల భూములపై కన్నేసింది. విమానాశ్రయం భూముల్లోకి అయిదు గ్రామాలు వెళ్లిపోవడంతో, మిగిలిన నాలుగు గ్రామాల్లో దాదాపు వంద శాతం వరకు భూముల విలువ పెంచేసింది.
* రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తయిన అన్ని ప్రాంతాల్లోని భూములను గుర్తించారు. దీంతో కేవలం రహదారులను ఆనుకుని ఉన్న భూముల ధరలనే పెంచారు. విజయనగరం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో 35 శాతం నుంచి 40 శాతం వరకు పెంచారు. గజం రూ.2,500 ఉన్న చోట రూ.3 వేలు, మరో చోట రూ.3,500 ఇలా ఆ ప్రాంతంలో నాలుగేళ్లలో జరిగిన భూక్రయ, విక్రయ లావాదేవీలను పరిగణనలోకి తీసుకున్నారు.
* భోగాపురం విమానాశ్రయం నిర్మాణ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు గజం రూ.1,800 ఉండగా.. రూ.4 వేలకు, భోగాపురం మండలంలో జాతీయ రహదారికి ఇరువైపులా గజం రూ.2,800 నుంచి రూ.4 వేలు, భోగాపురం మండల కేంద్రంలో రూ.3,200 నుంచి రూ.5 వేలు చేశారు.
* కొంత మంది భూములు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి.. ఎక్కువ రుణం కోసం వాటి విలువ అమాంతం పెంచారు. బ్యాంకులు ఆ మేరకు రుణాలు ఇచ్చాయి. ఇప్పుడు ఆ సర్వే నంబర్ల ఆధారంగా విలువ పెంచడంతో ఇప్పుడు ఆ భూముల పరిసర ప్రాంత యజమానులు, కొనుగోలుదారులపై భారం పడింది.
కొన్ని ప్రాంతాల్లో పెంపు
- పి.విజయలక్ష్మి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, విజయనగరం జోన్
అధికారికంగా అన్ని పత్రాలు పరిశీలించి, వాస్తవ విలువలను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ అధ్యయనంతో మాదిరి లెక్కలేసి కొన్ని ప్రాంతాల్లోనే భూముల విలువ ప్రభుత్వం పెంచింది. విజయనగరం జిల్లాలో 2,216 సర్వే నంబర్లలో కొంత విస్తీర్ణంలోనే పెరిగాయి. కొన్నేళ్ల నుంచి పెరగని భూములనూ ఎంపిక చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చీపురుపల్లిలో విజయం సాధించి తీరాలి
[ 26-04-2024]
‘చీపురుపల్లిలో విజయమే లక్ష్యంగా కిమిడి కుటుంబం అంతా కలిసి పనిచేయండి.. పరస్పరం సహకరించుకోండి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. -
చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే
[ 26-04-2024]
దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. -
‘రెస్కోకు’.. బొత్స విలీన ‘మస్కా’
[ 26-04-2024]
ఓ చరిత్ర: చీపురుపల్లి గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థది (ఆర్ఈసీఎస్- రెస్కో) నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. వెనుకబడిన ప్రాంతంలో వెలుగులు నింపిన ఒక ఐకాన్. సహకార రంగంలో వినియోగదారుల మన్ననలు అందుకుంది. -
ముగిసిన నామినేషన్ల స్వీకరణ
[ 26-04-2024]
నామినేషన్ల స్వీకరణ గురువారం ముగిసింది. ఈనెల 16న ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు శాసనససభ స్థానాలకు 105 మంది 184, విజయనగరం పార్లమెంటుకు 18 మంది 30 సెట్లు సమర్పించారు. -
నా అంటూనే.. ఉద్యోగులపై ఉక్కుపాదం
[ 26-04-2024]
సీపీఎస్ను రద్దు చేస్తాం.. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తామని అయిదేళ్ల క్రితం జగన్ హామీ ఇచ్చారు. అది నిజమనుకుని అందరూ నమ్మి ఓటేశారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిపై కక్ష పెంచుకున్నారు. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్